మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఓ టీవీ ఛానెల్ను కోనుగోలు చేసినట్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది. నిర్మాతగానే సినిమాలు నిర్మించే చెర్రీ... ఫుల్ బిజీగా ఉండే రామ్చరణ్ పలు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ట్రూ జెట్ అనే ఎయిర్లైన్స్తో పాటు హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్లో రామ్చరణ్ పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఓ న్యూస్ ఛానెల్ను కోనుగోలు చేశారట చరణ్. ఇప్పటికే సదరు ఛానెల్తో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు ఛానెల్ పలువురి చేతులు మారింది. అయినా సరైన ఫైనాన్సియల్ సపోర్ట్ లేకుండా ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ వంటి వ్యక్తి చేతుల్లోకి వెళ్లడం అనేది పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఇది కాకుండా, మరో రెండు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్తో కూడా చరణ్ అండ్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ,చెర్రీ సినిమా వ్యక్తి కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కొన్నాడనుకుంటే ఓకే.. కానీ న్యూస్ ఛానెల్ను సొంతం చేసుకున్నాడనేదే డిస్కషన్ పాయింట్గా మారింది. బాబాయ్ పవన్కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్కళ్యాణ్కు ఫ్యాన్ బేస్ ఉన్నా.. దాన్ని సాధారణ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సరైన పత్రిక, టీవీ ఛానెల్ సపోర్ట్ లేదు. తన ఎంతో ప్రేమించే పవన్ బాబాయ్కు తనవంతుగా సపోర్ట్ చేయడానికే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lhqkoS
No comments:
Post a Comment