Monday, 29 November 2021

Pawan Kalyan : భీమ్లా నాయ‌క్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు.. ర‌చ్చ చేస్తున్న ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. సితార ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌లు అందించ‌డంతో లాలా భీమ్లా.. అనే సాంగ్‌ను కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ‘భీమ్లా నాయ‌క్‌’ నుంచి మూడు పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు నాలుగో పాట‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘అడవి త‌ల్లి మాట‌...’ అంటూ సాగే నాలుగో లిరికల్ సాంగ్‌ను బుధ‌వారం అంటే డిసెంబ‌ర్ 1 ఉద‌యం 10 గంట‌ల 08 నిమిషాల‌కు విడుద‌ల‌వుతుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీక్ష‌ణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నారు. అత‌నిలో అడవి క‌నిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా మేక‌ర్స్ మ‌రోసారి సినిమాను జ‌న‌వ‌రి 12నే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఇందులో భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్, డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నారు. వీరి క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించిన టీజ‌ర్స్‌, భీమ్లానాయ‌క్ టైటిల్ సాంగ్‌తో పాటు లాలా భీమ్లా, అంత ఇష్ట‌మేంద‌యా.. పాట‌ల‌కు చాలా మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. మ‌రి రేపు నాలుగో సాంగ్ ఎలా ఉండ‌బోతుంద‌ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సాగే పాట అని పోస్ట‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న నిత్యామీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రానా స‌ర‌స‌న సంయుక్తా మీన‌న్ జోడీ క‌డుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్‌డేట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు సోష‌ల్ మీడియాలో మ‌రోసారి భీమ్లా నాయ‌క్‌ను ట్రెండింగ్ చేయ‌డంలో బిజీగా మారిపోయారు. పోలీస్ ఆఫీస‌ర్‌, రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌కు మ‌ధ్య వ‌చ్చిన ఇగో గొడ‌వ‌లు ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే భీమ్లా నాయ‌క్ క‌థ‌. తెలుగు నెటివిటీ తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ప్రముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను అందించారు. మ‌రోవైపు వ‌ప‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాతో పాటు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సింది ఉంది. మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o6l75X

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...