Tuesday 30 June 2020

నటి పూర్ణను వేధించిన ముఠా అరెస్ట్.. గ్యాంగ్‌తో ఓ నటుడికి సంబంధాలు

అవును, సీమ టపాకాయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ. ఆమె అసలు పేరు . స్వస్థలం కేరళ. లాక్ డౌన్‌తో గత కొన్ని రోజులుగా పూర్ణ తన తల్లిదండ్రులతో కలిసి కేరళలోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను సోషల్ మీడియా వేదికగా ఓ గ్యాంగ్ వేధింపులకు గురి చేసింది. దీంతో పూర్ణ పోలీసుల్ని ఆశ్రయించింది. ఓ నలుగురు వ్యక్తుల నుంచి ఇటీవల వేదింపులు ఎదురవుతున్నట్టుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు రాంగ్ కాల్స్‌ చేయడంతో పాటు డబ్బు ఇవ్వాలని ఆ వ్యక్తులు వేదిస్తున్నట్టుగా పోలీసులకు పూర్ణ ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులుగా తన సోషల్ మీడియా పేజ్‌లలోనూ వారు ఇబ్బందికరంగా పోస్ట్‌ లు పెడుతున్నారంటూ ఆమె పోలీసులకు తెలిపింది. దీతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్ణను వేధింపులకు గురి చేసిన పలువురిని అరెస్ట్ చేశారు. ఓ హెయిర్‌ స్టైలిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీస్‌ కమీషనర్‌ విజయ్‌ సఖారే ఈ వివరాలను వెల్లడించారు. అంతేకాదు పూర్ణను వేధించిన ముఠా మరో 8 మంది మోడల్స్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించిందని పోలీసులు అధికారులు వెల్లడించారు. మొదటగా గ్యాంగ్ సభ్యులు వివాహ ప్రతిపాదన ద్వారా పూర్ణ కుటుంబ సభ్యులతో సంబంధాలు ఏర్పరచుకుని, ఆ తరువాత కిడ్నాప్ చేసి, ఒక హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని ప్లాన్ వేశారని పోలీసులు వివరించారు. ఈ క్రమంలోనే ఆమె నుంచి ఒక లక్ష 50 వేల రూపాయలు డిమాండ్ చేశారని.. ఇది విఫలం కావడంతో కిడ్నాప్ ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిపారు. సినిమా ఆఫర్ల పేరుతో నటీనటుల వివరాలను సేకరించి, బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయాలనేది వీళ్ల పథకమని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ముఠాకు సంబంధించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీలో హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అతడిని విచారించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్‌ డౌన్‌ సమయంలో ధర్మజన్‌, స్టైలిస్ట్‌లను ముఠా సభ్యులు సంప్రదించినట్టుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YLxjws

Carlyle to Buy 25 Percent of Airtel's Data Centre Arm for $235 Million

Carlyle will buy a 25 percent stake in Indian telecom firm Bharti Airtel Ltd's data centre arm for $235 million, the US private equity group said on Wednesday, as it taps into the rapid growth of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YMLm4G

China Says India's Ban on Chinese Apps May Violate WTO Rules

China said on Tuesday that India's move to ban 59 Chinese-origin mobile apps could be a breach of World Trade Organisation (WTO) rules, and urged New Delhi to create an open and fair business...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ihWUVt

Oppo Reno 3 Pro Price in India Slashes By Rs. 2,000

Oppo Reno 3 Pro price in India has been dropped from the existing Rs. 31,990 to Rs. 29,990 for the base, 8GB RAM + 128GB storage variant.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BjEYJA

Vivo X50 Series Teased to Launch in India Soon

Vivo X50 series is coming to India, a teaser has revealed. The company noted in a video teaser published on Twitter that it would launch the Vivo X50 series in the country soon. The Vivo X50 series...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eMHZ3y

Samsung Galaxy J6, Galaxy On6 Starts Receiving Android 10 in India: Report

Samsung Galaxy J6 and its online-only variant Samsung Galaxy On6, are reportedly getting Android 10-based One UI 2.0 update. Here's all you need to know.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gfMCmV

Facebook Bans Accounts Linked to Anti-Government US 'Boogaloo' Movement

Facebook stepped up the battle against the amorphous anti-government "boogaloo" movement on Tuesday, banning accounts of adherents who encouraged violence during recent anti-racism protests across the...

from NDTV Gadgets - Latest https://ift.tt/38jaCTe

Apple Not Dominant in Any Market, Plenty of Rivals, Senior Executive Says

iPhone maker Apple, the target of EU antitrust investigations into key segments of its business, on Tuesday rejected accusations of market dominance, saying it competes with Google, Samsung and other...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BQZYHx

Facebook Agrees to Audit Its Hate Speech Controls

Facebook said on Monday it would submit itself to an audit of how it controls hate speech in a bid to appease a growing advertising boycott of the platform, as it prepared to address a group of...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NHJLH1

Cisco Accused of Job Discrimination Based on Indian Employee's Caste

California regulators sued Cisco Systems on Tuesday, accusing it of discriminating against an Indian-American employee and allowing him to be harassed by two managers because he was from a lower...

from NDTV Gadgets - Latest https://ift.tt/38gYpyt

Redmi Note 9 Pro Max to Go on Sale in India Today via Amazon, Mi.com

Redmi Note 9 Pro Max is all set to go on sale in India once again. The sale will begin at 12pm (noon) IST on Amazon India and Mi.com. The phone has been on flash sales since launch due to ongoing...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BQOIuK

ఏంది సారూ!! మా కరెంట్ బిల్.. సందీప్ కిషన్ సెటైర్లు

లాక్ డౌన్‌లో కరెంట్ బిల్లుల షాక్.. హీరో సందీప్ కిషన్‌కి తగిలింది. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉండటంతో కరెంట్ వాడకం బాగా ఎక్కువైంది. ఈ లాక్ డౌన్‌లో విద్యుత్ వినియోగం బాగా ఎక్కువ కావడంతో.. విద్యుత్ బిల్లులు కూడా పేలిపోతున్నాయి. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లించలేక సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. సెలబ్రిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే తాప్సీ, కార్తీక లాంటి సెలబ్రిటీలకు కరెంట్ బిల్లులు షాక్ తగలగా.. ఈ విషయాన్ని షేర్ చేస్తూ పవర్ బిల్లులపై పవర్ ఫుల్ పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా సైతం స్పందిస్తూ.. ‘పవర్ బిల్లులు ఇలాగే వస్తే.. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చింది అని ఆన్‌లైన్‌ వార్‌ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ‘మా ఇంట్లోని ఎలక్ట్రిసిటీ బోర్డు మీటర్‌ని చూస్తే చిన్నప్పుడు గిర్రుమంటూ తిరిగే ఆటో రిక్షా మీటర్‌ గుర్తొచ్చింది. ఏంది సర్‌ ఆ బిల్లులు. కొత్తగా రిలీజైన సినిమాల వీకెండ్‌ కలెక్షన్లలా కరెంట్‌ బిల్లులు ఉన్నాయి’ అంటూ సెటైర్లు వేశాడు సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్‌కి ఎంత కరెంట్ బిల్ వచ్చిందన్న విషయాన్ని తెలియజేయకపోవడంతో.. ఇంతకీ మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొంత మంది స్పందిస్తూ.. మాకు ఇంతకు ముందు రూ.300 వచ్చేది.. కాని లాక్ డౌన్ వల్ల 3230 వచ్చింది, అయినా ఇంట్లోనే ఉండి ఏసీలు అన్నీ వేసుకుని ఉంటే బిల్ రాకుండా బాక్సాఫీస్ కలెక్షన్లు వస్తాయా? అయినా వీకెండ్ కలెక్షన్లు ఎప్పుడూ మీకే రావాలా?? ఈ సారి ఫర్ ఆ చేంజ్ గవర్నమెంట్ కి వస్తున్నాయ్ సందీప్ అన్న’.. అంటూ సందీప్ కిషన్ పోస్ట్‌పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NLL4oo

రఘు రామ కృష్ణం రాజుపై వర్మ పోస్ట్.. అతని కులాన్ని ప్రస్తావిస్తూ కామెంట్స్

ఏంటండీ.. రాజుగారూ!! మీకు కాస్త వర్మ గాలి సోకినట్టు ఉంది.. ఆయనలాగే లాజిక్‌గా మాట్లాడుతూ నాకు నచ్చిందే చేస్తా.. నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా అని షోకాజ్‌లకే తిరిగి షోకాజ్‌లు ఇస్తున్నారు. కొంపతీసి మీపై వర్మ ప్రభావం ఏం లేదు కదా?? అని నరసాపురం వైసీపీ ఎంపీ రాఘు రామ కృష్ణం రాజును అడిగితే ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. భలేవారే.. నాపై వర్మ ప్రభావం లేకపోవడం ఏంటండీ!! ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన యాటట్యూట్‌ అంటే పిచ్చి. అంతేకాదు.. మా ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కూడా ఉంది. నేను ఆయన చాలా స్లోగా మాట్లాడుతుంటాం. ఇద్దరి వాయిస్‌లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. వాయిస్‌‌ల పరంగా మేం ఇద్దరం వీక్ అయినా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేస్తాం’ అంటూ ఈ ఎంపీ గారు తనలోని వర్మని బయటపెట్టారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ.. ‘మైండ్ బ్లోయింగ్.. రాజుగారూ!! రాజకీయాల్లో ఇలాంటి పర్సనాలిటీని ఇప్పుడే చూస్తున్నా.. వెరీ ఇంట్రస్టింగ్ అంటూ కామెంట్ చేశారు. ఇక ట్విట్టర్‌లో రాఘు రామ కృష్ణం రాజుని సింహంతో పోల్చుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజు అనే క్యాస్ట్ ఫీలింగ్ లేదు.., కాని నాకు ఖచ్చితంగా రఘు రామ కృష్ణరాజు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అతను నిజమైన సింహం.. అతను నిజమైన హీరో.. సింహం ఒక్కటే సింగిల్’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. అయితే వర్మ పోస్ట్‌పై మండిపడుతున్నాయి వైసీపీ వర్గాలు.. ‘పోవయ్యా!! బూతు డైరెక్టరూ.. మొదట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, తరువాత షోకాజ్ నోటీసులు పంపాక తిరిగి తోక ముడుచుకొని జగన్ అన్నకి క్షమాపణలు చెప్పాడు.. అతను ఎలా హీరో అవుతాడు.. క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని ఇంత కులపిచ్చితో మాట్లాడుతున్నావు’, ‘ఇంకెందుకు ఆలస్యం సినిమా మొదలుపెట్టు మరి.. కాని ఒక్కమాట ‘సింహం సింగల్‌గా వస్తూంది కానీ సింగల్‌గా వచ్చిన ప్రతీది సింహం కాలేదు. గజ్జి కుక్క కూడా సింగిలే. ఎవరూ దగ్గరికి రానివ్వరు కాబట్టి అంత మాత్రాన అది సింహం అన్నట్టు కాదు’ అంటూ వర్మ పోస్ట్‌పై పంచ్‌లు వేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YLqkU4

కరోనాను జయించిన బండ్ల గణేష్.. రిపోర్ట్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమెడియన్, నిర్మాత, పౌల్ట్రీ యజమాని పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు కేసులు పెరుగిపోతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నగరంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్లిన నిర్మాత బండ్ల గణేష్‌కి కరోనా సోకడం ఇండస్ట్రీలో కలకలం రేగింది. ఒకవైపు షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన తరుణంలో బండ్ల గణేష్‌కి కరోనా సోకడంతో ఈ వైరస్ ఎప్పుడు ఏ సెలబ్రిటీకి వ్యాపిస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే సుమారు 14 రోజుల చికిత్స అనంతరం నిర్మాత బండ్ల గణేష్ కరోనాను జయించి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తనను ప్రాణాలను కాపాడిన దేవుడికి ధన్యవాదాలు తెలియజేశారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా అపోలో డయోగ్నోస్టిక్స్‌లో నిర్వహించిన కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ని షేర్ చేశారు బండ్ల గణేష్. కాగా ‘మీరు చేసిన మంచి పనులు వల్ల దేవుడు నీయందున ఉండి మీకు మంచి చేశారు.. కరోనాను జయించారు. జాగ్రత్తగా ఉండి మంచి ఆహారం తీసుకోండి’ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YOlkyk

Exclusive! How this man transformed India's batting

'The 2014 Australia tour and the brand of cricket played by the team laid a great foundation of the brilliant run of success enjoyed across all formats and conditions.'

from rediff Top Interviews https://ift.tt/31wY8Gr

COVID-19: 'Mumbai's numbers are an under-estimate'

'We have to be really careful about the unlocking of the city.'

from rediff Top Interviews https://ift.tt/2NFPa1o

Why we need more Ladakh Scouts to defeat the Chinese

'The Ladakh Scouts are a fantastic mountain troops suited to this terrain.'

from rediff Top Interviews https://ift.tt/3f0LTWJ

OnePlus Pods Tipped to Come in Black Colour With In-Ear Design

OnePlus' first truly wireless earbuds, rumoured to be called the OnePlus Pods, have been in the news for quite some time now with no concrete information on the specifications or design. Now, a...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NMFcex

Facebook Ad Boycott Enters New Phase, Impact Remains Unclear

The advertiser boycott of Facebook has morphed into a global digital activist campaign aimed at curbing hateful and toxic content on the social media giant. But its impact remains unclear.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YLCFaZ

Monday 29 June 2020

Ram Gopal Varma: 'పవర్ స్టార్' ఎవరో తెలిసిపోయింది.. ఇవిగో పూర్తి వివరాలు!! వాళ్ళిద్దరి మధ్య డీల్..

