మెగా హీరో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో మితి మీరిన వేగంతో సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైకుపై వెళ్లారు. వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. ఆ వెంటనే దగ్గర్లోని హాస్పిటల్లో చేర్పించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్లో చేర్పించారు. అయితే హెల్మెట్ ధరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సుప్రీం హీరో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నాడని, అభిమానులెవ్వరూ ఆందోళన చెందవద్దని చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ వంటి వారు చెప్పుకొచ్చారు. ఇక అపోలో వైద్యులు సైతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై బుల్లిటెన్ విడుదల చేశారు. భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటాడని తెలిపారు. మరో వైపు సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం, దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో సాయి ధరమ్ తేజ్ కోసం అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇక మెగా అభిమాని అయిన కూడా ట్వీట్ వేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. దేవుడు నీతోనే ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు.. కోలుకుంటున్నారు.. ఎలాంటి చింత పెట్టుకోకండి.. మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VAlevi
No comments:
Post a Comment