Friday 10 September 2021

Jr NTR: సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. అపోలోకు చేరుకున్న చెర్రీ.. ఎన్టీఆర్ అలా

మెగా హీరో ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. మితి మీరిన వేగంతో బైకు నడిపిన సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు. అయితే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ పుటేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో అదుపుతప్పడం వల్లే బైక్ మీద నుంచి కిందపడ్డట్టు కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్‌ను ప్రస్తుతం అపోలో హాస్పిటల్‌కు తరలించారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదని వైద్యులు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్‌కు చాతి, కన్ను, భుజాలకు గాయాలయ్యాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్ ఇప్పటికే ప్రకటనలు చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ కూడా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా అపోలో హాస్పిటల్‌కు చేరుకున్నారు. నిన్న రాత్రి మెగా ఫ్యామిలీ, హీరోలు సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, నిహారిక, వరుణ్ తేజ్ ఇలా అందరూ కూడా హాస్పిటల్‌కు వచ్చారు. కాసేపటి క్రితమే తన సతీమణి ఉపాసనతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. మరో వైపు సైతం సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించారు. సోదర త్వరగా కోలుకోవాలని ట్వీట్ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Xbi8hv

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...