మెగా కుటుంబానికి చెందిన యువ కథానాయకుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్కు యాక్సిడెంట్ అయ్యింది. ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదం పెద్దగానే జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈరోజు పండగ కావడంతో పెద్దగా ట్రాఫిక్ లేదు. వెనుక నుంచి పెద్ద వాహనాలేవీ రాకపోవడంతో సాయితేజ్కు పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీసులు అంటున్నారు. చుట్టు పక్కలవాళ్లు త్వరగా స్పందించంతో సాయితేజ్ను వెంటనే మెడికేర్ హాస్పిటల్లకు తరలించారు. షాక్కు గురవడంతో సాయితేజ్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. 180 కిలోమీటర్స్ వేగంతో స్పోర్ట్స్ బైక్పై వేగంతో జూబ్లీ హిల్స్ రోడ్డు నెం.45 నుంచి కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో వెళుతున్నప్పుడు బ్రిడ్జ్ దిగగానే అక్కడే బైక్ స్కిడ్ అయ్యింది. సాయితేజ్కు ఇంటర్నెల్గా ఏమైనా గాయాలైయ్యాయా అని డాక్టర్స్ స్కానింగ్ ద్వారా చెక్చేస్తున్నారు. కుడికన్ను, ఛాతీ, పొట్టభాగంలో గాయాలైనట్లు బయటకు తెలుస్తున్నాయి. పోలీసులు సాయితేజ్కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సాయితేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ సినిమా అక్టోబర్ 1న విడుదలకు సన్నద్ధమవుతుంది. రిపబ్లిక్ సినిమాలో సాయితేజ్, కలెక్టర్ పాత్రలో నటించారు. దేవ్ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీజర్, పాటలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jWd3Tj
No comments:
Post a Comment