ఎదుటి మనిషికి కష్టం వచ్చిందంటే చాలు వారికి సహాయం చేయడంలో మన తెలుగు హీరోలు ఎప్పుడూ ముందుంటారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి గత తరంలో మెగాస్టార్ చిరంజీవి.. ఈ తరం స్టార్ హీరోలు కేవలం సినిమాల నుంచి డబ్బులు సంపాదించడమే కాదు.. సమాజసేవ చేస్తూ కూడా అభిమానులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇక తమ అభిమానులు కష్టాల్లో లేదా అనారోగ్యంతో ఉన్నారు అని తెలిస్తే.. స్వయంగా వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పడం.. ఆర్థిక సహాయం అందించడం చేస్తుంటారు. అలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇక యంగ్ రెబల్స్టార్ కూడా అలాంటి గొప్ప పనే చేసి.. తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అందులో ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తి అయింది. పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇక పోతే.. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో కలిసి ‘ఆదిపురుష్’ అనే సినిమాలు ఆయన చేస్తున్నారు. దీంతో పాటు.. వైజయంతి మూవీస్ బ్యానర్పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ అనే సినిమాలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రభాస్. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. అయితే ప్రభాస్కి వీరాభిమాని అయిన శోభిత అనే అమ్మాయి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుకావాలి అంటే ఆమెకు అత్యంత ఆనందం కలిగించే పనులు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ప్రభాస్ను ఒకసారి చూడాలి అని.. ఆయనతో మాట్లాడాలని.. అదే తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని తెలిపింది. వెంటనే వైద్యులు ప్రభాస్కి ఆమె పరిస్థితిని వివరించడంతో చలించిపోయిన యంగ్ రెబల్స్టార్ ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. తనతో ప్రభాస్ మాట్లాడినందుకు ఆ అమ్మాయి ఎంతగా సంతోషపడిందో అలాంటి స్థితుల్లో ఆ అమ్మాయిని చూసినందుకు మాత్రం చాలా బాధపడ్డాడని అంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XIEQhH
No comments:
Post a Comment