Saturday, 27 June 2020

బ్రేకింగ్ న్యూస్: పవర్ స్టార్ పేరుతో రామ్ గోపాల్ వర్మ మూవీ

వరుసగా సినిమాలు తీస్తూ... ట్రైలర్లు, పోస్టర్లు రిలీజ్ చేస్తూ బిజీగా మారారు. ఒక దాని తర్వాత ఒకటి వరుస సినిమాలను తీస్తూ వర్మ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పరిటాల రవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల నిజ జీవితాలపై సినిమా తీసిన వర్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తానంటూ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. మారుతి రాసిన అమృతప్రణయ గాథ అంటూ ఆయన ప్రస్తుతం నిజజీవిత కథ ఆధారంగా 'మర్డర్'‌ సినిమాను కూడా తీస్తున్నారు. అయితే తాజాగా వర్మ దృష్టి ఇప్పుడు పవర్ స్టార్‌పై పడింది. 'బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్‌ స్టార్‌ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను' అంటూ ప్రకటన చేశారు. వర్మ తాజాగా చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వర్మ ఇచ్చిన క్లూస్‌తో ఈ సినిమాలో ఎవరెవరు ఉంటున్నారన్న దానికి ట్వీట్లతో బదులు ఇస్తున్నారు పీకే అంటే అని తెలిసిందే. ఇక ఎమ్మెస్ అంటే మెగాస్టార్, ఎన్బీ అంటే నాగబాబు, టీఎస్ త్రివక్రమ్ అని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నా లెజ్ నోవా రష్యన్ మోడల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పవన్‌కు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఇద్దరు పిల్లలు కాగా, ప్రస్తుతం ఉన్న భార్యకు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక పవన్ అప్పుడప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. తన ఫాం హౌస్‌లో ఆ పనులు చేస్తుంటారు. మొత్తం మీద పవన్ కళ్యాన్ మొత్తం జీవితం ఆధారంగా వర్మ ఈ బయోపిక్ తీస్తున్నట్లు తెలుస్తొంది. అయితే వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2A8iFWq

No comments:

Post a Comment

'Rajinikant Never Jokes About His Superstardom'

'I believe that whether it is Rajini sir or Shah Rukh Khan or Dilip Kumarsaab, these stars are blessed with a cosmic energy. It's a ...