మెగా కుటుంబానికి చెందిన యంగ్ హీరో సాయిధరమ్తేజ్ ఐకియా- కేబుల్ బ్రిడ్జ్పై ప్రయాణిస్తున్న సమయంలో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురయ్యారు. కుడికన్ను, ఛాతీ, కడుపుపై గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్లో మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం చిరంజీవి, పవన్కళ్యాణ్, అల్లు అరవింద్ వంటి వారి విజ్ఞప్తి మేరకు సాయితేజ్ను అపోలో హాస్పిటల్కు తరలించారు. ఇప్పుడు అపోలోలోని ఐసీయూ విభాగంలో సాయితేజ్కు చికిత్స జరగుతుంది. ముగ్గురు డాక్టర్స్ ఆధ్వర్యంలో చికిత్సలు జరుగుతున్నాయి. అపోలో హాస్పిటల్లో కూడా, వైద్యులు స్కానింగ్ సహా అన్నీ చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగబాబు, పవన్కళ్యాణ్, అల్లు అరవింద్, వరుణ్తేజ్, నిహారిక తదితరులు అపోలో హాస్పిటల్కు చేరుకున్నారు. స్కానింగ్ రిపోర్టుల ప్రకారం మెదడు, పుర్రె భాగాలకు ఎలాంటి గాయాలు కాలేదు. పక్కటెముకల నుంచి చేతికి ఉండే ఎముక విరిగినట్లు తెలుస్తుంది. ప్రాణాపాయం లేదని, ప్రస్తుతానికి ఇంకా సాయితేజ్ అపస్మారక స్థితిలోనే ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E6usk9
No comments:
Post a Comment