Sunday, 7 March 2021

నిఖిల్ ‘కార్తికేయ 2’.. కీలకపాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు

నిఖిల్ సిద్ధార్థ కెరీర్‌లో ‘కార్తికేయ’ మూవీ ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమా నుంచి నిఖిల్ ఇమేజ్ మరింత పెరిగింది. యానిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు చందు మొండేటికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విడుదలైన సుమారు ఏడేళ్ల తరవాత ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. దర్శకుడు చందు మొండేటి మనకు పరిచయం లేని మరో కొత్త విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నారు. గతేడాది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ‘కార్తికేయ 2’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ముహూర్తపు సన్నివేశాన్ని తిరుమలలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ పొడ‌క్షన్ త‌దిత‌ర కార్యక్రమాలు ప‌క్కగా పూర్తి చేసుకుని త్వర‌లోనే సెట్స్ మీద‌కి వెళ్లడానికి సిద్ధమైన‌ట్లు ద‌ర్శకుడు చందు మొండేటి తెలిపారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కార్తికేయ’ సినిమాకు మించి భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థలు ఆదివారం ప్రకటించాయి. ఆదివారం (మార్చి 7న) అనుపమ్ ఖేర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ‘కార్తికేయ 2’లో నటిస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. తమ సినిమాలోకి అనుపమ్ ఖేర్‌ను ఆహ్వానిస్తూ వీడియో విడుదల చేశారు. ఈయన పాత్ర చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు దర్శకుడు చందు మొండేటి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. కాగా, ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం చందు మెుండేటి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OyeppX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....