Sunday, 27 October 2019

మంచు మనోజ్ కొత్త జర్నీ.. దీపావళి రోజున సంచలన ప్రకటన

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడిగా చిత్ర సీమకు పరిచయమైన మంచు మనోజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. కమర్షియల్ హీరోగా మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకోలేనప్పటికీ టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అయితే, ఈ మధ్య మనోజ్ బాగా వెనకబడిపోయారు. గడిచిన ఐదేళ్లలో మనోజ్ నుంచి ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. 2014లో వచ్చిన ‘కరెంట్ తీగ’ ఒక్కటే ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన చిత్రం. రెండేళ్ల క్రితం ‘ఒక్కడు మిగిలాడు’ అనే విరుద్ధమైన చిత్రంతో మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ పాత్రను ఈ సినిమాలో మనోజ్ పోషించారు. దీంతో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. కానీ, సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ సినిమా తరవాత మనోజ్ మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. మనోజ్ నుంచి తరవాత సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూశారు. కానీ, ఇటీవల ఆయన నుంచి ఒక షాకింగ్ నిర్ణయం వినాల్సి వచ్చింది. భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా మనోజ్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. తమ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని.. అందుకనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే, ఇప్పుడు దీపావళి సందర్భంగా మరో కొత్త ప్రకటన చేశారు మనోజ్. సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించారు. ‘ఎంఎం ఆర్ట్స్’ పేరిట ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు ట్వీట్ చేశారు. ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌ కింద తన కొత్త సినిమా పనులు ప్రారంభమయ్యానని చెప్పారు. అంతేకాకుండా కొత్త టాలెంట్స్‌ను బయటికి తీసుకొస్తానని, భవిష్యత్తులో గొప్ప సినిమాలు అందించడానికి చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని పేర్కొన్నారు. దీపావళి రోజున కొత్త జర్నీని మొదలుపెట్టిన తనకు ప్రేక్షకుల ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని మనోజ్ కోరారు. మరి మనోజ్ సొంత బ్యానర్‌లో మొదటి సినిమా తానే హీరోగా చేస్తారో.. లేకపోతే కొత్త వాళ్లతో ఏమైనా ప్రయత్నిస్తారో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NgIPZH

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...