Sunday 19 September 2021

మిస్ అవుతున్నా, నీ కోసం ప్రార్థిస్తా.. సమంత కామెంట్స్ వైరల్

సమంతకు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ మంది స్నేహితులే. కానీ వారితో ఎంతో సన్నిహితంగా ఉంటుంది. చిన్మయి, నందినీ రెడ్డి, వంటి వారు సమంత బెస్ట్ ఫ్రెండ్స్ కోవలోకి వస్తారు. ఇక సమంత వీరితో చేసే ఫన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆదివారం (సెప్టెంబర్ 19) వెన్నెల కిషోర్ బర్త్ డే. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్‌కు స్పెషల్ విషెస్ చెప్పింది సమంత. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా కూడా వెన్నెల కిషోర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో సమంత వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సమంత చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. నిన్ననే సమంత శ్రీశైలం, శ్రీకాళహస్తి, తిరుపతి అంటూ అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగి చెన్నైకి చేరింది. అయితే నేడు వెన్నెల కిషోర్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన సమంత.. ఎంతో మిస్ అవుతున్నాను అని చెప్పేసింది. హ్యాపీ బర్త్ డే వెన్నెల కిషోర్.. నీ మొహాన్ని ఎంతో మిస్ అవుతున్నాను. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి.. నువ్ ఎలా అయితే నీ పక్క వారిని నవ్విస్తూ సంతోషంగా చూసుకుంటావో.. నిన్ను కూడా అలానే చూసుకునేవారి మధ్యలో ఉంచమని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక సమంత కురిపించిన ప్రేమకు వెన్నెల కిషోర్ తడిసి ముద్దైనట్టున్నాడు. నీ విషెస్‌తో నాకు ఈ రోజు ఎంతో స్పెషల్‌గా మారింది అంటూ వెన్నెల కిషోర్ రిప్లై ఇచ్చాడు. నిన్ను ఎక్కువగా మిస్ అవుతున్నాను అంటూ హగ్స్ ఎమోజీలను షేర్ చేశాడు. మొత్తానికి సమంత, వెన్నెల కిషోర్ స్నేహం గత కొన్నేళ్లుగా ఇలా కొనసాగుతూనే వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hJrNDK

No comments:

Post a Comment

'Nifty Pullback Needs To Be Taken In Stride'

'The biggest near-term risk to Indian equities is the outflow of investments to China as tactical trades by foreign investors.' fr...