Monday, 29 June 2020

అయ్యో! పాపం.. తాప్సి పన్నుకి కరెంట్ షాక్!! హీరోయిన్ దిమ్మతిరిగిందట..

ప్రస్తుత పరిస్థితుల్లో జనాలను కరోనా మహమ్మారి కాటేస్తుంటే.. కరెంటు బిల్లులు షాకిస్తున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. వేలల్లో, లక్షల్లో కరెంట్ బిల్లులు రావడం చూసి షాక్ అవుతున్నారంతా. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరి నడ్డి విరుస్తున్నాయి విద్యుత్ సంస్థలు. దీంతో అందరు కూడా విద్యుత్ బోర్డుపై ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. ఈ నేసథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తమకొచ్చిన కరెంటు బిల్లులను సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపిస్తూ విద్యుత్ బోర్డులపై దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. తాజాగా తాప్సికి కూడా ఇది తప్పలేదు. ఆమె నివాసముంటున్న ఇంటికి జూన్ నెలకు గాను 36 వేల రూపాయల కరెంట్ బిల్ రావడంతో షాక్ అయిందట . దీంతో ఈ విషయాన్ని వెంటనే ఆమె విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. Also Read: తనకు ఏప్రిల్ నెలలో 4390, మే నెలలో 3850 రూపాయలు వచ్చిన విద్యుత్ బిల్లు.. జూన్ వచ్చేసరికి ఒక్కసారిగా పెరిగిపోయి 36 వేలు రావడమేంటని ఆమె ప్రశ్నించింది. ఇంతటి పిచ్చి పెరుగుదల గతంలో ఎన్నడూ చూడనేలేదని బోర్డ్ వాళ్లకు ఫిర్యాదు చేసింది. తన అపార్ట్‌మెంట్ ఖాళీగా ఉందని, ఖాళీగా ఉన్నదానికే అంత బిల్లు వస్తే, అందులో ఉండి ఉంటే ఇంకెంత బిల్లు వచ్చేదో అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇది చూసి సంబంధిత ఎలక్ట్రిసిటీ బోర్డ్ సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు వివరణ ఇచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VsCL5a

No comments:

Post a Comment

'Partition Should Never Have Happened'

'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...