Saturday, 4 April 2020

దీపం వెలిగిద్దాం.. ఐక్యత చాటుదాం: చిరు విత్ చెర్రీ వీడియో సందేశం

కరోనా వైరస్ నిర్మాలనలో భాగంగా దేశ ప్రజలందర్నీ ఐక్యం చేస్తూ ఈ మహమ్మారిని అంతం చేసేందుకు తమది ఒకటే మాట.. ఒకే బాట అనే ఉద్దేశంతో దేశ ప్రధాని మోడీ మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆర్పేసి.. వీధిలో దీపం వెలిగించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని దీపాలు వెలిగించే కార్యక్రమంపై పలు విమర్శలు వస్తున్నా.. ప్రధాని పిలుపుకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా హీరో రామ్ చరణ్ మన ఐక్యతను చాటుకునేందుకు ఇదే మంచి సమయం అంటూ ప్రధాని పిలుపుకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ‘ అందరికీ నమస్కారం.. రేపు (ఆదివారం) రాత్రి 9 గంటలకి మన ఇళ్లల్లో అన్ని లైట్స్ ఆర్పేసి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగిద్దాం. ప్రధానమంత్రిగారి మాటను గౌరవిద్దాం.. కరోనా లేని భారతదేశాన్ని తప్పకుండా సాధిద్దాం’ అంటూ వీడియో సందేశం ద్వారా ట్వీట్ చేశారు రామ్ చరణ్. ఇక లాక్ డౌన్‌ని పాటిస్తున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్. ‘నేను చాలా గర్వపడుతున్నాను కరోనా వ్యాప్తిని అరికట్టడంతో ప్రధాని నిర్ణయానికి లోబడి అందరూ లాక్ డౌన్‌‌‌ను పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే స్పూర్తితో రేపు దీపాలు వెలిగిద్దాం.. దయచేసి మరిచిపోవద్దు’ అంటూ పిలుపునిచ్చారు రామ్ చరణ్. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రధాని పిలుపుకు మద్దతు తెలుపుతూ.. ‘మానవత్వాన్ని కాపాడటానికి మనమంతా ఒక్కటే అన్న యునైటెడ్ సందేశాన్ని దీపాలను వెలిగించడం ద్వారా ఇద్దాం.. కరోనా చీకట్లను తరిమేద్దాం.. మన ఐక్యమత్యాన్ని ప్రపంచ దేశాలకు చూపిద్దాం.. రండి ప్రధాని పిలుపుకు స్పందించండి.. కోరోనాను అంతమొందించండి. అందరూ ఒక్కటై వెలుగులు నింపండి అంటూ వీడియో సందేశం ఇస్తూ మద్దతు ప్రకటించారు చిరంజీవి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dYgWlU

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....