Thursday, 23 April 2020

న్యూస్ యాంకర్‌గా అనసూయ... 11ఏళ్ల క్రితం ఫోటో షేర్ చేసిన జబర్దస్త్ బ్యూటీ

తెలుగు ప్రేక్షకులుకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఇప్పుడు సినిమాల్లో సైతం అవకాశాలు కొట్టేస్తోంది. జబర్దస్త్ ఖతర్నాక్ షోతో టాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసింది. అయితే తాజాగా అనసూయ 11 ఏళ్ల నాటి యాంకర్‌గా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. ఈ ఫోటో చూసి మీరంతా షాక్‌ అవుతారని కూడా ట్వీట్ చేసింది. 2009లో తాను చేసిన ఫస్ట్ టీవీ షో ఆన్ ఎయిర్ (ప్రసారం) అయినప్పటి ఫోటో అంటూ అనసూయ పేర్కొంది. ఈ ట్వీట్‌కు నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూన్నారు. ఒల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ కొందరు చెబుతుంటే.. మరికొందరు ఇప్పటికే అలాగే ఉన్నారంటూ ట్వీట్ చేస్తున్నారు. సాక్షి న్యూస్ ఛానల్ యాంకర్‌గా అనసూయ తన కెరియర్ మొదల పెట్టారు. ఆ తర్వాత అనేక రకాల టీవీ షోలు చేశారు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ షో అనసూయ జీవితాన్నే మార్చేసింది. ఆమెకు సినిమా అవకాశాలు దక్కేలా చేసింది. స్టార్ యాంకర్‌గా అనసూయ ఎదిగేందుకు సహాయ పడింది. ఆ తరువాత నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. అదే సంవత్సరం క్షణం సినిమాలో ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించింది. టీవీ యాంకర్‌గా ఆమె అనేక అవార్డులు అందుకొంది. ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా ఉన్న అనసూయ 2008లో ఎంబీయే చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో న్యూస్ యాంకర్‌గా చేరింది. సుశాంక్ భరధ్వాజ‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్‌గా పనిచేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eHoqKd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....