సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లకు మరింత దగ్గరవుతుంటారు. అయితే ఈ మధ్య సెలెబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. బాగా సంపాదించుకుంటున్నారు. కానీ రేణూ దేశాయ్ మాత్రం తనకు నచ్చిన విషయాలను చెబుతుంటారు. ఇక అది పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారేమో అని ముందుగానే హెచ్చరిస్తుంటారు. అది పెయిడ్ కాదని చెబుతుంటారు. తాజాగా రేణూ దేశాయ్ ఆయుర్వేదం, పంచకర్మ వైద్యాన్ని అందించే సీతారాం బీచ్ రిట్రీట్ గురించి చెప్పుకొచ్చారు. తాను స్వయంగా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేసినట్టుగా తెలిపారు. ‘మనం ఆరోగ్యంగా ఉంటే.. లోపలి నుంచి ఎలాంటి సమస్యలు లేకపోతే.. మన మొహంలోనే ఆ ఆనందం కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగి.. అవసరం అయితే తప్పా.. సర్జరీలకు వెళ్లను. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, జీవిన విధానం వల్ల బీపీ, డయాబెటిస్, ఇమ్యూనిటీ శక్తి లేకపోవడం వంటి వాటికి ఆయుర్వేదం సరిగ్గా పని చేస్తుంది. కనీసం ఒక ఏడాదికి ఒకసారి పంచకర్మను చేయించుకోవాలి. ఈ ప్లేస్ను, ఈ సంస్థను కనుక్కున్నందుకు నాకు నిజంగానే సంతోషంగా ఉంది. కంఫర్టబుల్, లగ్జరీగా ఉండే రూంలు, సంప్రదాయపద్దతులతో ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పటికీ నా జీవితంలోని పది రోజులు ఇక్కడే హ్యాపీగా గడిపాను. ఇంకా మున్ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను’ అని రేణూ దేశాయ్ అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/391qF9G
No comments:
Post a Comment