సినీహీరో సాయధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ని మాదాపూర్లో మెడికోర్ హాస్పటల్కి తరలించారు. కాగా ఈ ప్రమాద వివరాలను తెలియజేశారు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ బైక్పై హైటెక్ సిటీ దుర్గం చెర్వు ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్క నుంచి ఐకియా మీదుగా వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయ్యి కిందపడిపోయారు. దీంతో ఆయన గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. రైట్ ఐబ్రోపైన.. రైట్ సైడ్ చెస్ట్పై గాయాలు అయ్యాయి. వేగంగా వెళ్లి కిందపడటం వల్ల ఆయన షాక్లోకి వెళ్లారు. వెంటనే ఆయన్ని మాదాపూర్లో మెడికోర్ హాస్పటల్కి తీసుకుని వెళ్లారు.. సిటీ స్కాన్ కూడా తీశారు.. ఆయనంతట ఆయనే పడినట్టుగా ప్రాధమిక దర్యాప్తులో తెలిసింది. బైక్ పై వెళ్తూ రైట్ సైడ్కి పడటం వల్ల సాయి ధరమ్ తేజ్కి రైట్ సైట్లో గాయాలయ్యాయి. మెడికోర్ హాస్పటల్ డాక్టర్లతో మాట్లాడాము.. ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది.. శరీరంపై బలమైన గాయం ఒక్కటే ఉంది.. మిగతా చోట్ల పెద్దగా గాయలేం లేవు. అసలు ఏమైంది?? ప్రమాదానికి వేగమే కారణమా? అన్నది సీసీ టీవీ ఫుటేజ్ చేస్తున్నాం’ అని ప్రమాద వివరాలను తెలియజేశారు డీసీపీ వెంకటేశ్వర్లు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3txNDP9
No comments:
Post a Comment