Wednesday 2 October 2019

Sye Raa: చిరంజీవి జీవించారు.. ‘సైరా’కు రాజమౌళి ప్రశంస

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. ట్విట్టర్‌లో అయితే ఈరోజు ‘సైరా’దే హవా. మొత్తం మీద రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా భావించిన నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం. ఇదిలా ఉంటే, ‘సైరా’ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. చిరంజీవినైతే ఆకాశానికి ఎత్తేశారు. ‘‘శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి పరకాయ ప్రవేశం చేశారు. చరిత్రలో కనుమరుగైన నిప్పులాంటి కథను ఆయన వెలికితీశారు. జగపతిబాబు గారు. కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా ప్రతి పాత్ర కథలో భాగంగా రావడమే కాకుండా పరస్పరం ముడిపడి ఉన్నాయి’’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంత గొప్ప సినిమాను నిర్మించిన రామ్ చరణ్‌కు, దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డికి రాజమౌళి అభినందనలు తెలిపారు. ఇంత పెద్ద విజయానికి వీరిద్దరూ అర్హులంటూ పేర్కొన్నారు. రాజమౌళి ప్రశంసలతో చిత్ర యూనిట్‌తో పాటు మెగా అభిమానులకు కొత్త ఉత్సాహం వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వారా రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా, రాజమౌళి ‘బాహుబలి’ తీయకపోయి ఉండుంటే ‘సైరా’ ప్రాజెక్ట్ అసలు పట్టాలెక్కేదే కాదని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తెలిపారు. ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల సాక్షిగా రాజమౌళిపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమాకు ఒక మార్గం చూపించారని, ఆ ధైర్యంతోనే ‘సైరా’ సినిమాను నిర్మించామని చిరంజీవి చెప్పారు. రాజమౌళికి సభావేదికగా హ్యాట్సాఫ్ కూడా చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2pcjTdp

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...