శుక్రవారం రాత్రి ఐకియా-కేబుల్ బ్రిడ్జ్ దగ్గర హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైంది. సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో అపోలో హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని, 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచామని అపోలో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శనివారం ఉదయం మరో హెల్త్ బులెటిన్ను విడుదల చేస్తామని వారు తెలిపారు. శనివారం ఉదయం పది గంటలకు సాయిధరమ్ తేజ్కు సంబంధించిన తాజా హెల్త్ బులెటిన్ను వైద్య వర్గాలు విడుదల చేశాయి. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అవయవాలన్నీ పనిచేస్తున్నాయని బులెటిన్లో తెలిపారు. మరో 24 గంటలపాటు ఐసీయూలోనే ఉంచి హాస్పిటల్ వర్గాలు జాగ్రత్తగా పర్యవేక్షణ చేయబోతున్నారు. మరికొన్ని పరీక్షలు నిర్వహించి రేపు మరో హెల్త్ బులెటిన్ను విడుదల చేస్తామని అపోలో హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలియజేయడం అభిమానులు, సినీ వర్గాలకు ఊరట కలిగించే విషయం. ప్రమాదం జరిగినప్పుడు తల వెన్నుముకలకు గాయాలేవీ కాలేదని, కానీ నలబై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచినట్లు నలుగురు డాక్టర్స్ బృందం తెలియజేసిన సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Xemkxy
No comments:
Post a Comment