Monday, 29 June 2020

Jr.Ntr: బెదిరింపులు ఆపండి.. తారక్ గతం గురించి తెలిస్తే..! హీరోయిన్ పాయల్ ఘోష్

చిత్రసీమలో నెపోటిజం (బంధు ప్రీతి) అనే అంశంపై గత కొన్నేళ్లుగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే డిప్రెషన్‌తో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటంతో నెపోటిజంపై ఆగ్రహ జ్వాలలు రగులిపోతున్నాయి. పలువురు నటీనటులు ఈ అంశంపై నోరువిప్పి చిత్రసీమలో జరుగుతున్న వ్యవహారం, సీక్రెట్స్ బయటపెట్టేస్తున్నారు. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఉస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ రంగంలోకి దిగిన పాయల్ ఘోష్‌కి‌ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూడా నెపోటిజం ప్రొడక్టే అంటూ ఆమెను ట్యాగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో అదే సోషల్ మీడియా ద్వారా మరోసారి రియాక్ట్ అయిన పాయల్.. ఎన్టీఆర్‌కి తానెందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పేర్కొంటూ, తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. Also Read: సినిమా కోసం తారక్ పడే కష్టం ఏంటనేది ఎవ్వరికీ తెలియదని పాయల్ తన ట్వీట్‌లో తెలిపింది. తారక్ గతం గురించి తెలుసుకున్నాక తనకు కన్నీళ్లు ఆగలేదని, ఏడ్చేశానని పేర్కొంది. అతని పట్ల జాలి చూపించాలని కోరింది. ఇకపోతే ఇకనైనా బెదిరింపులు ఆపాలని కోరిన పాయం ఘోష్.. ఆ బెదిరింపుల కారణంగా డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించానని చెప్పింది. తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైన .. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో నటించింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో సరైన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. తాజాగా ఇలా ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ ఆమె కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3g7IeGw

No comments:

Post a Comment

'Partition Should Never Have Happened'

'We wouldn't have had to face all this had our national leaders taken care to select a place for Sindhis and sent us there, instead ...