మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నెక్ట్స్ మూవీ షూటింగ్కి రెడీ అవుతున్నారు. నిజానికి ఆయన ఎప్పుడో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ.. ఆ మధ్య బైక్ యాక్సిడెంట్ కావడం వల్ల సాయిధరమ్ తేజ్ హాస్పిటల్కే పరిమితం అయ్యారు. అసలు చాలా రోజుల వరకు బయటకు రాలేదు. రీసెంట్గా దీపావళి పండుగ రోజునే సాయిధరమ్ తేజ్ మెగా మావయ్యలను కలుసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. మరి కొన్నిరోజులు డాక్టర్స్ సాయిధరమ్ తేజ్ను రెస్ట్ తీసుకోమని సూచించడంతో ఆయన ఇంటికే పరిమితం కానున్నారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సుకుమార్ తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో పాటు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బివిఎస్ఎన్ ప్రసాద్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాతకాలు, శక్తి చక్రాలు అంటూ సాగే మూవీ కావచ్చునని సినిమా కాన్సెప్ట్ పోస్టర్ను చూస్తే అర్థమవుతుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ సాయిధరమ్ తేజ్ సరసన నటించనుందట. ప్రస్తుతం ఈ అమ్మడు భీమ్లానాయక్ చిత్రంలో నటిస్తుంది. పవర్స్టార్ పవన్కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో రానా జోడీగా సంయుక్తా మీనన్ కనిపించనుంది. ఈ బ్యూటీ తొలి సినిమానే భీమ్లా నాయక్. తొలి సినిమా విడుదల కాకముందే సాయిధరమ్ తేజ్ సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మరి భవిష్యత్తులో హీరోయిన్గా ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. రీసెంట్గా రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయితేజ్ కలెక్టర్గా కనిపించారు. సాయిధరమ్ తేజ్.. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ సినిమా థియేటర్స్లో విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మూవీ పూర్తి చేసిన తర్వాత సాయిధరమ్ తదుపరి సినిమా ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే మెగా మేనల్లుడు మాత్రం కథలను వినడంలో బిజీగా ఉన్నారు. ఏమాత్రం మంచి కథ అనిపిస్తే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనేదే తన ఆలోచనగా కనిపిస్తుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ERftue
No comments:
Post a Comment