సమయం, సందర్భం ఏదైనా సరే.. రామ్ గోపాల్ వర్మకు తెలిసిన ఒకే ఒక మంత్రం సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వార్తల్లో నిలవడం. ఆయన మాట, దూసుకుపోయే విధానం, తీసే సినిమాలు దేనికవి ప్రత్యేకమే. అది సినిమా అయినా, ఇంటర్వ్యూ అయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టేయడం వర్మ నైజం. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా మోల్డ్ అవుతూ సినిమాలు రూపొందించడం ఆయన లోని స్పెషల్ క్వాలిటీ. ఈ క్రమంలోనే డిజిటల్ టెక్నాలజీకి, ఆన్‌లైన్ వేదికలకు డిమాండ్ పెరుగుతుండటం క్యాచ్ చేసుకుంటూ RGVWorld.in/ShreyasET ద్వారా వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నారు వర్మ. ఇప్పటికే ''క్లైమాక్స్, నగ్నం'' సినిమాలతో సంచలనం సృష్టించిన ఆయన గత రెండు రోజుల క్రితం లైఫ్ ఆధారంగా 'పవర్ స్టార్' సినిమా తీస్తున్నట్లు ప్రకటించి మరో ఆటం బాంబ్ వేశారు. అంతేకాదు ఇందులో నటించబోయే నటుడు, ఇతనే అంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. Also Read: వర్మ విడుదల చేసిన ఆ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కళ్యాణ్‌ని పోలి ఉండటంతో.. అతను ఎవరు? ఆ నటుణ్ని వర్మ ఎలా పట్టాడు? అనే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో ‘తెలుగు సమయం’కు ప్రత్యేకంగా ఈ నటుడికి సంబంధించిన కొన్ని వివరాలు తెలిశాయి. అతని పేరు నరేష్. భద్రాచలంకు సమీపంలోని సారపాక గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్‌ని‌ పోలిన రూపు రేఖలు కలిగి ఉండటంతో ఆయనను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు. ఈ వీడియోలు చూసి ఇతన్ని వర్మ కాంటాక్ట్ అయ్యారట. ఆ నటుడి వివరాలు సేకరించి ప్రత్యేకంగా కారు పంపించి తన ఆఫీసుకు రప్పించారట. 'పవర్ స్టార్' సినిమాలో నటించాలని ఆయన్ను కోరిన వర్మ.. కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని మాటిచ్చారట. రెండు భాగాలుగా ఈ మూవీ ఉంటుందని వర్మ చెప్పారట. అయితే ఇందుకు సంబంధించి డీల్ ఇంకా సెట్ కాలేదని, ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య చర్చలు మాత్రమే నడుస్తున్నాయని తెలిస్తుండటం గమనార్హం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dRlp8I

అల్లుడు అదుర్స్: రంగంలోకి దూకేందుకు రెడీ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

దేశంలో కరోనా కాటుకు సెట్స్‌పై ఉన్న ప్రతిఒక్క సినిమా బలైపోయింది. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. లాక్‌డౌన్ రావడంతో దాదాపు మూడు నెలలుగా కెమెరా స్విచ్చాన్ చేయకపోవడంతో షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయి.. విడుదల వాయిదా వేసుకున్నాయి. అయితే ఇటీవల షూటింగ్స్‌కి అనుమతులు రావడంతో తిరిగి ఒక్కొక్కరుగా సెట్స్ మీదకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారని తెలిసింది. 'రాక్షసుడు' మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు బెల్లకొండ శ్రీనివాస్. లాక్‌డౌన్‌కి ముందే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేస్తుకున్న ఈ మూవీకి 'అల్లుడు అదుర్స్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్.. లాక్‌డౌన్ అమలులోకి రావడంతో చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా జరపలేకపోయింది. దీంతో సినిమా రిలీజ్ కూడా వాయిదాపడింది. Also Read: ఈ నేపథ్యంలో తాజాగా 'అల్లుడు అదుర్స్' తదుపరి షెడ్యూల్ కోసం డేట్స్ ఫిక్స్ చేశారట దర్శకనిర్మాతలు. ఈ షూటింగ్ వచ్చే నెల నుంచి హైదరాబాదులో జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరత్వరగా ఫినిష్ చేసేసి దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ సరసన , నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ అల్లుడు అదుర్స్ చిత్రంలో 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఐటెం సాంగ్‌లో అందాల విందు చేయనుందని తెలిసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ilWvl5

టెన్త్ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలంటున్న టాలీవుడ్ ప్రముఖ హీరో

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని రకాలు పరీక్షలు రద్దు అయ్యాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. లాక్ డౌన్ లో కొంచెం సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గకపోవడం వలన కొన్ని రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసారు. అందులో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టెన్త్ పరీక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలనీ అన్నారు విష్ణు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం విష్ణు ఆలోచన సరికాదంటున్నారు. . ఎందుకంటే పరీక్షలనేవి పిల్లలను భయపెట్టి ఒత్తిడికి గురి చేయడానికి ఉద్దేశించినవి కాదంటున్నారు. 15 సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా సులభంగా గ్రహిస్తారని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు .మరికొందరు 14, 15ఏళ్లలో వీరు ఒత్తిడిని తట్టుకోలేకపోతే.. ముందు ముందు భవిష్యత్తులు తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఎలా తీసుకోగలరంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NTeWj3

Redmi 9A, Redmi 9C With 5,000mAh Battery, MediaTek Helio SoC Launched

Redmi 9A and Redmi 9C smartphones have made their debut in Malaysia. The newly launched Redmi phones are toned-down models of the Redmi 9 that was launched earlier this month.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ak10eG

MediaTek Introduces 2 New, Budget Gaming Focused SoCs - Helio G35, Helio G25

MediaTek has introduced two new gaming focused processors namely, the MediaTek Helio G35 and Helio G25 that will be fitted into "mainstream gaming smartphones." Both the Helio G35 and the Helio...

from NDTV Gadgets - Latest https://ift.tt/3g8MeXl

TikTok Creators in India Now Asking Users to Meet Them on Instagram

As TikTok has been banned in India, many creators on the platform have started asking their followers to meet them on Instagram.

from NDTV Gadgets - Latest https://ift.tt/38hvhan

Realme Sells Over 3 Lakh Narzo Smartphones in Since Launch: India CEO

Realme Narzo series has surpassed the three lakh sales milestone in India in a little over a month since its debut, revealed India CEO Madhav Sheth.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Vu4YZB

YouTube Shuts Down Far-Right Channels Over Hate Speech

YouTube on Monday shut down six far-right channels for violating rules against "supremacist" content, booting videos by David Duke, Stefan Molyneux and Richard Spencer.

from NDTV Gadgets - Latest https://ift.tt/2AdzzD4

TikTok Responds to India Ban, Says User Privacy of Highest Importance

TikTok has responded to the Government of India's ban in the country. TikTok's India head, Nikhil Gandhi says, "We have been invited to meet with concerned government stakeholders for an...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YInkrC

NAKED Movie: షాకింగ్.. ‘వర్మ’ నగ్నం బడ్జెట్ లక్ష కాదు.. జస్ట్ 2 వేలు, 12 గంటల్లో 70 లక్షల రెవెన్యూ, లెక్కలివిగో

నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది ‘నగ్న’ సత్యం అంటున్నారు ‘నగ్నం’ దర్శకుడు . వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో నగ్నం-నేకెడ్ అనే లషు చిత్రాన్ని రూపొందించి జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు ఆర్జీవీ. అంతకు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే మరో బూతు చిత్రాన్ని తీసి ఆన్ లైన్‌లో కాసులు కురిపించుకున్న వర్మ.. ఈ యాపారం ఏదో బాగుందని ఎలాగూ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి దేవరపల్లి (వెస్ట్ గోదావరి) పెద పాపతో ‘NAKED (నగ్నం) అనే చిత్రాన్ని వదిలిపెట్టారు. స్వీటీ నగ్న చిత్రం చూడాలంటే.. రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని రేటు ఫిక్స్ చేశారు వర్మ. అసలే లాక్ డౌన్ కరువులో ఉన్నారో ఏమో కాని.. స్వీటీ పాప ‘నగ్నం’ చూసేందుకు పోటీ పడ్డారు నెటిజన్లు. ఏకంగా తొలి అరగంటలోనే 23,560 టిక్కెట్లు అమ్ముడు కాగా.. ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇక తొలి 20 గంటల్లో ఏకంగా 35445 పెయిడ్ వ్యూస్ వచ్చాయి. సోమవారం నాటికి కోటిని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ‘నగ్నం’. అయితే సినిమా ఎగబడి చూసిన వాళ్లు ఇందులో ఏం లేదని తేల్చేసినా.. వర్మ కాన్సెప్ట్ అది కాదు కదా. సినిమాపై క్లిక్ చేసేలా చేయడమో కావడంతో వర్మ ‘నగ్నం’తో సూపర్బ్ సక్సెస్ అయ్యాడు. ఒకవైపు బడా నిర్మాతలు పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎలా విడుదల చేయాలా అని తలల పట్టుకుంటుంటే.. లక్ష రెండు లక్షలతో సినిమాలు ఆర్జీవీ కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంతకీ వర్మ ఈ సినిమాను ఎంత బడ్డెట్‌తో తీశాడు అంటే.. కొంత మంది ఐదు లక్షలు అని.. ఇంకొంత మంది లక్ష అంటూ లెక్కలు చెప్పారు. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి అయితే ఓ అడుగు ముందుకు వేసి.. ‘‘అంటే మీరు ఒప్పుకోరుగానీ... వర్మ "నగ్నం" రాజమౌళి 'బాహుబలి' రికార్డుల్ని బద్దలుకొట్టింది. లక్ష రూపాయల ఖర్చుతో తీసిన ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండ్రా...వాట్ టు డూ వాట్ నాట్ టు డూ!?!’’ అంటూ వర్మ నగ్నం కలెక్షన్లపై పోస్ట్ పెట్టాడు. కత్తికి క్లోజ్ ఫ్రెండ్‌ అయినా వర్మ.. కలెక్షన్లు ఓకే కాని.. ఖర్చు లక్ష అని రాశావ్ ఏంటి మిత్రమా? అంటూ అర్థరాత్రి పూట కత్తి మహేష్‌కి ఫోన్ చేసి అసలు బడ్జెట్‌ను రివీల్ చేయడంతో కత్తికి కళ్లు బైర్లు కమ్మాయట. ఈ విషయన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ‘నగ్నం’ చిత్రానికి అయిన బడ్జెట్ కేవలం రూ.2 వేలు మాత్రమే అని స్వయంగా వర్మ చెప్పాడంటూ బాంబ్ పేల్చేడు కత్తి మహేష్. ‘వర్మ గారికి కోపమొచ్చింది. అర్ధరాత్రి అంకమ్మ చివాలన్నట్లు ఇందాకే వర్మ ఫోన్. ఏంటయ్యా నా "నేకెడ్" ఫిల్మ్ బడ్జెట్ ఒక లక్ష అనిరాశావ్? అన్నారు. ఏమోనండి అంతకు మించిన ఖర్చు అందులో ఏమీ కనిపించలేదు. అందుకే లక్ష అని డిసైడ్ అయ్యాను, అని క్లియర్ గా చెప్పేసా. అందుకు ఆయన నవ్వుతూ... నన్ను అడిగితే నేను అసలు ఖర్చు చెప్పేవాడినిగా అన్నారు. గురుడు ఎన్నో పెగ్గులో ఉన్నాడో ఏమో అనుకుంటూ. చెప్పండి అన్నా.. జస్ట్ రెండు వేలు... అక్షరాలా INR 2000 అని బాంబ్ పేల్చాడు. అదేం లెక్కండి అని నేను అడిగేలోపే, లెక్క తేల్చేశాడు. ఆ నౌఖరు పాత్ర చేసిన కుర్రాడి ట్రావెల్ ఖర్చు రెండు వేలు తప్ప ప్రొడక్షన్ ఖర్చు ఏం లేదు. కెమెరా, ఎడిటింగ్ మిక్సింగ్ అన్ని మా దగ్గరే జరిగాయి. ఏ ఖర్చూ లేకుండా అని నిజం చెప్పారు. ఏమిటి ఈయన? ’అంటూ ‘నేకెడ్-నగ్నం’ బడ్జెట్-కలెక్షన్స్ వివరాలను తెలియజేశాడు వర్మ వీరాభిమాని కత్తి మహేష్. అసలే వర్మ.. ఆపై అర్థరాత్రి ఫోన్.. అదీ కత్తి మహేష్‌కి... ఆ రాత్రిలో ‘నగ్నం’ చిత్రంపై డిస్కషన్.. బడ్జెట్ రూ.2 వేలు అని చెప్పడం.. ఇదేదో నమ్మబుల్‌గా లేదు కాని. సినిమాని చూసిన చాలా మంది అయితే హా.. ఈ సినిమాకి అంతకంటే ఖర్చు ఎక్కువ కాదులే అంటూ కత్తి కామెంట్స్‌పై స్పందిస్తున్నారు. మరీ రెండు వేలేనా?? నటించిన వాళ్లకి కనీసం భోజనం కూడా పెట్టలేదా? అని నెటిజన్లు డౌట్స్ రైజ్ చేస్తుంటే.. ‘ఫిల్మ్ ప్రొడక్షన్ లెక్కలోకి వచ్చే ఖర్చు వేరు. కాస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వేరు. ఆల్రెడీ జీతాలు ఇస్తున్నవాళ్ళతో పని చేయించుకుని ఓవర్ హెడ్స్‌లో కలపొచ్చు. కానీ వర్మ అలా చెయ్యలేదు’ అంటూ క్లారిటీ ఇస్తున్నాడు కత్తి. ఇదీ పాయింటే కదా.!


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dFr1mc

Google Removes Misleading Ads in Voting-Related Searches

Google said on Monday that it had removed search ads that charged users searching for voting information large fees for voter registration or harvested their personal data.

from NDTV Gadgets - Latest https://ift.tt/3gbG5cZ

Reddit Bans r/The_Donald Group Amid Broad Social Media Crackdown

Reddit on Monday shut down r/The_Donald, a forum which long served as a popular online home base for fans of President Donald Trump, saying it violated the site's hate speech rules.

from NDTV Gadgets - Latest https://ift.tt/2VrAV4A

Rgv: అల్లు అర్జున్, రానా పేర్లు తీస్తూ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్.. ఆ ఇద్దరి కారణంగా!!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే అంశంపై పలు చర్చలు నడుస్తున్నాయి. నటీనటులు, ప్రేక్షకులు అంతా ఈ బంధుప్రీతి గురించే మాట్లాడుకునే పరిస్థితులు వచ్చేశాయి. సినీ వారసులకే అవకాశాలు, స్టార్ స్టేటస్ తప్ప టాలెంటెడ్ యాక్టర్స్ ఎవ్వరికీ కనిపించరనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖుల వస్తున్న విమర్శలు, ఇండస్ట్రీలో నెపోటిజం లాంటి అంశాలపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ద్వారానే స్టార్ స్టేటస్ కొట్టేయడం ఎవరి తరం కాదని అన్నారు. రియల్ నెపోటిజం అంటే స్టార్ హీరోల కుమారులందరూ స్టార్ హీరోలు కావాలి.. కానీ అలా జరగడం లేదే అంటూ ఆసక్తికరంగా స్పందించారు వర్మ. హిందీలో ఫిరోజ్ ఖాన్, అమితాబ్ లాంటి హీరోలు తమ కుమారులను స్టార్ హీరోలుగా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. Also Read: ఈ సందర్భంగా.. గతంలో జరిగిన ఓ విషయాన్ని వర్మ ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని... , కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ, రానాను ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు నన్ను తొక్కేస్తున్నారని, తెలుగులో మా లాంటి వాళ్లకు థియేటర్లు ఇవ్వడం లేదని ఆ హీరో చెప్పినట్లు వర్మ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు చేయడం పనికిరాని వాళ్ళ పని అంటూ వర్మ చెప్పడం హాట్ ఇష్యూ అయింది. థియేటర్లో ఎవరి మూవీ చూడాలనేది పూర్తిగా ప్రేక్షకుడి ఛాయిస్ మాత్రమే. ప్రేక్షకుడి ఆధరణే ఉంటేనే ఆ సినిమా ఆడటం, హీరోకి స్టార్ స్టేటస్ తీసుకురావడం జరుగుతుంది. అంతేగానీ ఓ స్టార్ హీరోనో, నిర్మాతనో తలచుకొంటే తమ కొడుకులను స్టార్ హీరోలు చేయడమనేది జరిగే పని కాదని వర్మ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38oq8h3

