Friday 26 June 2020

Green India Challenge: ఉదయభాను సవాల్ స్వీకరించిన బ్రహ్మానందం

పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తోంది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం ప్రసాదించడమే లక్ష్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. “పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్‌లో ప్రముఖ హాస్యనటులు భాగమయ్యారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ .. బ్రహ్మానందాన్ని నామినేట్ చేసింది. దీంతో ఈ ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మానందం మణికొండ లోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను కేటీఆర్‌, కవిత, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, ప్రభాస్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి లాంటి ఎందరో సెలబ్రిటీలు స్వీకరించి పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యారు. వీళ్లందరినీ ఆదర్శంగా తీసుకొని సాధారణ ప్రజలు సైతం మొక్కలు నాటుతూ హరితహారంలో పాలు పంచుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Vnag94

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz