Friday 3 April 2020

Chiranjeevi: థాంక్యూ బ్రదర్.. బాలయ్య భారీ విరాళంపై చిరు స్పందన

కరోనా కష్టంతో అల్లాడుతున్న ప్రజలకు సాయంగా నిలుస్తూ రూ. కోటీ పాతిక లక్షల భారీ సాయం ప్రకటించిన నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందలు తెలియజేశారు మెగాస్టార్ . ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్. థాంక్యూ మై డియర్ బ్రదర్ బాలయ్య.. ప్రతి కష్టసమయంలోనూ ప్రజలను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు. కరోనా క్రైసిస్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)కి రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిరు. ఈ సందర్బంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)కి అందించిన రూ. 25 లక్షల చెక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు చిరంజీవి. ఈ చెక్‌పై కరోనా క్రైసిస్ ఛారిటీతో పాటు చిరంజీవి ఛారిటిబుల్ ట్రస్ట్ అని కూడా రాసి ఉండటం విశేషం. కాగా బాలయ్య చేసిన సాయానికి ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. పెట్టినా కొట్టినా మా బాలయ్యే అందుకే మా బాలయ్య మనసు బంగారం.. ఎంత మంది ఎన్ని హేళనలు చేసి సాయం చేయడంలో బాలయ్య మనసు పెద్దదే అని మరోసారి నిరూపించారు.. జై బాలయ్య అంటూ ట్విట్టర్‌ని హీటెక్కిస్తున్నారు బాలయ్య, చిరు అభిమానులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dL0h57

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...