Tiktok Was Banned by the Government and Can't be Downloaded Anymore

Tiktok and 58 other apps were banned by the government on Monday, and overnight, Tiktok has been removed from Google and Apple's app stores. Other apps are still to be removed.

from NDTV Gadgets - Latest https://ift.tt/2VwwvJN

'I can't see an Elon Musk anywhere in India'

'Saying the private industry will come and transform India's space programme is real moonshine!'

from rediff Top Interviews https://ift.tt/3g37r50

Jr.Ntr: బెదిరింపులు ఆపండి.. తారక్ గతం గురించి తెలిస్తే..! హీరోయిన్ పాయల్ ఘోష్

చిత్రసీమలో నెపోటిజం (బంధు ప్రీతి) అనే అంశంపై గత కొన్నేళ్లుగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే డిప్రెషన్‌తో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటంతో నెపోటిజంపై ఆగ్రహ జ్వాలలు రగులిపోతున్నాయి. పలువురు నటీనటులు ఈ అంశంపై నోరువిప్పి చిత్రసీమలో జరుగుతున్న వ్యవహారం, సీక్రెట్స్ బయటపెట్టేస్తున్నారు. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఉస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ రంగంలోకి దిగిన పాయల్ ఘోష్‌కి‌ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూడా నెపోటిజం ప్రొడక్టే అంటూ ఆమెను ట్యాగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో అదే సోషల్ మీడియా ద్వారా మరోసారి రియాక్ట్ అయిన పాయల్.. ఎన్టీఆర్‌కి తానెందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పేర్కొంటూ, తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. Also Read: సినిమా కోసం తారక్ పడే కష్టం ఏంటనేది ఎవ్వరికీ తెలియదని పాయల్ తన ట్వీట్‌లో తెలిపింది. తారక్ గతం గురించి తెలుసుకున్నాక తనకు కన్నీళ్లు ఆగలేదని, ఏడ్చేశానని పేర్కొంది. అతని పట్ల జాలి చూపించాలని కోరింది. ఇకపోతే ఇకనైనా బెదిరింపులు ఆపాలని కోరిన పాయం ఘోష్.. ఆ బెదిరింపుల కారణంగా డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించానని చెప్పింది. తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైన .. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో నటించింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో సరైన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. తాజాగా ఇలా ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ ఆమె కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g7IeGw

Redmi Note 9 Pro to Go on Sale in India Today at 12 Noon

Redmi Note 9 Pro will be up for sale once again in India today at 12pm (noon). The phone since its launch in March has been put on multiple flash sales via Amazon and Xiaomi India store.

from NDTV Gadgets - Latest https://ift.tt/2BNgoka

Realme X3, Realme X3 SuperZoom to Go on Sale Today at 12 Noon in India

Realme X3 and Realme X3 SuperZoom are set to go on sale in India today. Both new Realme phones were launched in India last week.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dMMvh3

'As long as Pandya keeps cool, he will be an asset'

'After his back injury, he needs to look after himself.'

from rediff Top Interviews https://ift.tt/2ZlzKon

Realme Narzo 10 to Go on Sale Today at 12 Noon via Flipkart, Realme Website

Realme Narzo 10 will once again be on sale at 12pm (noon) today via Flipkart and Realme website. The phone was launched in early May and comes in a single RAM and storage configuration. The Realme...

from NDTV Gadgets - Latest https://ift.tt/3igkMZG

'China expects us to behave the way China would!'

'And this mirror imaging is the most dangerous thing because it leads to tremendous misunderstandings.'

from rediff Top Interviews https://ift.tt/31FRhe3

మహేష్ బాబుకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన రష్మిక

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినీ ప్రముఖుల్లో కూడా అభిమానులు ఉన్నారు. మహేష్‌తో కలిసి నటించే అనేకమంది నటులు ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌తో జతకట్టింది కన్నడభామ . తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాలో మహేష్‌ను వేధిస్తోన్న అల్లరిపిల్లగా నటనకు మంచి మార్కులే కొట్టేసింది. దీంతో రష్మికకు కూడా టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ సందర్భంగా రష్మిక తన ఫ్యామిలీతోనే కలిసి ఉంటుంది. రష్మిక మండన్న కూర్గ్ లోని సుందరమైన హిల్ స్టేషన్‌లో తన తల్లిదండ్రులతో కలిసి లాక్ డౌన్ సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. కూర్గ్ ప్రకృతి సౌందర్యం, కొండ పొలాల నుండి గొప్ప పంటలకు ప్రసిద్ది చెందింది. ఈ క్రమంలో కూర్గ్‌లో ఉన్న రష్మిక మహేష్‌కు అదరిపోయే గిఫ్ట్ పంపింది. అవకాడో ఫ్రూట్స్‌తో పాటు...ఆవకాయను ప్యాక్ చేసి మహేష్ ఇంటికి పార్సిల్ పంపింది. పంపిన విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా అద్భుతమైన వాతావరణంలో... నోరూరించే గిఫ్ట్ పంపిన రష్మికకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మాకు అందిన మొట్టమొదటి గిఫ్ట్ ఇదే అంటూ నమ్రతా తెలిపారు. రష్మిక ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాన్ని మైత్రి ఫిల్మ్ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మికతో పాటు.. ఈ సినిమాలో జగపతి బాబు, యాంకర్ అనసూయ, వెన్నల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళలంలో సుల్తాన్ టైటిల్‌తో వచ్చిన మరోసినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ibiuL8

అయ్యో! పాపం.. తాప్సి పన్నుకి కరెంట్ షాక్!! హీరోయిన్ దిమ్మతిరిగిందట..

ప్రస్తుత పరిస్థితుల్లో జనాలను కరోనా మహమ్మారి కాటేస్తుంటే.. కరెంటు బిల్లులు షాకిస్తున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. వేలల్లో, లక్షల్లో కరెంట్ బిల్లులు రావడం చూసి షాక్ అవుతున్నారంతా. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరి నడ్డి విరుస్తున్నాయి విద్యుత్ సంస్థలు. దీంతో అందరు కూడా విద్యుత్ బోర్డుపై ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. ఈ నేసథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తమకొచ్చిన కరెంటు బిల్లులను సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపిస్తూ విద్యుత్ బోర్డులపై దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. తాజాగా తాప్సికి కూడా ఇది తప్పలేదు. ఆమె నివాసముంటున్న ఇంటికి జూన్ నెలకు గాను 36 వేల రూపాయల కరెంట్ బిల్ రావడంతో షాక్ అయిందట . దీంతో ఈ విషయాన్ని వెంటనే ఆమె విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. Also Read: తనకు ఏప్రిల్ నెలలో 4390, మే నెలలో 3850 రూపాయలు వచ్చిన విద్యుత్ బిల్లు.. జూన్ వచ్చేసరికి ఒక్కసారిగా పెరిగిపోయి 36 వేలు రావడమేంటని ఆమె ప్రశ్నించింది. ఇంతటి పిచ్చి పెరుగుదల గతంలో ఎన్నడూ చూడనేలేదని బోర్డ్ వాళ్లకు ఫిర్యాదు చేసింది. తన అపార్ట్‌మెంట్ ఖాళీగా ఉందని, ఖాళీగా ఉన్నదానికే అంత బిల్లు వస్తే, అందులో ఉండి ఉంటే ఇంకెంత బిల్లు వచ్చేదో అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇది చూసి సంబంధిత ఎలక్ట్రిసిటీ బోర్డ్ సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు వివరణ ఇచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VsCL5a

Watch Two Clips From The Boys Season 2, Out in September

Amazon Prime Video has set a September 4 release date for The Boys season 2. Eric Kripke also unveiled the first three minutes of The Boys season 2. We also got an additional two-minute first look at...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dIqX5l

Snap's Spectacles 2, Spectacles 3 Glasses to Launch in India on July 4

Spectacles 2 and Spectacles 3 smartglasses by Snap, the parent company of social media platform Snapchat, are finally going to launch in India in July. The Snap's smartglasses made their debut in 2018...

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZjBWgb

వనితా విజయ్‌కుమార్‌ మూడో పెళ్లి.. ఆ ముచ్చట తీరిందో లేదో అప్పుడే కొత్త జంటపై పోలీస్ కేసు

సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై లోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ వివాహ పద్దతిలో శనివారం రోజు (జూన్ 27) ఆమె వివాహం జరిగింది. అనే వ్యక్తిని వనితా విజయ్‌కుమార్‌ పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహం జరిగిన మరునాడే ఈ కొత్త జంటపై నమోదు కావడం హాట్ ఇష్యూగా మారింది. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ అతికొద్ది మంది సమక్షంలోనే వనితా విజయ్‌కుమార్‌- పీటర్ పాల్ వివాహం జరిగింది. పెళ్లిలో ప్రత్యేకంగా వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా కనిపించి భర్తకు ముద్దులు పెడుతూ హల్చల్ చేసింది వనితా విజయ్‌కుమార్. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా మూడో భర్త అయిన పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ రూపంలో ఈ జంటకు సమస్య ఎదురైంది. Also Read: తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ పాల్ మరో వివాహం చేసుకున్నాడని పేర్కొంటూ కొత్త జంటపై ఎలిజిబెత్ హెలెన్ పోలీస్ కేసు పెట్టింది.హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై కేసు నమోదు చేశారనేది లేటెస్ట్ సమాచారం. దీంతో జనాల్లో ఈ అంశం పలు చర్చలకు తావిచ్చింది. కాగా 2007లో ఆకాష్‌తో విడాకులు తీసుకున్న వనిత విజయ్‌కుమార్.. 2007లో ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనతోనూ విడాకులు తీసుకొని ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకొని పీటర్ పాల్‌ని మూడో భర్తగా పొందింది. తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన వనిత.. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవి' సినిమాలో నటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YEzHoB

Coming Soon, an E-Marketplace Only for Tribal Sellers

Tribal artisans will soon be able to sell their products at the click of a mouse with the government gearing up to launch a specialised e-marketplace for them this Independence Day.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NADhdd

Realme 5i, Realme 6 Price in India Increased by Rs. 1,000

Realme 5i and Realme 6 prices have increased once again, a couple months after they were revised due to the increased GST on smartphones in the country. Both the Realme 5i and the Realme 6 pricing has...

from NDTV Gadgets - Latest https://ift.tt/2AdaFn7

Blackpink 'How You Like That' Breaks YouTube's 24-Hour Viewing Record

K-pop band Blackpink's newly released "How You Like That" music video blasted into the YouTube record books.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NCRZAf

Alia Bhatt, 4 Others in Disney+ Hotstar's 'Bollywood Ki Home Delivery'

Alia Bhatt, Akshay Kumar, Ajay Devgn, Varun Dhawan, and Abhishek Bachchan are part of Disney+ Hotstar's "Bollywood Ki Home Delivery" at 4:30pm on Monday. It's expected to reveal a slate of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3gbWRsf

Have Apple, Google Silently Installed COVID-19 Tracker on Your Phone?

Several people are forwarding a message on WhatsApp and social media platforms including Facebook and Twitter claiming that a COVID-19 exposure sensor has been silently "inserted into every...

from NDTV Gadgets - Latest https://ift.tt/31wP4Bz

Sunday 28 June 2020

వర్కవుట్ అవుతుంది కానీ.. నెపోటిజంపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో తెరపైకి వచ్చింది. అతడి అకాల మరణం తర్వాత నెపోటిజంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. సుశాంత్ మరణానికి కారణమంటూ కొందరు తమ వాదనలు వినిపించారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు బాలీవుడ్ నెపోటిజంపై మండిపడ్డారు. ఇటు టాలీవుడ్‌లో కూడా చాలామంది ప్రముఖులు ఇప్పటికే నెపోటిజంపై స్పందించారు. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా నెపోటిజంపై రేణూ దేశాయ్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మంచి టాలెంట్ ఉన్న నటుడు. సెన్సిటివ్ పర్సన్‌. ఇండస్ట్రీలో మంచి సక్సెస్‌లు సాధించాడు అని రేణూ పేర్కొన్నారు. అయితే సుశాంత్ మరణానికి నెపోటిజం కారణమని చాలా మంది చెబుతున్నారు. నా అంచనా ప్రకారం నెపోటిజం ఒక్క ఇండస్ట్రీలోనే లేదు. పని చేసే ప్రతిచోట ఉందన్నారు . సినిమా ఇండస్ట్రీలో ముందు మాత్రమే బంధుప్రీతి వర్కవుట్ అవుతుందన్నారు. ఆ తర్వాత మన టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందన్నారు రేణు. జీవితం టీ కప్పు లాంటిది కాదన్నారామె.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ifP5zM

వకీల్ సాబ్ లీక్: కోర్టులో పవన్ కళ్యాణ్! అది చూడగానే షాకైన దర్శకనిర్మాతలు

ఓ స్టార్ హీరో సినిమాను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయాలంటే చాలా కష్టం. ఎంతో మంది నిపుణులు, సాంకేతిక వర్గం సహకారంతో సినిమా రూపొందించడం, అది కూడా విడుదలకు ముందు ఎలాంటి లీక్స్ లేకుండా వెండితెరపై బొమ్మపడేలా చూసుకోవడమంటే మామూలు విషయం కాదు. మరోవైపు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సినిమా ఇండస్ట్రీని లీకుల బెడద ఎక్కువవుతూ వస్తోంది. తాజాగా పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్‌కు కూడా లీకుల బెడద తప్పలేదు. ‘’ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గత కొంతకాలంగా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న చిత్ర యూనిట్‌కి సడెన్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కోర్టులో వాదిస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఇది కాస్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ స్టిల్ ఎలా లీక్ అయ్యిందనే విషయమై ఆరా దీస్తున్నారు యూనిట్ సభ్యులు. Also Read: మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసి వరుసగా 25 సినిమాలు చేసిన పవన్.. ఆ తర్వాత రాజకీయ బాట పట్టారు. అయితే నిర్మాతల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన ఆయన మొదటగా ఈ 'వకీల్ సాబ్' మూవీ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు. ఈ ముగ్గురే గాక మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CQUblH

Jr. Ntr: ఎన్టీఆర్ విషయమై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. మీరంతా మూసుకొని ఉండండి అంటూ!!

తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైంది హీరోయిన్ . ఆ తర్వాత హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో మెరిసింది. ఓ పది సినిమాల్లో నటించినా కూడా టాలీవుడ్‌లో ఈ భామకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత అంశం సినీ ఇండస్ట్రీలో చర్చల్లో నిలుస్తోంది. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులే ఇండస్ట్రీని ఏలుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరా చోప్రా మధ్య వివాదం చెలరేగడం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. Also Read: అయితే ఈ వివాదంలోకి పాయల్ ఘోష్ ఎంటరై.. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవిస్తాడని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ కూడా నెపోటిజం ప్రొడక్టే (నట వారసత్వం) అంటూ.. అతనికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ తనకు ట్వీట్స్ పెట్టారని తెలిపింది పాయల్. తాజాగా వీటిపై ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్టీఆర్‌ని తిట్టేవారికి కచ్చితంగా ఆయన గురించి ఏమీ తెలిసి ఉండదని అనుకుంటున్నా. అతనో హార్డ్ షిప్ ఎంతో కష్టపడి వచ్చాడు. మీరంతా మూసుకుని ఉండండి అంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dDWtRX

OnePlus Upcoming TV Series Will Have Three Models; Prices Teased On Twitter

OnePlus has teased the pricing for its upcoming TV series and also revealed there will be three TV models. Through a tweet, the company shared that the starting price for the upcoming TV models will...

from NDTV Gadgets - Latest https://ift.tt/3ibRBH1

Amazon, SoftBank Held Talks to Acquire Russian E-Retailer Ozon: Shareholder

Global retail giant Amazon and Japanese SoftBank have made approaches to Russian conglomerate Sistema about a possible acquisition of its online retailer Ozon, Sistema's majority owner Vladimir...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eIxVIN

Realme Narzo 10 Gets New 'That Blue' Colour Option, First Sale on June 30

Realme has added a new colour option for Realme Narzo 10. The smartphone's latest That Blue colour variant will be available to purchase in India for the first time on June 30 at 12pm (noon).

from NDTV Gadgets - Latest https://ift.tt/2BQXQ2w

Amazon Workers in Germany to Go on Strike Over Coronavirus Infections

Workers at six Amazon sites in Germany will go on strike on Monday in protest over safety after some staff at logistics centres tested positive for coronavirus, labour union Verdi said.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YGDFx7

Starbucks Pauses Social Media Ads as It Targets 'Hate Speech'

Starbucks said Sunday that it will pause its advertising on social media while it studies ways to "stop the spread of hate speech" as part of a growing corporate movement.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Bj3ytX

Facebook Ad Boycott Campaign to Go Global, Organisers Say

Organisers of a Facebook Inc advertising boycott campaign that has drawn support from a rapidly expanding list of major companies are now preparing to take the battle global to increase pressure on...

from NDTV Gadgets - Latest https://ift.tt/2NCZAyT

అద్దె కట్టకుండా వేధింపులు.. సినీ నిర్మాతపై ఫిర్యాదు

సినీ నిర్మాతపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇంటి అద్దె చెల్లించకుండా దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారంటూ సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో నివాసం ఉంటున్న నవ్వాడ శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. 2018లో మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా తమ భవనాన్ని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు అద్దెకు ఇచ్చామన్నారు. తెలంగాణ ఫిలిం కల్చరల్‌ సెంటర్‌(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చినట్లుగా శోభారాణి తెలిపారు. నెలకు నాలుగున్నర లక్షల అద్దెగా అంగీకరించారని రూ. 40 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పి రూ.30 లక్షలే ఇచ్చారని ఆమె ఆరోపించారు. అయితే అప్పటి నుంచి అద్దె సరిగ్గా ఇవ్వకుండా వేదింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం తాను అద్దె చెల్లించలేనంటూ తాళాలు అప్పగించి వెళ్లిపోయిన ప్రతాని రామకృష్ణగౌడ్‌ తన కొడుకు సందీప్‌ను ఇంటి మీదికి పంపించి దౌర్జన్యానికి దిగాడని శోభరాణి ఆరోపిస్తున్నారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించడంతో పాటు తనకు ప్రభుత్వంలో పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారని తమ వద్దకు వస్తే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YHvUXz

'China doesn't want war'

'China would rather tie us down; and bleed us as much as it can so that we aren't able to lift our heads to face them.'

from rediff Top Interviews https://ift.tt/3eMCUbm

OnePlus 8 Pro to Go on Sale in India Today via Amazon, OnePlus.in

OnePlus 8 Pro is all set to go on a flash sale in India once again. The sale will begin at 12pm (noon) IST on Amazon.in and OnePlus.in. The phone has been on flash sale since the beginning due to...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eI7PWk

COVID-19: 'We are lucky it came later to India'

'People are getting admitted to hospital two to three days before their death in a very serious respiratory compromise state and they are passing away within 48 hours.'

from rediff Top Interviews https://ift.tt/2ZjuUbb

‘శివన్’ ట్రైలర్: ఇది ప్రపంచంలోనే తొలి ఏటీటీ ఫిలిం

ప్రపంచీకరణ ప్రభావం ఎంటర్‌టైన్మెంట్ మీద కూడా పడింది. డిజిటలైజేషన్ కారణంగా ఎంటర్‌టైన్మెంట్ ప్రజలకు మరింత చేరువైంది. ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలలో వివిధ భాషలకు చెందిన బోలెడంత కంటెంట్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. అందుకే, కరోనా కాలంలో థియేటర్లు మూతబడినా ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కొత్త కొత్త సినిమాలను వీక్షిస్తున్నారు. వెబ్ ఫిలింస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చిత్రీకరణ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలనే చాలా మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే, నిన్న మొన్నటి వరకు ఓటీటీనే చాలా మందికి కొత్త. కానీ, ఇప్పుడు ఏటీటీ ప్లాట్‌ఫాం వచ్చింది. అంటే ఎనీటైమ్ థియేటర్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రేయాస్ మీడియా ఈ ఏటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టింది. శ్రేయాస్ ఈటీ పేరుతో డిజిటల్ వరల్డ్‌ను సృష్టించింది. Also Read: అయితే, ఓటీటీ-ఏటీటీ వీటి మధ్య తేడా ఏంటి అనే అనుమానం చాలా మందిలో ఉండొచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫాంలను మనం నెలకు లేదంటే ఏడాదికి సబ్‌స్క్రిప్షన్ తీసుకొని దానిలో ఉన్న కంటెంట్‌ను ఎంజాయ్ చేస్తాం. ఏటీటీ అలా కాదు. ఏదైనా సినిమా లేదంటే సిరీస్‌ను ఒకసారి చూడటానికి డబ్బులు చెల్లిస్తాం. ఉదాహరణకు ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాలకు చెల్లించినట్టు. ఈ రెండు సినిమాలు శ్రేయాస్ ఈటీ ఏటీటీ ప్లాట్‌ఫాంలోనే అందుబాటులో ఉన్నాయి. ‘క్లైమాక్స్’ చూడాలంటే రూ.100, ‘నగ్నం’ చూడాలంటే రూ.200 చెల్లించాలి. ఈ ప్లాట్‌ఫాం సినీ నిర్మాతలకు ఎంతో ఉపకరిస్తుందని చాలా మంది అభిప్రాయం. కాగా, రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన రెండు చిన్న సినిమాలను మాత్రమే ఇప్పటి వరకు శ్రేయాస్ ఈటీలో విడుదల చేశారు. ఇప్పుడు థియేటర్‌లో విడుదలైన సినిమాలను కూడా ఈ ప్లాట్‌ఫాంలోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా ప్రపంచంలోనే ఏటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన తొలి సినిమాగా ‘శివన్’ నిలవనుంది. సాయితేజ, తరుణి సింగ్ హీరోహీరోయిన్లుగా శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది. అయితే, సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ‘శివన్’ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. Also Read: అయితే, ఈ సినిమాను ఇప్పుడు శ్రేయాస్ ఈటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ‘శివన్ ట్రైలర్’ను విడుదల చేశారు. దీంతో ‘302’ మూవీని కూడా శ్రేయాస్ ఈటీలో విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాస్త అడల్ట్ కంటెంట్‌తో కూడిన థ్రిల్లర్ మూవీస్. భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘302’లో వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా మార్చి 13న విడుదలైంది. మొత్తం మీద శ్రేయాస్ ఈటీ మరో కొత్త ప్లాట్‌ఫాంకు తెరతీసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dGV8K2

దిగ్గజ గాయని ఎస్.జానకి ఇకలేరంటూ తప్పుడు ప్రచారం.. ఎస్పీ బాలు ఆవేదన

దిగ్గజ గాయని ఇకలేరనే వదంతులు ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో చూసిన ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన చెంది తరవాత జానకి అమ్మ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. జానకి అమ్మ ఆరోగ్యంపై ఇలాంటి వదంతులు దయచేసి వ్యాప్తి చేయొద్దని ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేశారు. కాగా, జానకికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈలోపలే ఆమె కన్నుమూశారంటూ వదంతులను ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేసేశారు. ఇదిలా ఉంటే, జానకి అమ్మ ఆరోగ్యంపై వచ్చిన రూమర్‌పై గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఇలాంటి రూమర్లు ఎందుకు పుట్టుకొస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన ఒక వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘‘జానకి అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఉదయం నుంచి నాకు 20 మంది ఫోన్ చేశారు. దీనికి కారణం సోషల్ మీడియాలో కొంత మంది జానకి అమ్మ చనిపోయారంటూ పోస్టులు పెట్టడమే. ఏంటి ఈ అర్థంపర్థంలేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె చాలా బాగున్నారు’’ అని బాలు స్పష్టం చేశారు. సోషల్ మీడియాను పాజిటివిటీని వ్యాప్తి చేయడానికి వాడాలని, ఇలాంటి విషయాల్లో చిలిపి చేష్టలు పనికిరావని బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను మంచిని వ్యాప్తి చేయడానికి వాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, సీనియర్ గాయకుడు మనో కూడా జానకి ఆరోగ్యంపై స్పందించారు. ‘‘ఇప్పుడే జానకి అమ్మతో మాట్లాడాను. ఆమె మైసూరులో ఉన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దయచేసి వదంతులు వ్యాప్తి చేయకండి’’ అని మనో ట్వీట్ చేశారు. కాగా, జానకి అమ్మ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. మూడు దశాబ్దాలకు పైగా దక్షిణాది సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేసిన గాత్రం జానకి అమ్మది. సినిమా ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన గాయని ఆమె. తన సుధీర్ఘ కెరీర్‌లో 45 వేలకు పైగా పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ సౌత్‌గా పిలుచుకునే జానకి అమ్మ.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో అత్యధిక పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా 17 భాషల్లో జానకి అమ్మ పాటలు పాడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31qAJGM

‘మనం సైతం’ కార్యాలయంలో మొక్కలు నాటిన వి.వి.వినాయక్, పూనమ్ కౌర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా, టీవీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు చాలా మంది మొక్కలు నాటారు. తాజాగా ఈ జాబితాలో దర్శకుడు , నటి చేరారు. హైదరాబాద్‌లోని ‘మనం సైతం’ కార్యాలయం ఆవరణలో నటుడు కాదంబరి కిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. భావి తరాలకు మనం ఇచ్చే విలువైన బహుమతి లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. Also Read: పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది మానవతావాదులు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఎంత మంది మంచి మనుషులు ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కొవిడ్-19 తరవాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. చాలా రోజుల తరవాత ఇంత మంది జనాలను చూస్తున్నాను. భయపడుతున్నా కానీ చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘మనం సైతం’ సాయం నటుడు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ‘మనం సైతం’ ట్రస్ట్ కరోనా కాలంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగా వంట సరుకులు అందించింది. తాజాగా 230 మందికి నగదు సహాయం చేసింది. ఇందుకు వసుధ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. సినిమా రంగ కార్మికులతోపాటు అనేక మంది నిరుపేదలు ఈ నగదు సహాయం అందుకున్నారు. దర్శకుడు వి.వి.వినాయక్, హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు మాట్లాడుతూ.. ‘కాదంబరి చేస్తున్న నిస్వార్థ సేవను తమ వంతుగా మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘మనం సైతం’కు వసుధ ఫౌండేషన్ చేయూత అందిస్తోంది’ అని అన్నారు. నగదు సహాయం అందించడం చాలా గొప్ప విషయమని వి.వి.వినాయక్ ప్రశంసించారు. ‘నగదు సహాయం అందుకున్న వాళ్ళు అశీర్వదించండి.. అందని వాళ్ళు అందాక ఆగండి. తదుపరి విడతలో తప్పక అందిస్తాం’ అని కాదంబరి అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31plQV6

హెబ్బా పటేల్‌తో ‘సరిగమ’ పాడుతోన్న రాజ్ తరుణ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘స‌రిగ‌మ‌ప’ లిరికిల్ సాంగ్‌ను తాజాగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా.. ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా నీద‌మ్మా’ అంటూ హుషారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌ తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌ రూబెన్స్ ఆలపించారు. ‘కుమారి 21ఎఫ్’, ‘అంధగాడు’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్, హెబా ప‌టేల్ క‌లిసి న‌టిస్తోన్న మ‌రో చిత్రం ఇది. Also Read: కాగా, ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నంద్యాల రవి మాటలు రాశారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. రియల్ సతీష్ ఫైట్స్ డిజైన్ చేశారు. ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా ఆగింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీని ప్రకటిస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eFTABr

అబ్బాయిలకు ఎలాంటి బౌండరీస్ లేవు.. లేడీ యాంకర్ వీడియోపై వర్మ క్రేజీ రియాక్షన్

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలవడం కేవలం రామ్ గోపాల్ వర్మకే సాధ్యం. ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఆయన పలు టీవీ చానళ్లకు, యూ ట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా లేడీ యాంకర్స్‌తో ఆయన మెదిలే తీరు, వాళ్ళను పొగిడే విధానం, వేసే రొమాంటిక్ పంచెస్ అబ్బో! అనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యూటిఫుల్ యాంకర్‌తో మాట్లాడుతూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు వర్మ. ‘సార్.. రీసెంట్ టైమ్స్‌లో ఏ అమ్మాయిని చూస్తే.. వావ్ అనిపించింది’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వెంటనే బదులిచ్చిన ఆయన.. ‘‘చాలా మంది అలా అనిపించారు. ఇన్‌క్లూడింగ్ యు’’ అనేయడంలో ఆ యాంకర్ మెలికలు తిరిగిపోయింది. దీంతో ఇందుకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: అయితే ఈ వీడియో క్లిప్‌కి ఇంకాస్త మసాలా జోడించి సినిమా పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో టిక్ టాక్ వీడియో చేశారు కొందరు వ్యక్తులు. లేడీ యాంకర్‌తో వర్మ ‘నీతో కలిపి’ అనే మాట అనగానే ''అయిపాయె'' అనే పదం వచ్చేలా, బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాలోని పాట మ్యూజిక్ ప్లే అయ్యేలా ఈ వీడియో తయారు చేశారు. ఈ వీడియో చూసిన వర్మ దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..''సోషల్ మీడియాలో క్రియేటివ్‌‌గా ఆలోచించే అబ్బాయిలకు ఎలాంటి బౌండరీస్ లేవు. ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయిని, నన్ను ఎలా చేశారో మీరే చూడండి'' అని పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుతం వర్మ ఓటీటీ వేదికలపై కన్నేశారు. ఇందుకోసం ఇటీవలే 'క్లైమాక్స్; రూపొందించి సక్సెస్ అయిన వర్మ.. 'నగ్నం' పేరుతో బోల్డ్ కిక్ ఇచ్చారు. మరోవైపు కరోనా పేరుతో, మర్డర్ పేరుతో ఇంకొన్ని సినిమాలు తీస్తున్నారు. ఇదిలా ఉండగానే పవన్ కళ్యాణ్ కథతో పవర్ స్టార్ మూవీ రూపొందించనున్నట్లు తెలిపి సంచలనం సృష్టించారు వర్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/388XdgA

