Wednesday 2 October 2019

కొత్త దర్శకుడిని పరిచయం చేస్తోన్న శ్రీవిష్ణు

‘బ్రోచేవారెవరురా’ సినిమాతో హిట్ అందుకున్న హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరో. హాసిత్ గోలి దర్శకత్వం వహించనున్నారు. శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన, దర్శకత్వ టీమ్‌లో ప్రతిభ కనబరచిన హాసిత్ గోలిని ఈ చిత్రం ద్వారా దర్శకుని గాపరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి. Also Read: ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ సినిమాలో నటిస్తున్నారు. కిందటి నెలలో వచ్చిన టీజర్, ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ నిర్మాత. ఖుషి, అచ్యుత్ రామారావు సహనిర్మాతలు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2mPvn5M

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...