మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . కామెడీ, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు ఆయన. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఐకియా-కేబుల్బ్రిడ్జ్ దాటిన తర్వాత మైండ్స్పేస్ జంక్షన్ ప్రాంతంలో సాయితేజ్ ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్నవాళ్లు ఆయన్ని మెడికోవర్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం.. ఆ తర్వాత తేజ్ను అపోలో ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ తేజ్ తల, వెన్నెముకకు గాయాలు కాలేదని కాలర్ బోన్ విరిగిందని తెలియజేశారు. ఇక అపోలో ఆస్పత్రిలో డాక్టర్ అలోక్ రంజన్ అండ్ టీమ్ తేజ్పై ప్రత్యేక దృష్టి పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆదివారం సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతానికి వెంటిలేటర్పై ఉన్న ఆయనకు నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయిందని వైద్యులు స్పష్టం చేశారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉంది అంటూ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంతో మంది నిపుణులు ఈ వైద్య చికిత్సలో పాల్గొన్నారు అని వాళ్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన పర్యవేక్షణలో ఉన్నారు అని వాళ్లు స్పష్టం చేశారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ఇక సాయి ఈ ఏడాది ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రిపబ్లిక్’ అనే సినిమాతో పాటు.. మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3llniAh
No comments:
Post a Comment