బాలీవుడ్ అగ్ర నటీనటులు రణ్బీర్ కపూర్, కొన్నాళ్లుగా ప్రేమలోకంలో విహరిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా ఈ ప్రేమపక్షులు బయట విహరిస్తూ కెమెరాల కంట పడుతూనే ఉంటాయి. ఆలియా అయితే షూటింగులకు బ్రేక్ ఇచ్చి మరీ ప్రియుడిని కలుస్తూ ఉంటుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ బీటౌన్లో చాలాకాలం ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆలియాతో పెళ్లి విషయమై రణ్బీర్ షాకింగ్ విషయం తెలిపాడు. తామిద్దరం 2020లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నామని వెల్లడించాడు. అయితే కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడిందని, లేకపోతే ఈపాటికే జరిగిపోయి ఉండేదని తెలిపాడు. ‘ ఈ లాక్డౌన్ కాలంలో ఆలియా గిటార్ నుంచి స్క్రీన్ రైటింగ్ వరకు అన్నీ నేర్చుకుందని, ఆలియాతో తాను ఎందులోనూ పోటీపడలేనని చెప్పాడు. ప్రస్తుతం వీరిద్దరు ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌనీ రాయ్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M1zdoB
No comments:
Post a Comment