పవర్ స్టార్ సినిమా: వర్మపై పూనమ్ ఆగ్రహం.. రహస్యాలు బయటపెట్టిన నటి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి ఫైర్ అయ్యారు. తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆర్జీవీ అంటే గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయనను చూసి తనకు బాధ కలుగుతోందని అన్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ సినిమాను ప్రకటించడమే. ప్రస్తుత కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా వరుసపెట్టి సినిమాలను వదులుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ పేరిట ప్రేక్షకుల ఇంటి వద్దకే సినిమాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతున్నారు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ అనే రెండు సినిమాలను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ‘పవర్ స్టార్’ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తు్న్నారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ ద్వారా వర్మ ప్రకటించారు. అంతేకాదు, ‘పవర్ స్టార్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చేయబోయే నటుడిని కూడా పరిచయం చేశారు. Also Read: ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనతో ఆర్జీవీ ప్రవర్తించిన తీరును బయటపెట్టారు. ‘‘అమ్మాయిల మానసిక బలహీనతను పసిగట్టడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించమని వారిని ప్రేరేపించడం, తన ట్వీట్స్‌ను పంపి షేర్ చేయమని చెప్పడం, దీని గురించి మీడియాకు తెలియజేయడం వంటి పనులు చేసే ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను కూడా దయచేసి ఈ సినిమాలో పెట్టండి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది’’ అని పూనమ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, రామ్ గోపాల్ వర్మతో తన అనుభవాన్ని కూడా మరో ట్వీట్‌లో పొందుపరిచారు. ‘‘ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గంటపాటు నాకు బ్రెయిన్‌వాష్ చేసిన ఈ విశ్వాసఘాతుకుడైన డైరెక్టర్ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అతను నాకు పంపిన ట్వీట్స్‌ను సంబంధిత వ్యక్తికి నేను అప్పుడే పంపాను. నా అదృష్టం కొద్దీ మీడియాలో కొంత మంది నిజాయతీపరులు ఉన్నారు. లేకపోతే నీ కుట్రలకు నేను బలైపోయేదాన్ని’’ అని వర్మను ఉద్దేశించి పూనమ్ ఆరోపణలు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BLT4TI

నగ్నం: లోకల్ అమ్మాయి స్వీటీతో వర్మ.. పెట్టింది 5 లక్షలే అయినా! భలే వ్యాపారం చేస్తున్నాడే..

ట్రెండ్ ఫాలో అవుతూ సిచువేషన్ చూసి స్టెప్ తీసుకుంటున్న .. గత కొంతకాలంగా అడల్ట్ మూవీస్ రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అంతకుముందు ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన, ఇటీవలే మరోసారి అదే మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' మూవీ రూపొందించి ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకున్నారు. ఓటీటీ వేదికలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాన్స్‌కి క్రమంగా డిమాండ్ పెరుగుతుండటం గమనించిన రామ్ గోపాల్ వర్మ.. దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అనే మార్గంలోనే అడుగులేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఓ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఆ వేదికపైనే 'క్లైమాక్స్' మూవీ రిలీజ్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా కేవలం తనకు తానే సోషల్ మీడియా ద్వారా సినిమా ప్రమోషన్స్ చేసుకున్న ఆయన, ఒక్కో వ్యూకి 100 రూపాయల పైకం డిసైడ్ చేసి భారీ సొమ్ము కూడగట్టుకున్నారు. దీంతో ఆ రుచి తెలిసి మరిన్ని సినిమాలను లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే నిన్న (జూన్ 27) రాత్రి తన లేటెస్ట్ అడల్ట్ మూవీ 'నగ్నం' రిలీజ్ చేసి మరోసారి సొమ్ము చేసుకున్నారు. ఈ సారి లోకల్ అమ్మాయి స్వీటీని నగ్నంగా చూపించి మ్యాజిక్ చేశారు. ఈ మూవీకి 200 రేటు పెట్టినా కూడా జనం ఎగబడి ఎగబడి చూశారు. ఈ మూవీకి మంచి డిమాండ్ ఉందని, వేలల్లో వ్యూస్ వస్తున్నాయంటూ వర్మనే స్వయంగా పేర్కొంటున్నారు. Also Read: ఇది చూసిన ఆడియన్స్ ఈ సినిమాల కోసం వర్మ ఎంత ఖర్చు పెట్టారు. ఎంత పోగు చేసుకుంటున్నారు? అనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే నగ్నం సినిమాకు ఆయన ఖర్చు పెట్టింది కేవలం 5 లక్షలే అని తెలిసింది. ప్రెజెంట్ సినిమా డిమాండ్ చూస్తే మినిమం కోటి రూపాయ‌లైనా వ‌సూల‌య్యేలా కనిపిస్తోంది. దీంతో వర్మ భలే వ్యాపారం చేస్తున్నాడే! అంటూ బడా నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38aadmo

Power Star: రామ్ గోపాల్ వర్మ సంచలనం.. ఇతనే పవర్ స్టార్ అంటూ షాకింగ్ వీడియో రిలీజ్

సంచలనాలకు మారు పేరైన మరో సంచలనానికి తెరలేపారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికలపై హల్చల్ చేస్తూ బోల్డ్ కిక్ ఇస్తున్న వర్మ.. తాజాగా 'పవర్ స్టార్' అంటూ మరో సినిమాను ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పరిటాల రవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల నిజ జీవితాలపై సినిమా తీసిన వర్మ తాజాగా పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ట్వీట్ చేసిన వర్మ.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన సినిమాలో 'పవర్ స్టార్' ఇతనే అంటూ ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. Also Read: ఈ వీడియోలో అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఉన్న ఓ నటుడు.. పవన్ లాగే స్టైల్‌గా నడుస్తూ కనిపించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వర్మ.. ''నా కొత్త సినిమా పవర్ స్టార్‌లో స్టార్ ఇతనే. ఆయన నా ఆఫీస్‌కి వచ్చినపుడు తీసిన వీడియో ఇది. ఈ వ్యక్తి ఎవ్వరినైనా పోలి ఉంటే నేనైతే ఏమీ చేయలేను. కావాలని చేసిందైతే కాదు'' అంటూ తనదైన స్టైల్ కామెంట్ చేశారు. గతంలో కూడా ఇలాగే పవన్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు వర్మ. ''పవన్‌ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది. కానీ లెక్కకన్నా.. తిక్కే అందరికీ నచ్చుతుంది. అందుకే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారు'' అనడం అప్పట్లో వివాదాస్పదం అయింది. మొత్తంగా చెప్పాలంటే వర్మ తీరు చూసి పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eIVst1

Zomato Employees Burn Company T-Shirts to Protest Chinese Investment

A group of Zomato food delivery platform employees in Kolkata tore and burnt their official T-shirts to protest Chinese investment in the firm. The agitation comes in the backdrop of the killing of 20...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VpPy8m

Huawei Controversy Opens Field for 5G Challengers

With growing pressure to keep China's Huawei out of 5G network development, it could be time for firms like Japan's NEC and South Korea's Samsung to shine.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NDNVQp

Saturday 27 June 2020

బ్రేకింగ్ న్యూస్: పవర్ స్టార్ పేరుతో రామ్ గోపాల్ వర్మ మూవీ

వరుసగా సినిమాలు తీస్తూ... ట్రైలర్లు, పోస్టర్లు రిలీజ్ చేస్తూ బిజీగా మారారు. ఒక దాని తర్వాత ఒకటి వరుస సినిమాలను తీస్తూ వర్మ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పరిటాల రవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల నిజ జీవితాలపై సినిమా తీసిన వర్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తానంటూ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. మారుతి రాసిన అమృతప్రణయ గాథ అంటూ ఆయన ప్రస్తుతం నిజజీవిత కథ ఆధారంగా 'మర్డర్'‌ సినిమాను కూడా తీస్తున్నారు. అయితే తాజాగా వర్మ దృష్టి ఇప్పుడు పవర్ స్టార్‌పై పడింది. 'బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను' అంటూ ప్రకటన చేశారు. వర్మ తాజాగా చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వర్మ ఇచ్చిన క్లూస్‌తో ఈ సినిమాలో ఎవరెవరు ఉంటున్నారన్న దానికి ట్వీట్లతో బదులు ఇస్తున్నారు పీకే అంటే అని తెలిసిందే. ఇక ఎమ్మెస్ అంటే మెగాస్టార్, ఎన్బీ అంటే నాగబాబు, టీఎస్ త్రివక్రమ్ అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నా లెజ్ నోవా రష్యన్ మోడల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పవన్‌కు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఇద్దరు పిల్లలు కాగా, ప్రస్తుతం ఉన్న భార్యకు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక పవన్ అప్పుడప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. తన ఫాం హౌస్‌లో ఆ పనులు చేస్తుంటారు. మొత్తం మీద పవన్ కళ్యాన్ మొత్తం జీవితం ఆధారంగా వర్మ ఈ బయోపిక్ తీస్తున్నట్లు తెలుస్తొంది. అయితే వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2A8iFWq

కృష్ణ అండ్ హిజ్ లీల: మోతాదుకు మించిన రొమాన్స్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

ఈ మధ్యకాలంలో సినిమాలపై ఫిర్యాదులు నమోదు కావడం కామన్ అయిపోయింది. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారంటూ రిలీజ్‌కి ముందు లేదా మూవీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పలు సినిమాల విషయంలో ఇదే జరిగింది. తాజాగా యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా '' సినిమాపై ఇలానే ఓ ఫిర్యాదు నమోదైంది. గుంటూరు టాకీస్, గరుడవేగ సినిమాలతో నటనా ప్రతిభను చాటిన సిద్దు జొన్నలగడ్డ హీరోగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమా రూపొందింది. రానా ద‌గ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరోయిన్, జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ నటించింది. మరో ఇద్దరు హీరోయిన్స్ సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి ముఖ్యపాత్రలు పోషించారు. గురువారం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే తాజాగా సినిమాపై వివాదం చుట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. Also Read: 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాలో హీరోహీరోయిన్ల పాత్రలకు హిందూ దేవతల పేర్లు పెట్టడమే కాకుండా మోతాదుకు మించిన రొమాన్స్ సన్నివేశాలను పెట్టారని రాకేష్ అనే వ్య‌క్తి అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తూ ఈ శృంగార‌భ‌రిత చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g26ZE7

iPhone 12 Models Reportedly Won't Come With Earphones, Adapter in the Box

A new Barclays investor note has been accessed by MacRumors, and analysts from the firm also suggest that the iPhone 12 series won't come with EarPods in the box. The note goes on to add that Apple...

from NDTV Gadgets - Latest https://ift.tt/3dAjkOh

Realme X3 SuperZoom, Realme X3 Update Brings June 2020 Patch, More

Realme X3 SuperZoom and Realme X3 phones have started to receive a new update. The new update brings along the June 2020 Android security patch alongside improved system stability. The updates are...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eClVbO

Russian Cybercriminal Gets 9 Years for Online Fraud Website

A Russian computer hacker who facilitated $20 million in credit card fraud and ran a sophisticated clearinghouse for international cybercriminals was sentenced Friday to nine years in prison.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NyTnDZ

టాప్ 10 టాలీవుడ్ హీరోల లిస్ట్.. మొదటి స్థానంలో నిలిచిన అల్లు అర్జున్.. బన్నీ ఫ్యాన్స్ ఖుషీ!!

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాదికి గాను టాప్ 10 తెలుగు హీరోల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరోగా మొదటి స్థానంలో నిలిచారు. , ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఆ తర్వాతి వరుసలో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ పలు రికార్డులను చెరిపేసి నాన్ బాహుబలి రికార్డ్ నమోదు చేసింది. ఇకపోతే ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన ఈ లిస్టులో అల్లు అర్జున్ తర్వాత రెండో స్థానంలో మహేష్ బాబు నిలిచారు. మూడో స్థానంలో ప్రభాస్, నాల్గవ స్థానంలో పవన్ కళ్యాణ్, ఐదవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరవ స్థానంలో చిరంజీవి, ఏడవ స్థానంలో విజయ్ దేవరకొండ, ఎనిమిదవ స్థానంలో నాని, తొమ్మిదో స్థానంలో రామ్ చరణ్, చివరగా పదో స్థానంలో వెంకటేష్ నిలిచారు. Also Read: అయితే తమ అభిమాన హీరో టాప్ ప్లేస్‌లో నిలవడం చూసి అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫామ్ లోకి వచ్చారంటే స్టైలిష్ స్టార్ రేంజ్ ఇదీ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో పూర్తి మాస్ ఓరియెంటెడ్ రోల్ పోషిస్తున్నారు బన్నీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VpebSJ

US Asks Tech CEOs to Ensure Online Platforms Aren't Used to Spur Violence

The US Department of Homeland Security sent a letter to chief executives of five large tech companies asking them to ensure social media platforms are not used to incite violence in the wake of...

from NDTV Gadgets - Latest https://ift.tt/3iabdLy

Telegram to Pay Fine, Return Investor Money to Settle US SEC Charges

Telegram Group has agreed to return $1.2 billion (972.84 million pounds) to investors and pay an $18.5 million civil penalty to resolve charges over an unregistered digital token coin offering, the US...

from NDTV Gadgets - Latest https://ift.tt/3i9cSRC

దాసరి కొడుకులు వెధవల్లా కొట్టుకుంటున్నారేంటి అంటారు..: ప్రెస్ మీట్‌లో అరుణ్ కుమార్

