Sunday, 28 June 2020

అద్దె కట్టకుండా వేధింపులు.. సినీ నిర్మాతపై ఫిర్యాదు

సినీ నిర్మాతపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇంటి అద్దె చెల్లించకుండా దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారంటూ సినీ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో నివాసం ఉంటున్న నవ్వాడ శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. 2018లో మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా తమ భవనాన్ని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌కు అద్దెకు ఇచ్చామన్నారు. తెలంగాణ ఫిలిం కల్చరల్‌ సెంటర్‌(టీఎఫ్‌సీసీ) ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చినట్లుగా శోభారాణి తెలిపారు. నెలకు నాలుగున్నర లక్షల అద్దెగా అంగీకరించారని రూ. 40 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తామని చెప్పి రూ.30 లక్షలే ఇచ్చారని ఆమె ఆరోపించారు. అయితే అప్పటి నుంచి అద్దె సరిగ్గా ఇవ్వకుండా వేదింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా పది రోజుల క్రితం తాను అద్దె చెల్లించలేనంటూ తాళాలు అప్పగించి వెళ్లిపోయిన ప్రతాని రామకృష్ణగౌడ్‌ తన కొడుకు సందీప్‌ను ఇంటి మీదికి పంపించి దౌర్జన్యానికి దిగాడని శోభరాణి ఆరోపిస్తున్నారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించడంతో పాటు తనకు ప్రభుత్వంలో పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారని తమ వద్దకు వస్తే అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YHvUXz

No comments:

Post a Comment

'Partition Should Never Have Happened'

'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...