Sunday, 7 November 2021

చెంప దెబ్బ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. నా కారణంగా వివాాదం చేసేవారి ఎజెండా ఏంటోనని ఎదురు ప్రశ్న వేసిన విలక్షణ నటుడు

ప్ర‌కాశ్ రాజ్ తాను నటించిన సన్నివేశంపై రేగుతున్న దుమారంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలేం జరిగింది. ప్రకాశ్‌రాజ్‌ను త‌ప్పు ప‌డుతుందెవ‌రు? అనే వివ‌రాల్లోకి వెళితే.. సూర్య హీరోగా జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘జై భీమ్‌’. రీసెంట్‌గా డైరెక్ట్ ఓటీటీలో ఈ సినిమా విడుద‌లైంది. సామాజిక అస‌మాన‌త‌ల‌పై రూపొందిన ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఓ కేసుకు సంబంధించిన విచార‌ణ స‌మ‌యంలో ప్ర‌కాశ్ రాజ్ పాత్ర‌లో ఓ సేఠ్‌ను లాగి పెట్టి కొడ‌తాడు. ఎందుకంటే అత‌ని వ‌ల్ల ఓ క్రైమ్ జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు ఇదే సీన్‌ను బేస్ చేసుకుని కొంద‌రు కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. హిందీ మాట్లాడే సేఠ్‌ను ప్ర‌కాశ్‌రాజ్ కొట్టాడంటే.. హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని బ‌ల‌వంతంగా రుద్ద‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌ని, దానికి వ్య‌తిరేకంగానే ప్ర‌కాశ్ రాజ్ పాత్ర‌తో ఆ సీన్ పెట్టించ‌రనేది కాంట్ర‌వ‌ర్సీగా మారింది. అయితే తాను న‌టించిన స‌ద‌రు స‌న్నివేశంపై ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ‘‘‘ సినిమాలో సామాజిక అసమానతలను, అణగారిన వర్గాల ఇబ్బందులను చూపించే ప్ర‌య‌త్నం చేశారు. సినిమాలో అస‌లు విష‌యాన్ని వ‌దిలేసి చెంప‌దెబ్బ కొట్టే స‌న్నివేశంపై మాట్లాడే వ్య‌క్తుల ఎజెండా ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. నేను న‌టించాన‌నే కార‌ణంతో ఈ సినిమాను వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి వివాదాల‌పై స్పందించ‌డం అర్థం లేదు’’ అన్నారు ప్ర‌కాశ్ రాజ్‌. రాజకీయంగా బీజేపీ పార్టీని ప్ర‌కాశ్ రాజ్ వ్య‌తిరేకిస్తుండ‌టంతో ఈ వివాదం చేస్తున్నార‌ని ప్ర‌కాశ్ రాజ్ స‌పోర్ట‌ర్స్ అంటున్నారు. మ‌రి ఈ వివాదం ఆగుతుందో కొన‌సాగుతుంతో తెలియ‌డం లేదు. ‘జై భీమ్’ సామాజిక అసమానతలపై పోరాటం చేసే లాయర్ పాత్రలో సూర్య నటించారు. లాయ‌ర్ చంద్రు అనే రియ‌ల్ పాత్ర‌ను ఆధారంగా చేసుకుని ఈ క‌థ‌ను జ్ఞాన‌వేల్ రాసుకున్నారు. లాయ‌ర్ పాత్ర‌కు సాయం చేస్తూ విచార‌ణ‌ను నిజాయ‌తీగా ముందు తీసుకెళ్లే పోలీస్ ఆఫీస‌ర్ పెరుమాల్‌గా ప్ర‌కాశ్ రాజ్ న‌టించారు. సినిమా ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. సూర్య న‌ట‌నను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. సూర్య ఈ సినిమాలో నటించడమే కాకుండా తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై భార్య జ్యోతికతో కలిసి సినిమాను నిర్మించడం విశేషం. అలాగే ఈ సినిమాలో సినిమాకెంతో కీలమైన సినతల్లి పాత్రలో మలయాళ నటి లిజో మోల్ జోస్ నటించారు. తమిళనాడు కడలూరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్‌పై లాయర్ చంద్రు పోరాడి, గిరిజనులకు ఎలా న్యాయం చేశారనేదే ప్రధాన కథాంశం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o4GkfB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....