లెజండరీ దర్శకుడు కుటుంబంలో ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నారు. వారి ఇద్దరు కుమారులు ప్రభు-అరుణ్ కుమార్‌లు ఆస్తికోసం రచ్చ కెక్కకెక్కారు. ఇప్పటికే వీరి ఆస్తివ్యవహారం కోర్టులో ఉండగా.. బుధవారం రాత్రి దాసరి చిన్న కుమారుడు ప్రభు ఇంట్లోకి గేటు దూకి మరీ రావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు పెద్ద కొడుకు ప్రభు. అయితే ఈ వ్యవహారంలో అరుణ్ కుమార్‌పై పలు ఆరోపణలు చేయగా.. వాటిపై క్లారిటీ ఇస్తూ శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టారు అరుణ్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎన్నో సమస్యల్ని పరిష్కరించిన నా తండ్రి ఇంట్లోనే సమస్య రావడం చాలా బాధగా ఉంది. ఆయన ఎందరికో అండగా నిలిచారు.. మేం తిట్టుకుని కొట్టుకుంటే చూసే వాళ్లకు వెదవల్లా కనిపిస్తున్నాము. వీళ్లేంటి వెధవల్లా ఆస్తికోసం రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు అనుకుంటారు జనం. ఇలాంటిది అవసరమా?? నాకు మా సిస్టర్, బ్రదర్‌తో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్లకు ప్రాబ్లమ్ ఉంటే వచ్చి మాట్లాడి సమస్యను పరిష్కరించుకోమనండి. మా అన్నయ్యకు ఏవైనా సమస్యలు ఉంటే నాతో మాట్లాడాలి. అంతే తప్ప ఇండస్ట్రీ పెద్దలు సహకరించడం లేదని వాళ్లను బయటకు లాగడం కరెక్ట్ కాదు. నేను ఎవరి ప్రాపర్టీలోకి దూకలేదు.. నా ప్రాపర్టీలోకి నేను వెళ్లా. నా ఆధార్‌‌తో పాటు పాన్‌ కార్డ్‌ మిగతా అన్ని అడ్రస్‌లు ఆ ఇంటివే ఉంటాయి. అడ్రస్ ఉన్నంత మాత్రాన ఆ ఇళ్లు నా ఒక్కడిదే అని చెప్పడం లేదు.. నాది, మా బ్రదర్, సిస్టర్‌ది. మొన్న రాత్రి ఆ ఇంటికి వెళ్లింది నేనే.. ఎందుకంటే నాకు ఒక కొరియర్ వచ్చింది. సాయత్రం 6.30 రావడంతో అది తీసుకోవడానికి వెళ్లాను. కొరియర్ బాయ్ ఫోన్ చేసి మీ డాక్యుమెంట్స్ కొరియర్ ఇంటి దగ్గర ఇచ్చాం అన్నారు. నేను దాన్ని తీసుకోవడానికి రాత్రి 9.30కి వెళ్లా. ఇంచుమించు అరగంట బెల్ కొట్టా.. వాళ్లు డోర్ తీయలేదు. అందుకే గేట్ దూకి వెళ్లాను. నేను గేట్ దూకి వెళ్లడం కొత్తేం కాదు. గురువు గారు (దాసరి) ఉన్నప్పుడు కూడా గేట్ దూచి వెళ్లేవాడిని. అలాగే ఇప్పుడూ వెళ్లా. హాల్‌లో ఎవరూ లేకపోవడంతో మా నాన్న గారి రూంలోకి వెళ్లా. ఆ తరువాత మా అన్నయ్య రావడంతో నా డాక్యుమెంట్స్ కొరియర్ వచ్చింది ఇవ్వమని అడిగా.. లేదు అని హడావిడిగా కిందికి వెళ్లాడు. ఓ పది నిమిషాల తరువాత జూబ్లీహిల్స్ ఎస్ ఐ నవీన్ ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఆయనే నా కొరియర్ డాక్యుమెంట్స్ ఇప్పించారు. వాటిని తీసుకుని వెళ్లిపోయా. నేను తాగి వెళ్లి హడావిడి చేశా అనడంలో నిజం లేదు. ఎందుకంటే తాగి వెళ్లితే ఆ గేటు ఎక్కి అక్కడే పడిపోయేవాడిని. పైగా ఎస్ ఐ గారు కూడా స్పాట్‌లోకి వచ్చి నన్ను చూశారు. మా అన్నయ్య ఇలాంటి ఆరోపణలు చేశారో నాకు తెలియదు. ఇందులో రహస్యం ఏం లేదు.. ఇద్దరికీ ఆస్తి గొడవలు తప్ప ఎలాంటి వేరే గొడవలు లేవు. నాకు మా సిస్టర్, బ్రదర్‌తో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్లకు ప్రాబ్లమ్ ఉంటే వచ్చి మాట్లాడమనండి. వాళ్లకు ఖచ్చితంగా సహకరిస్తా. అంతేతప్ప మీడియా, పోలీస్ స్టేషన్‌లకు వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదు. మేలో నాపై మా అన్నయ్య పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. మా బ్రదర్ నాకు అన్యాయం చేశాడని ఫిర్యాదు చేశాడు. అన్యాయం చేశారని అంటున్నారు.. న్యాయం చేయాలంటే ఏం అన్యాయం చేశానో చెప్పాలి కదా.. అలాందిటి ఏమైనా ఉంటే నిరూపించాలి. నాతో కూర్చుని మాట్లాడితే సమస్యకు పరిష్కారం అవుతుంది. మోహన్ బాబు, సీ కళ్యాణ్, మురళీమోహన్ గారు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు.. వాళ్లు ఏం చేశారు. ముందు నాతో మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ ఇళ్లు ముగ్గురిదీ.. కోర్టు కూడా అదే చెప్పింది’ అంటూ క్లారిటీ ఇచ్చారు .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NyImCD

Google Pixel 4A Spotted on US FCC, May Lack Motion Sensor

Google Pixel 4A has allegedly passed through FCC certification hinting at a launch in the future. Google has passed its mid-cycle update deadline already, given that the Pixel 3a launched in May last...

from NDTV Gadgets - Latest https://ift.tt/386okZG

Samsung Galaxy S20 Series Update Brings July Patch, Camera Tweaks

Samsung Galaxy S20 series is now receiving a new update that brings along the July 2020 Android security patch. This is probably the first phone series to receive the patch, given that we haven't...

from NDTV Gadgets - Latest https://ift.tt/3eEWExF

Mulan Release Date Pushed Back to August

Disney has pushed back the theatrical release of Mulan for the third time as it announced on Saturday that the movie will release on August 21.

from NDTV Gadgets - Latest https://ift.tt/3i8FAlC

Facebook Will Label Newsworthy Posts That Break Rules

Facebook said on Friday it will start labelling newsworthy content that violates the social media company's policies, and label all posts and ads about voting with links to authoritative information,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VpyLCv

Amazon Looks to Self-Driving Future by Acquiring Zoox

Amazon said Friday that it is buying self-driving technology company Zoox, which is developing an autonomous vehicle for a ride-hailing service that people would request on their phones.

from NDTV Gadgets - Latest https://ift.tt/3i9BoC4

Microsoft to Permanently Close All Retail Stores

Microsoft said Friday it will close all of its stores and move its retail operations online, keeping just four locations and transforming them into "experience centers."

from NDTV Gadgets - Latest https://ift.tt/2BGHSaY

Samsung Galaxy A01 Core Leaked Render Tips Design Details

Samsung Galaxy A01 Core is reported to be in the works. The phone was spotted on Google Play Console a while ago, and now an alleged render of the phone has surfaced online. The render gives us a...

from NDTV Gadgets - Latest https://ift.tt/31pNJfB

'Coronavirus crisis is a wake-up call'

'You cannot fight a disease as complex as COVID-19 without a carefully calibrated, localised response.'

from rediff Top Interviews https://ift.tt/3i1dCIF

Friday 26 June 2020

రోడ్డు ప్రమాదంలో.. చిరంజీవి చిన్ననాటి స్నేహితుడు దుర్మరణం

సూర్యాపేటలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్‌లో శుక్రవారం నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు విజయవాడకు చెందిన విజయకుమారి, సత్యానందం, జోసఫ్‌గా పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వైద్య చికిత్స నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సత్యానందం, మెగాస్టార్ బాల్య స్నేహితులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలేనికి చెందిన మైలాబత్తుల సత్యానందం టీచర్‌గా పనిచేస్తున్నారు. చిరంజీవి, సత్యానందం ఇద్దరూ బాల్య స్నేహితులు. నరసాపురం వైఎన్‌ కళాశాలలో ఇద్దరూ కలిసి డిగ్రీ చదువుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రాగా, సత్యానందం టీచర్‌గా స్థిరపడ్డారు. రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. వీరికి కుమారుడు జోసఫ్, కుమార్తె ఉన్నారు. విజయకుమారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సత్యానందం, జోసెఫ్‌తో కలిసి కారులో నిన్న తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dzz83P

Green India Challenge: ఉదయభాను సవాల్ స్వీకరించిన బ్రహ్మానందం

పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తోంది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం ప్రసాదించడమే లక్ష్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. “పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్‌లో ప్రముఖ హాస్యనటులు భాగమయ్యారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ .. బ్రహ్మానందాన్ని నామినేట్ చేసింది. దీంతో ఈ ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మానందం మణికొండ లోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను కేటీఆర్‌, కవిత, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, ప్రభాస్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి లాంటి ఎందరో సెలబ్రిటీలు స్వీకరించి పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యారు. వీళ్లందరినీ ఆదర్శంగా తీసుకొని సాధారణ ప్రజలు సైతం మొక్కలు నాటుతూ హరితహారంలో పాలు పంచుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vnag94

వైసీపీ ఎంపీని ‘RRR’తో పోల్చుతూ.. వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో కరోనాకు మించిన హాట్ టాపిక్‌గా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మారిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు సొంత పార్టీ తరపున షోకాజు నోటీస్ రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. వైసీపీ తనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా.. తనకు సీఎం జగన్‌ మీద ఉన్న గౌరవంతో వాటికి సమాధానం ఇస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు సైతం స్పందించారు. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతోన్న పరిణామాలను పోల్చుతూ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఎంపీ వ్యవహారంతో చోటుచేసుకున్న పరిణామాలపై వర్మ ట్వీట్ చే శారు. 'సినిమాను ప్రేమించే రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' ఎప్పుడు విడుదలై సినిమా థియేటర్లను కాపాడుతుందో నాకు తెలియదు. కానీ, జగన్‌ను ప్రేమించే ఆర్‌ఆర్‌ఆర్‌ (రఘురామకృష్ణంరాజు) వైఎస్సార్‌సీపీని కాపాడడానికి ఇప్పటికే వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అందుకే ఆయన జగన్‌పై స్వచ్ఛ‌మైన ప్రేమను కనబర్చుతారు' అని పేర్కొన్నారు. వర్మ ట్వీట్ పై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో పార్టీ మేనిఫెస్టోకు భిన్నంగా వైసీపీ ఎంపీ పలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో వుంటూ సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g4dHJS

'How can one revive a only Gandhi family party?'

'The party dropped me as a spokesperson for showing a roadmap. It shows that the party either has a high level of arrogance or they are completely detached from ground realities.'

from rediff Top Interviews https://ift.tt/2B5y36H

యోగాతో ఆరోగ్యం, ఆనందం.. ఆద్యుడు పరమశివుడే, విశిష్టత..

యోగా.. సాక్షాత్ పరమశివుడు ఆద్యుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా చేయడం వల్ల అనారోగ్య బారినపడరని, ఆరోగ్యం ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. కానీ 21వ శతాబ్దంలో మళ్లీ యోగాకు క్రేజీ ఏర్పడింది. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి యోగా డే ను

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/2YQX3Xa

నగ్నం: సరస శృంగార భరితం.. మరో వీడియోతో పరేషాన్ చేసిన వర్మ.. డైరెక్టుగా గురి పెట్టేశాడు!

వివాదాస్పద దర్శకుడిగా ఫేమ్ అయిన .. అనుక్షణం సంచలనం అనే ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ని క్యాచ్ చేస్తూ ఆడియన్స్ నోళ్ళలో నానిపోతున్నారు. మొదట విలక్షణ దర్శకుడిగా 'శివ, క్షణక్షణం' లాంటి సరికొత్త కథాంశాలను తెలుగు ప్రేక్షకుల ముందుంచిన ఆయన.. ఆ తర్వాత కొంతకాలానికి హారర్ సినిమాలు చేశారు. రీసెంట్‌గా రాజకీయ నేపథ్యంలోనూ సినిమాలు రూపొందించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు అడల్ట్ మూవీస్‌పై కన్నేసి టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు వర్మ. ఈ నేపథ్యంలో ఇటీవలే 'క్లైమాక్స్' అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో యువతను ఆకర్షించిన రామ్ గోపాల్ వర్మ.. గత 10 రోజులుగా '' మూవీ అప్‌డేట్స్ ఇస్తూ ఫుల్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రమోషన్స్ విషయంలో తనకంటూ ఓ స్పెషాలిటీ ఉంటుందని నిరూపిస్తూ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు ట్రైలర్స్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సాంగ్ రిలీజ్ చేసి యువతకు గురి పెట్టేస్తూ తన 'నగ్నం' మూవీపై ఆసక్తి రేకెత్తించారు. Also Read: తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో సన్నివేశాలు చూస్తుంటే.. అబ్బో! కెమెరాను ఇలా కూడా వాడుకోవచ్చా? అడల్ట్ మూవీని ఈ రకంగా కూడా రూపొందించవచ్చా? అనే సందేహం కలుగుతోంది. పైగా బోల్డ్ సన్నివేశాలు వస్తుండగా ''సరస శృంగార భరితం'' ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ ప్లే అవుతుండటం సరస ప్రియులను మరింత ఆకర్షిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో 'నగ్నం' () మూవీ రూపొందిస్తున్నారు వర్మ. ఈ చిత్రాన్ని జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. ఇది చూడాలంటే 200 రూపాయలు చెల్లించాలని ఆయన డిసైడ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31lrV4F

RRR: అలాంటి వార్తల్లో నిజం లేదు.. ఆలియా రెడీ అంటోంది!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. , ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ ఫినిష్ అయింది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డ షూటింగ్ అతిత్వరలో తిరిగి రీ ఓపెన్ కానున్న ఈ సమయంలో మెగా, నందమూరి అభిమానులు నిరాశ చెందే వార్తలు పుట్టుకొచ్చాయి. RRR సినిమాలో రామ్ చరణ్ జోడీగా నటించనున్న ఆలియా భట్.. అనుకోకుండా తప్పుకుందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ విషయాన్ని ఆలియా జక్కన్నతో కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మెగా అభిమానుల్లో కాసింత నిరుత్సాహం కనిపించింది. అయితే ఈ వార్తలు చూసిన జక్కన్న టీం అలాంటిదేమీ లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆలియా ఎప్పటికప్పుడు రాజమౌళితో టచ్ లోనే ఉంటోందని, షూటింగ్ ప్రారంభించడాన్ని బట్టి డేట్స్ ఇవ్వడానికి ఆమె రెడీగా ఉందని వారు అంటున్నారట. Also Read: రౌద్రం రణం రుధిరం (RRR) షూటింగ్ నిమిత్తమై నార్త్ ఇండియాతో పాటు, విదేశాల్లో పలు లొకేషన్స్ ఎంచుకున్నారు రాజమౌళి. అయితే కరోనా విలయతాండవంతో ప్లాన్ అంతా మార్చేసిన ఆయన.. మిగిలిన పార్ట్ షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్‌పై షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ విడుదల చేయాలనేది జక్కన్న ప్లాన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BJ9lZL

Why Is Mission: Impossible – Fallout Censored on Netflix in India?

