Sunday 12 September 2021

Allu Arjun: వర్షం వల్ల ఆగిన ‘పుష్ప’ షూటింగ్.. ఖాళీ సమయంలో బన్ని ఎక్కడకెళ్లాడంటే?

ఐకాన్ స్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ చిత్రం ‘పుష్ప‌’. ఇది రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా రాజ‌మండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అయితే, శ‌నివారం రాజ‌మండ్రి స‌హా ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురవ‌డంతో సినిమా షూటింగ్ చేయ‌డానికి అవ‌కాశం లేక‌పోయింది. దీంతో సుకుమార్ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసేశాడు. తొలి భాగం పుష్ప ది రైజ్ పేరుతో ఈ ఏడాది క్రిస్మ‌స్‌కు విడుద‌ల కావ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా రూపొందుతుంది. షూటింగ్ లేక‌పోవ‌డంతో అల్లు అర్జున్‌కు ఏం చేయాలో పాలు పోలేద‌ట‌. ఏం చేద్దామా? అని తెగ ఆలోచించి, చివ‌ర‌కు సినిమా చూడాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఇంకేముంది వెంట‌నే త‌న కోర్ టీమ్‌తో క‌లిసి రాజ‌మండ్రికి బ‌య‌లుదేరేసేశాడ‌ట‌. ఇంత‌కీ రాజ‌మండ్రి చేరుకున్న బ‌న్నీ ఏ సినిమా చూశాడో తెలుసా. సీటీమార్‌. బ‌న్నీ సినిమా చూస్తున్నాడ‌ని తెలియ‌గానే అభిమానుల సంతోషానికి అవ‌ధులు లేవు. బ‌న్నీతో సెల్ఫీలు తీసుకోవ‌డానికి అభిమానులు ఆస‌క్తి చూపించారు. రీసెంట్‌గా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌లైన చిత్రాల్లో గోపీచంద్ హీరోగా న‌టించిన ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. తొలి రోజునే దాదాపు మూడు కోట్ల రూపాయ‌ల షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. సంప‌త్ నంది తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. మ‌హిళా క‌బ‌డ్డీ నేప‌థ్యంలో సాగే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సీటీమార్‌ రూపొందింది. త‌మ‌న్నా, దిగంగ‌నా సూర్య‌వంశి హీరోయిన్స్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A729Qf

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...