Friday 10 September 2021

సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు చేసిన రాయ‌దుర్గం పోలీసులు..!

మెగా కుటుంబానికి చెందిన హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆదివారం రాత్రి ఎనిమిది గంట‌ల‌కు బైక్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జ్-ఐకియా మార్గంలో వేగంగా వెళుతున్న ఆయ‌న స్పోర్ట్స్ బైక్ జారిడ‌ప‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రాయ‌దుర్గం పోలీసులు ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేశారు. సీసీఫుటేజ్ ఆధారంగా జ‌రిగిన ప్ర‌మాదాన్ని నిర్దారించిన పోలీసులు ఐపీసీ సెక్ష‌న్ 336, 180 ఎంవీ.. నిర్ల‌క్ష్యం, అతివేగం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు కేసు ఫైల్ చేశారు. గత ఏడాది ఆగ‌స్ట్ 2న సాయితేజ్ వేగంగా బైకు న‌డిపాడ‌ని ట్రాఫిక్ పోలీసులు ఓవ‌ర్ స్పీడ్ చ‌లానా కూడా వేశారు. మెగా ఫ్యామిలీ చిరంజీవి, నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, అల్లు అర‌వింద్‌ వ‌రుణ్‌తేజ్‌, నిహారిక‌, వైష్ణ‌వ్ తేజ్ స‌హా ఇత‌ర కుటుంబ స‌భ్యులంద‌రూ ఆదివారం రాత్రి అపోలో హాస్పిట‌ల్‌లోనే ఉన్నారు. రాత్రంతా హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. సాయితేజ్‌కు భుజం ద‌గ్గ‌ర ఉండే ఎముక విరిగింది. ఆయ‌న‌కు ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన న‌లుగురు స్పెష‌లిస్ట్ అపోలో డాక్ట‌ర్స్ ప్రాణాపాయం లేద‌ని, అయితే 48 గంట‌ల పాటు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచామ‌ని తెలిపారు. సోమ‌వారం ఉద‌యం ప‌ది గంట‌ల‌కు అపోలో డాక్ట‌ర్స్ మ‌రో సాయితేజ్ హెల్త్‌పై మ‌రో బులెటిన్‌ను విడుద‌ల చేస్తారు. ఇక ట్విట్ట‌ర్‌లో చిరంజీవి, వ‌రుణ్‌తేజ్ స‌హా హీరోలంద‌రూ సాయితేజ్‌కు ప్రాణాపాయం లేద‌ని తెలియ‌జేస్తూ ట్వీట్స్ చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులు, సాయితేజ్ స్నేహితులు, స‌న్నిహితులు, అభిమానులు సాయిధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిల‌షిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A3dkJT

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...