Netflix is playing a censored version of Mission: Impossible – Fallout on its platform in India, which erases all mentions of Kashmir. This is the version that was approved for theatrical release by...

from NDTV Gadgets - Latest https://ift.tt/2A8nYoR

YouTube Testing TikTok-Like Short Video Format on Android, iOS

YouTube is testing a new feature on its mobile apps that will allow users to create and upload short 15-second clips, similar to TikTok. The feature is currently available to limited users, and a mass...

from NDTV Gadgets - Latest https://ift.tt/2CzT1uz

Google Adds Support for Group Video Calls via Duo, Meet Smart Displays

Google is adding the ability to make group video calls with Google Duo and Google Meet via smart displays, starting with the US. Nest Hub Max, JBL Link View, Lenovo's 8-inch and 10-inch Smart...

from NDTV Gadgets - Latest https://ift.tt/2A4atqc

PUBG Mobile's Tiny Livik Map Will Only Support 40-Player Matches

PUBG Mobile is getting Livik as a new map to let gamers play quick matches while on-the-go. The map was announced by the official PUBG Mobile account on Twitter on Thursday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3iaLuD5

Mitron App Hits 1 Crore Downloads on Google Play Amidst Anti-China Sentiment

Mitron app, which was launched as an "Indian alternative" to TikTok, has crossed one crore downloads on Google Play store. The app achieved this milestone in just over two months of its launch,...

from NDTV Gadgets - Latest https://ift.tt/2CDbsOZ

Android 11 Developer Preview for Android TV Announced

Google has announced the Android 11 Developer Preview for Android TV, the first time the company has announced such a program. A video clip in the announcement also shows off the design of the...

from NDTV Gadgets - Latest https://ift.tt/2CzKRCr

TikTok Pushes an Update to Stop Snooping of iPhone Users Through Clipboard

TikTok has promised to no longer access the system clipboard of iPhone users after the first beta of iOS 14 revealed that it was doing just that.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dztw9y

Cyberpunk 2077 Trailer, and Cyberpunk: Edgerunners Netflix Anime Unveiled

CD Projekt Red has unveiled a new trailer for Cyberpunk 2077, and announced a new original anime series called Cyberpunk: Edgerunners, which will release in 2022 on Netflix.

from NDTV Gadgets - Latest https://ift.tt/2YxfKA8

Google Photos Gets a Complete Redesign: New Logo and UI, Maps View, More

Google Photos gets a major new upgrade with a new simpler interface, a brand new logo, a new Map view in the search tab, and a more comprehensive Memories section. The redesign is rolling out for...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VnUE5k

Thursday 25 June 2020

డైరెక్టర్ వచ్చి ఆ మాట అడిగాడు.. రెడీ అన్నాను కానీ అదంతా నా అసిస్టెంట్ రికార్డ్ చేశాడు: శ్రద్ద శ్రీనాథ్

తెలుగులో ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' సినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ . మొదటి సినిమాతోనే మంచి బ్రేక్ తెచ్చుకున్న ఈ బ్యూటీ సెట్స్ మీద గానీ, నిజ జీవితంలో గానీ చాలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటుంది. దీంతో వరుస సౌత్‌లో అవకాశాలు పట్టేసిన ఈమె ‘’లో నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా సమర్పణలో రవికాంత్ పేరూరు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గురువారం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది శ్రద్ద శ్రీనాథ్. జూన్ 2017లో హైదరాబాద్ లోని నంది హిల్స్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను బుల్లెట్ నడుపుతూ క్రింద పడిన విషయాన్ని చెబుతూ ఆ సమయంలో డైరెక్టర్‌కి, తనకు మధ్య జరిగిన సంభాషణను వివరించింది. Also Read: ''క్రిష్ణ అండ్‌ హిజ్‌ లీల షూటింగ్‌లో భాగంగా నేను బైక్ నడిపే సన్నివేశం ఉంది. అందుకోసం డైరక్టర్ రవికాంత్.. నా దగ్గరికి వచ్చి బైక్ నడపగలవా? అన్నారు. రాజీపడటం ఇష్టంలేక దానికి నేను.. రాదు కానీ ట్రై చేస్తా అని చెప్పి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎక్కేశా. ఇందుకు కారణం నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు బైక్ నడిపిన అనుభవం ఉండటమే. అయితే ఆ రోజు ఆ ప్రాంతమంతా తడిగా ఉంది. దీంతో అలా బైక్ ఎక్కి టర్న్ చేశానో లేదో.. బ్యాలన్స్ తప్పి క్రింద పడిపోయా. ఆ ఘటనను మొత్తం నా అసిస్టెంట్ ప్రశాంత్ సరదాగా వీడియో తీశాడు. అలా నేను క్రిందపడగానే సెట్ లో ఉన్నవాళ్లంతా సెట్‌లో ఉన్న వారంతా నాకేమైందోనని కంగారు పడ్డారు. నాకేమీ కాలేదు కానీ బైక్‌ కొద్దిగా డ్యామేజ్‌ అయ్యింది. అందుకే పడ్డానేమో అనుకుంటున్నా. అయినా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు ఎందుకు అంత బరువుగా ఉంటుందో అంటూ ఆ వీడియోను షేర్ చేసింది శ్రద్ద శ్రీనాథ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g0FbQy

Waymo, Volvo Cars Partner to Build Self-Driving Vehicles

Waymo and the Volvo Cars Group have agreed to develop a self-driving electric vehicle designed for ride hailing use, as part of a new global partnership, the companies said on Thursday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3i3RX2t

To Boldly Go: NASA Launches Lunar Loo Challenge

NASA is calling on the world's inventors to develop a toilet that works not just in microgravity, but also lunar gravity.

from NDTV Gadgets - Latest https://ift.tt/2Ywl2vI

Burning In Your Headphones: Does It Work?

Does burning in your headphones really work? Headphone specialist Raghav Somani goes into the details on whether this technique really makes a difference to the sound on your headphones.

from NDTV Gadgets - Latest https://ift.tt/2ZbBH6P

Huawei to Build $1.2-Billion Research Centre in the UK

Huawei Technologies said on Thursday it had received planning permission for a 1 billion pound ($1.2 billion) research and development facility in England.

from NDTV Gadgets - Latest https://ift.tt/3dGsBEA

Tenet Pushed Back to August, as US Records New Coronavirus Peak

Tenet new release date in India is August 12. Christopher Nolan's time-bending espionage epic movie has been delayed an additional two weeks from July 31 to August 12, as coronavirus cases hit a new...

from NDTV Gadgets - Latest https://ift.tt/2VjUBr4

Facebook to Warn Users When They Share Old Articles

Facebook said Thursday it was looking to add notifications about the source of coronavirus-related posts and will warn users when they share stories that are more than 90 days old.

from NDTV Gadgets - Latest https://ift.tt/31oQTjX

'Kejriwal is waking up now after COVID-19 has spread'

'The main reason being Kejriwal's working style is very centralised.'

from rediff Top Interviews https://ift.tt/31hZvIV

'Vested interests want private players in space'

'ISRO facilities are very expensive and any damage caused by these start-ups can create havoc to our space programme.'

from rediff Top Interviews https://ift.tt/2A5cBOB

‘వచ్చేస్తున్నాం’ అంటున్న వదినమ్మ.. వంటలక్క ఏది?

‘వచ్చేస్తున్నాం’ అంటున్న వదినమ్మ.. వంటలక్క ఏది?




from Telugu Samayam https://ift.tt/2B2i2hR

WhatsApp Says Brazil Central Bank Willing to Restore Payments Service

Facebook messaging service WhatsApp said on Thursday that Brazil's central bank had said it intended to find a way to restore the payments service in the country by working with Visa and Mastercard.

from NDTV Gadgets - Latest https://ift.tt/31ia12T

యోగాతో ఆరోగ్యం, ఆనందం.. ఆద్యుడు పరమశివుడే, విశిష్టత..

యోగా.. సాక్షాత్ పరమశివుడు ఆద్యుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా చేయడం వల్ల అనారోగ్య బారినపడరని, ఆరోగ్యం ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. కానీ 21వ శతాబ్దంలో మళ్లీ యోగాకు క్రేజీ ఏర్పడింది. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి యోగా డే ను

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/2BCe0MW

ప్లాన్స్ అన్నీ బ్లర్.. సీన్ రివర్స్ అయింది! వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ సందేశం

మెగా ప్రిన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ ఏడాది పరిస్థితుల గురించి సింగిల్ లైన్‌లో చెబుతూ సందేశమిచ్చారు. కారణంగా ఈ ఏడాది జన జీవనం స్తంభించి పోవడమే గాక, ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే. రోజువారీ కూలీ నుంచి బడా వ్యాపారవేత్త వరకు ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ప్రతీ ఒక్కరినీ కాటేసింది కరోనా. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అంతా అతలాకుతలమైంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయి దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్ల ప్లాన్స్ తలక్రిందులయ్యాయి. అయితే ఇటీవలే తిరిగి షూటింగ్స్‌కి అనుమతి రావడం, కొన్ని సినిమాలు సెట్స్ మీదకు రావడం లాంటి పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ, కరోనా విలయతాండవం చూస్తుంటే అది ఎంతకాలమో అర్థం కాని పరిస్థితి. ఎవ్వరూ ఉహించించని ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు భయటపడతామనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశిస్తూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ సందేశం పోస్ట్ చేశారు. Also Read: 2020.. ఈ ఏడాది వేసుకున్న ప్లాన్స్ అన్నీ బ్లర్ అయ్యాయి అని పేర్కొంటూ మొత్తం పింక్ కలర్‌లో ఉన్న ఓ బ్లర్ పిక్ షేర్ చేశారు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాకు ఒప్పుకున్న వరుణ్.. అందుకోసం ప్రిపేర్ అవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న అల్లు బాబీ - సిద్ధూ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VAMWF9

'No Indian captain has achieved what Dhoni has'

'Dhoni was a very shrewd captain in terms of his out of the box thinking and getting the work done.'

from rediff Top Interviews https://ift.tt/3fUwpTS

యోగాతో ఆరోగ్యం, ఆనందం.. ఆద్యుడు పరమశివుడే, విశిష్టత..

యోగా.. సాక్షాత్ పరమశివుడు ఆద్యుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా చేయడం వల్ల అనారోగ్య బారినపడరని, ఆరోగ్యం ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. కానీ 21వ శతాబ్దంలో మళ్లీ యోగాకు క్రేజీ ఏర్పడింది. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి యోగా డే ను

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/2YWWMSv

Samsung Galaxy M01s Tipped to Launch With 32GB Onboard Storage

Samsung Galaxy M01s details have leaked again, it is tipped to get 32GB of internal storage.

from NDTV Gadgets - Latest https://ift.tt/2NtAUbX

Marvel's Avengers Gameplay, Co-Op, Story Trailers Unveiled

Marvel's Avengers developer Crystal Dynamics unveiled seven minutes of gameplay, the first look at co-op features, and a story trailer during a live stream on Wednesday.

from NDTV Gadgets - Latest https://ift.tt/3ewxZLH

More US Companies Join Facebook Ad Boycott Bandwagon

A handful of US companies have pulled advertising from Facebook Inc in support of a campaign that called out the social media giant for not doing enough to stop hate speech on its platforms.

from NDTV Gadgets - Latest https://ift.tt/31cr86c

Nintendo, Tencent Team Up on Pokemon Unite Battler

Nintendo-backed The Pokemon Company on Wednesday announced a cross-platform Pokemon team battling game developed with Tencent's Timi Studio as the two gaming heavyweights deepen their cooperation with...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BCQKhM

'Ladakh is biggest security challenge for Modi'

'I hope the government wakes up, understands that the way they have been handling security and strategic affairs.'

from rediff Top Interviews https://ift.tt/31fc47W

Wednesday 24 June 2020

Hyper Aadi: బాలయ్య డైలాగ్‌తో జబర్దస్త్ పంచ్ విసిరిన హైపర్ ఆది.. అబ్బో! రోజా ఫీలింగ్స్ చూస్తే..

కరోనా ప్రభావంతో దాదాపు మూడు నెలలుగా ఆగిపోయిన 'ఎక్స్ ట్రా జబర్దస్త్' షూటింగ్ తిరిగి రీ ఓపెన్ అయింది. ఇన్నాళ్లు పాత ఎపిసోడ్స్ రిపీట్ చేస్తూ వచ్చిన ఆ ఛానెల్ నిర్వాహకులు ఇకపై ఒరిజినల్ కంటెంట్ ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే జూన్ 25, 26 తేదీలకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్స్ పూర్తిచేసి జబర్దస్త్ కిక్కిచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమం లోనే ఈ రెండు ఎపిసోడ్స్ ప్రోమో వీడియోలు రిలీజ్ చేసి రక్తి కట్టించారు. లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి హాస్యపు సువాసన రావడంతో ఈ ప్రోమో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా జూన్ 25 తాలూకు ప్రోమో వీడియోలో వేసిన పంచ్ డైలాగులు ఈ ఎపిసోడ్‌పై ఆతృతను పెంచేశాయి. జబర్దస్త్ పంచులతో హోరెత్తించిన హైపర్ ఆది.. ఎప్పటిలాగే మరోసారి తనలోని టాలెంట్ బయటపెట్టాడు. బోయపాటి శ్రీను- కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ఫస్ట్ రోర్‌లో నందమూరి నటసింహం చెప్పిన డైలాగ్‌ని తనకు అనువుగా జబర్దస్త్ పంచ్ వేసేశాడు. Also Read: 'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. లం***' అంటూ బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగును ''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్లులా ఉంది అనడానికి.. ఆది గారు మా కుళ్లిపోయిన జంట ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా.. లక్డీ కపూల్'' అంటూ రెచ్చిపోయాడు. ఈ డైలాగ్, దాన్ని ఆది డెలివరీ చేసిన విధానం చూసి ఒక్కసారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వేసింది జబర్దస్త్ జడ్జి . దెబ్బకు అనసూయ సైతం నోరెళ్ళబెట్టి స్మైల్ ఇచ్చింది. ఇకపోతే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆది చెప్పిన ఆ డైలాగ్‌ని పదే పదే రిపీట్ చేసుకొని మరీ చూస్తున్నారు. గతంలోనూ బాలయ్య డైలాగులతో పంచులేసి పరేషాన్ చేసిన హైపర్ ఆది.. లాక్ డౌన్ తర్వాత రావడం రావడమే మళ్ళీ బాలయ్యను తగులుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vf0lT5

OnePlus Nord Moniker Seems to Have Received Official Confirmation

OnePlus Nord name seems to have received an official confirmation. While the upcoming affordable OnePlus phone was up until now speculated to debut as either the OnePlus Z or OnePlus Nord, OnePlus on...

from NDTV Gadgets - Latest https://ift.tt/2CEI3Ei

NASA Renames Washington HQ for Hidden Figures Trailblazer Mary Jackson

NASA said Wednesday that it will rename its Washington headquarters after its first black female engineer, Mary Jackson, whose story was told in the hit film "Hidden Figures."

from NDTV Gadgets - Latest https://ift.tt/2A0tOZl

Realme 2 Pro Starts Receiving Android 10-Based Realme UI Update in India

Realme 2 Pro is the latest smartphone in the company's product portfolio to receive the Android 10-based Realme UI update. Realme has been rolling out the software update sporadically to many of its...

from NDTV Gadgets - Latest https://ift.tt/2BEHVnw

Motorola to Host Event on July 7, New Phones Launch Expected: Report

Motorola is reportedly hosting an event on July 7. It is speculated that the Lenovo-owned company will unveil new smartphones including the Motorola One Fusion and Motorola Edge Lite.

from NDTV Gadgets - Latest https://ift.tt/2AYE2dt

ISRO Says Gaganyaan, Chandrayaan, 10 Launches Disturbed Due to Lockdown

Ten space missions being prepared for launch this year have been "disturbed" due to the coronavirus-induced lockdown besides delay in the human space and Moon missions, ISRO chief K Sivan said on...

from NDTV Gadgets - Latest https://ift.tt/31gx5iu

Samsung Galaxy M51 Launch May Have Been Pushed to September

Samsung Galaxy M51, which is rumoured to be a new entrant in Samsung's Galaxy M series, seems to have been delayed due to production issues. A new report claims that the phone will now launch in...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fTGEbd

Watch the Trailer for Rasbhari, Now Streaming on Prime Video

Amazon Prime Video has unveiled a new comedy-drama series called Rasbhari, starring Swara Bhasker in the lead. Created by Tanveer Bookwala and Shantanu Srivastava, Rasbhari is already streaming on...

from NDTV Gadgets - Latest https://ift.tt/3i1XIhd

E-Tailers in India to Consider 'Country of Origin' Label on Products

E-commerce players in India such as Amazon's local unit and Walmart's Flipkart will consider asking sellers on their platforms to list the country of origin on products, three sources familiar with...

from NDTV Gadgets - Latest https://ift.tt/3fVv1QX

'Maximum number of cases per day around mid-July'

'It will only get worse, definitely, for the next month and one-and-a-half months.'

from rediff Top Interviews https://ift.tt/2B991TV

సర్కారు వారి పాట: మహేష్ బాబును ఢీ కొట్టబోయే విలన్ ఆయనే..! ఇదే ఫైనల్..

