Wednesday 30 October 2019

రెమ్యునరేషన్ పెంచేసిన బాలకృష్ణ.. స్పందించిన నిర్మాత

నటిసింహా నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేశారని, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రూలర్’ సినిమాకు భారీగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గతేడాది వచ్చిన ‘జైసింహా’ సినిమాకు రూ.6 కోట్లు తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘రూలర్’ సినిమాకు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణే నిర్మాత. దీంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేయడంతో బడ్జెన్‌ను సరిచేసుకోవడానికి మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవారికి సి.కళ్యాణ్ కోత విధిస్తున్నారని కూడా రూమర్ వచ్చింది. Also Read: అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. బాలయ్య పారితోషికం కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టే మనిషి కాదని కళ్యాణ్ అన్నారు. ‘‘బాలకృష్ణతో గతంలో పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే వార్తల్లో నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి అసలు చర్చే జరగలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది’’ అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. Also Read: కాగా, ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తు్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన పోలీస్ అధికారి లుక్ అయితే అభిమానులను కట్టి పడేసింది. బాలయ్య కాస్త బరువు తగ్గి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌లా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/332JNiW

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz