Wednesday, 24 June 2020

సర్కారు వారి పాట: మహేష్ బాబును ఢీ కొట్టబోయే విలన్ ఆయనే..! ఇదే ఫైనల్..

''మహర్షి, సరిలేరు నీకెవ్వరు'' లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ల తర్వాత సూపర్ స్టార్ నటించనున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ లుక్ రిలీజ్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయిన చిత్రయూనిట్.. నటీనటుల ఎంపిక విషయమై స్పెషల్ కేర్ తీసుకుంటోందట. ఇటీవలే మహేష్ సరసన నటించే హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసిన డైరెక్టర్.. ఇక విలన్ రోల్ కోసం పవర్‌ఫుల్ యాక్టర్‌ని వెతికేపనిలో పడ్డారు. మహేష్ బాబును ఢీ కొట్టే పాత్ర సినిమాలో కీలక భూమిక పోషించనుంది తెలుస్తోంది. ఈ క్రమంలోనే విలన్ రోల్ కోసం ముందుగా ఉపేంద్ర, సుదీప్ లాంటి నటులను పరిశీలించిన పరశురామ్.. ఫైనల్‌గా అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అరవింద్ స్వామితో సంప్రదింపుల కార్యక్రమం నడుస్తోందని సమాచారం. Also Read: గతంలో తెలుగు తెరపై రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన 'ధృవ' విలన్ రోల్ చేసి మెప్పించారు అరవింద్ స్వామి. ఆ పాత్ర తీరుతన్నెలు పరిశీలించిన తర్వాతే పరశురామ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇకపోతే 'సర్కారు వారి పాట' స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. వీటి ప్రకారం బ్యాంకింగ్ రంగంలో కుంభకోణం నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాల సంయుక్త సమర్పణలో నవీన్‌ యర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఈ మూవీపై మహేష్ అభిమానులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2B7pt7j

No comments:

Post a Comment

'Women In Paatal Lok Rarely Cry'

'No woman is stronger than one who acknowledges her vulnerabilities.' from rediff Top Interviews https://ift.tt/nduI8wb