''మహర్షి, సరిలేరు నీకెవ్వరు'' లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ల తర్వాత సూపర్ స్టార్ నటించనున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ లుక్ రిలీజ్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయిన చిత్రయూనిట్.. నటీనటుల ఎంపిక విషయమై స్పెషల్ కేర్ తీసుకుంటోందట. ఇటీవలే మహేష్ సరసన నటించే హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసిన డైరెక్టర్.. ఇక విలన్ రోల్ కోసం పవర్‌ఫుల్ యాక్టర్‌ని వెతికేపనిలో పడ్డారు. మహేష్ బాబును ఢీ కొట్టే పాత్ర సినిమాలో కీలక భూమిక పోషించనుంది తెలుస్తోంది. ఈ క్రమంలోనే విలన్ రోల్ కోసం ముందుగా ఉపేంద్ర, సుదీప్ లాంటి నటులను పరిశీలించిన పరశురామ్.. ఫైనల్‌గా అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అరవింద్ స్వామితో సంప్రదింపుల కార్యక్రమం నడుస్తోందని సమాచారం. Also Read: గతంలో తెలుగు తెరపై రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన 'ధృవ' విలన్ రోల్ చేసి మెప్పించారు అరవింద్ స్వామి. ఆ పాత్ర తీరుతన్నెలు పరిశీలించిన తర్వాతే పరశురామ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇకపోతే 'సర్కారు వారి పాట' స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. వీటి ప్రకారం బ్యాంకింగ్ రంగంలో కుంభకోణం నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాల సంయుక్త సమర్పణలో నవీన్‌ యర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఈ మూవీపై మహేష్ అభిమానులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2B7pt7j

Google's New Default Wipes User Location, Web History After 18 Months

Google said on Wednesday it will automatically delete some location history after 18 months for new users and make it easier for everyone to access its search, Maps and YouTube apps without being...

from NDTV Gadgets - Latest https://ift.tt/2YwTma7

యోగాతో ఆరోగ్యం, ఆనందం.. ఆద్యుడు పరమశివుడే, విశిష్టత..

యోగా.. సాక్షాత్ పరమశివుడు ఆద్యుడని పురాణాలు చెబుతున్నాయి. యోగా చేయడం వల్ల అనారోగ్య బారినపడరని, ఆరోగ్యం ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. కానీ 21వ శతాబ్దంలో మళ్లీ యోగాకు క్రేజీ ఏర్పడింది. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి యోగా డే ను

from Oneindia.in - thatsTelugu Features https://ift.tt/30ZcoHA

'If our troops had fired anything could have happened'

'It could have moved from the use of small arms to artillery fire.'

from rediff Top Interviews https://ift.tt/2NqFg3s

రెండేళ్ల పాటు అదే అనుభవం.. ఆత్మహత్యే శరణ్యమని భావించా: 'బిగ్ బాస్' బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం యావత్ చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువ నటుడి బలవన్మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆయన మరణానికి కారణం డిప్రెషన్ అని తెలియడం, పైగా వృత్తి జీవితంలో ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగానే ఆయన డిప్రెషన్‌ లోకి వెళ్లారని వార్తలు రావడంతో ఈ ఇష్యూ చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో చిత్ర సీమలో నెపోటిజం, డిప్రెషన్ లాంటి అంశాలపై ఒక్కొక్కరుగా తమ అనుభవాలు చెబుతూ బాధను వెళ్లగక్కుతుండటం ఎన్నో అనుమానాలకు తెరలేపుతోంది. ఈ నేపథ్యంలోనే నటి, ‘’ ఫేమ్ తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు బయటపెట్టింది. తన జీవితంలో ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి చెబుతూ ఒకానొక టైమ్‌లో సూసైడ్ చేసుకోవాలని కూడా డిసైడ్ అయినట్లు పేర్కొంది. వృత్తి పరంగా అవకాశాలు రాక రెండేళ్లపాటు తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, చివరకు ఇంటి టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, ఆ సమయంలోనే 'బిగ్ బాస్' ఆఫర్ రావడంతో పరిస్థితులు మారిపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. Also Read: ''2015 సంవత్సరంలో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ఆఫర్స్ తగ్గాయి. దీంతో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యే దారి అనుకున్నా. అనంతరం బిగ్ బాస్ రూపంలో వచ్చిన అవకాశం నన్ను మార్చేసింది. బిగ్‌బాస్ తర్వాత అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి దృడంగా తయారయ్యాను. తరచూ ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, డాక్టర్స్ వద్ద కౌన్సిలింగ్ తీసుకోవడంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది'' అని నందినీరాయ్ పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31luAeC

హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. నలుగురు యువకులు అరెస్ట్

టాలీవుడ్ హీరోయిన్ వచ్చాయి. లాక్ డౌన్‌తో ఆమె సొంత రాష్ట్రమైన కేరళలోనే ఆమె గత కొన్ని రోజులుగా ఉంటున్నారు. అయితే పూర్ణను టార్గెట్ చేసిన నలుగురు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆమెపై బెదిరింపులకు దిగారు. తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో పూర్ణ, ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టైన నలుగురు నిందితుల వివరాలను మరడు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిలో అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ ఉన్నారు. నలుగురూ నటిని బెదిరిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు నలుగురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. గతంలో కూడా వీరు ఇతర ప్రముఖులను ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పూర్ణ అసలు పేరు శ్యామ్నా కాసిం. ఆమెది కేరళ. పుట్టింది పెరిగింది చదివింది అంతా కేరళలోనే. 2007లో వచ్చిన శ్రీ మహాలక్ష్మీ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి సీమ టపాకాయ్ చిత్రంలో జత కటటింది. 2012లో వచ్చిన అవును సినిమాతో పూర్ణ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. దెయ్యాల సినిమాల్లో ఆమె ప్రత్యేకంగా నిలిచింది. అవును2, రాజు గారి గది 2లో కూడా పూర్ణ నటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YwrjaQ

Realme X3 Series, Realme Buds Q Launching in India Today: Watch Livestream

Realme X3 SuperZoom and Realme X3 are all set to launch in India today. The company will also introduce the Realme Buds Q in the Indian market during the event that will begin at 12.30pm IST today....

from NDTV Gadgets - Latest https://ift.tt/3drMuPj

OnePlus 8 Pro to Go on Sale Today at 12 Noon via Amazon, OnePlus.in

OnePlus 8 Pro sale will begin at 12pm (noon) IST on Amazon India and OnePlus.in. The price of the phone is set at Rs. 54,999 for the 8GB + 128GB storage variant, while the 12GB + 256GB storage model...

from NDTV Gadgets - Latest https://ift.tt/2Yu09kE

Hyper Aadi: నాడు సునీల్ ముందు నేను రిక్షావాలా.. తర్వాత అదే సునీల్‌తో..: హైపర్ ఆది

లాక్ డౌన్ సడలింపులతో జోరు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ప్రోమోలు కూడా రిలీజ్ కావడంతో.. కామెడీ లవర్స్ పండుగచేసుకుంటున్నారు. అయితే.. ఈ జోరులో జబర్దస్త్ కమీడియన్స్ ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. దాంతో ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాకు చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద కనిపించాలనే డ్రీమ్స్ ఏం లేవు. నాకు బిటెక్ అయిపోయి 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత ఇటుసైడ్ వచ్చాను. జబర్దస్త్ అప్పట్లో ఎక్కువ ఇంట్రెస్ట్‌గా జాబ్ చేసేప్పుడు ల్యాప్ టాప్‌లో చూస్తూ ఉండేవాళ్లం. హైదరాబాద్ వచ్చాక వాళ్లు ఎక్కడుంటారో తెలుసుకోవాలి.. చూడాలనే చిన్న ఆత్రుత ఉండేది. అయితే నేను చేసిన ఒక చిన్న షార్ట్ ఫిలిమ్‌కి అదిరే అభి ‘బాగుంది బ్రదర్.. ఒకసారి కలువు’ అని ఒక మెసేజ్ పెట్టాడు. అయితే అన్న దేని గురించి మాట్లాడతాడు అనేదానికన్నా ఫస్ట్ వాళ్లందరినీ చూడాలన్న ఆత్రుతతో మెసేజ్ పెట్టగానే వెళ్లి అక్కడున్న టీమ్ లీడర్ దగ్గర నుంచి కంటెస్టెంట్స్ వరకూ అందరితో ఫోటోస్ దిగేశాను ఫస్ట్. వాళ్లందరితో ఫోటోస్ దిగి ఫేస్ బుక్‌లో పెట్టేశాను. అప్పటి దాక ఒక లైక్, రెండు లైక్స్ వచ్చే నాకు... జబర్దస్త్ వాళ్లతో ఫోటో పెట్టగానే.. రెండొందల లైక్స్, మూడొందల లైక్స్.. ఇలా పెరగడంతో.. నాకు ఆలోచన వచ్చింది. ఫోటో పెడితేనే ఇన్ని లైక్స్ వస్తే.. మనం కూడా ఒకసారి టీవీలో కనిపిస్తే.. ఇంకెంత రెస్పాన్స్ వస్తుందో కదా అని.. అప్పుడు కలిగింది నాకు. దాంతో అభి అన్న నంబర్ ఉంది కాబట్టి అభి అన్నకి రోజు మెసేజ్ పెట్టేవాడ్ని. అన్నా మీ స్కిట్‌లో ఏదైనా చూడండి అన్నా.. మీ స్కిట్ సూపర్ అన్నా.. మీ స్కిట్‌లో నాకు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అన్నా.. ఇలా మెసేజ్‌లు చేసేవాడ్ని. దాంతో అభి అన్న గుర్తు పెట్టుకుని నన్ను ఓ సారి పిలిపించారు. అప్పుడే గారు జబర్దస్త్‌కి గెస్ట్‌గా వచ్చారు. కనిపించాలనే ఆత్రుత కాబట్టి.. అప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే.. సునీల్ గారు ఎక్కిన రిక్షాని లాక్కొచ్చి వెళ్లిపోవడమే. ఆ ఒక్కటి చేసే నేను మళ్లీ ఫేస్ బుక్‌లో పెట్టేశాను. సునీల్ గారితో యాక్ట్ చేశాను.. మాములుగా ఉండదు. సూపర్.. బంపర్ అని ఫేస్ బుక్‌లో పెట్టేశా. అందరూ టీవీల ముందు కూర్చున్నారు. అయితే ఇలా వచ్చి చూసేలోపే ఏడి వీడు అని వెతుక్కునేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. పాస్‌లో పెట్టి చూస్తేనే కానీ అది నేనని తెలియదు ఎవరికీ.. అలాంటి క్యారెక్టర్ చేసి.. హడావుడి చేశాను. ఫస్ట్ పెట్టినదానికి లైక్స్ బాగా ఎక్కువచ్చాయి.. అది టెలికాస్ట్ అయ్యాక కింద కామెంట్స్ అంతకంటే ఎక్కువ వచ్చాయి. ‘ఏం చేశావురా నువ్వు? ఎందుకు పెట్టావ్ రా ఫోటో? సునీల్ గారితో చేశానంటే నువ్వేదో ఆయన మీద కౌంటర్ వేసి.. ఆయన నీ మీద కౌంటర్ వేసి.. ఇంత హడావుడి ఉంటుందనుకుంటే.. నువ్వు రిక్షా లాక్కొచ్చావ్.. అది కూడా ఆపి చేస్తే కానీ కనిపించట్లేదు..’ ఇలా కామెంట్స్ వచ్చాయి. దాంతో ‘హో.. కనబడితే కాదు ఏదొకటి చెయ్యాలి మనం..’ అనే ఇంట్రెస్ట్ అప్పుడొచ్చింది. తర్వాత తర్వాత అభి అన్న స్కిట్‌లో చేస్తూ ఉండగా.. నేనే స్కిట్స్ రాయాల్సి రావడం, అవి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లకి ఎక్కువ నచ్చేసి వాళ్లు నా మీద ఫోకస్ చెయ్యడం, నన్ను టీమ్ లీడర్‌ని చెయ్యడం.. అంతా జరిగింది. తర్వాత నా అచీవ్‌మెంట్ ఏంటంటే.. ఎప్పుడైతే నేను సునీల్ గారిని రిక్షాలో లాక్కొచ్చానో.. అదే సునీల్ గారు నేను టీమ్ లీడర్‌గా చేసిన స్కిట్‌లో ఆయన కూడా నాతో పాటు చేసి.. నేను ఆయన మీద పంచ్‌లు వేసి అంత.. అలా వచ్చాననిమాట. అది నిజంగా ప్రౌడ్ ఫీలింగ్’ అంటూ చెప్పుకొచ్చారు హైపర్ ఆది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fVPKo2

'Residential, hospitality are best-performing sectors'

'The overall market cycle is very positive.' from rediff Top Interviews https://ift.tt/iTjSyPd