Friday 10 September 2021

Pawan Kalyan: ఆందోళన వద్దు సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు: చిరంజీవి, పవన్ కళ్యాణ్

సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్ మీదుగా వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయ్యి కిందపడిపోయారు. దీంతో సాయి ధరమ్ తేజ్‌కి తీవ్ర గాయాలు కావడంతో మాదాపూర్‌లోని మెడికోర్ హాస్పటల్‌కి తరలించి వైద్యం అందిస్తున్నారు. కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో సాయితేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కాగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతుండగా.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్పందిస్తూ.. కోలుకుంటున్నాడని.. ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మెగాస్టార్. కాగా ఇప్పటికే పవర్ స్టార్ మెడికోర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్‌, నిహారిక తదితరులు హాస్పటల్ దగ్గరే ఉన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కోరుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38Urh0I

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...