Saturday, 6 March 2021

Sharwanand: మీడియా వాళ్లు తిట్టారు.. ఒళ్లుదగ్గరపెట్టుకునే ‘శ్రీకారం’ చేశా.. మెగా హీరోల సపోర్ట్‌తోనే: హీరో శర్వానంద్

శ్రీకారం సినిమా చేయడం నా బాధ్యత అని అన్నారు హీరో శర్వానంద్. పండించే వాళ్లు తక్కువైపోయారు.. తినేవాళ్లు ఎక్కువైపోతున్నాం.. ఇలాంటి సందర్భాల్లో ఈ సినిమా చేయకపోతే చాలా మిస్ అయిపోయే వాడ్ని అని అన్నారు శర్వానంద్. వ్యవసాయం నేపథ్యంలో శర్వానంద్, ప్రియాంక్ అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘శ్రీకారం’ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘అందరినీ చూసి చాలా రోజులైంది. చాలా సంతోషంగా ఉంది.. మొదటిగా. సినిమా గురించి మాట్లాడాలంటే.. శ్రీకారం సినిమా కథ విన్నప్పుడు చేస్తా అనేదానికన్నా చెయ్యాలి అనే బాధ్యతగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు.. నేను సిటీలో పుట్టి పెరగడం వల్ల.. రైతు అంటే పెద్దేం తెలియదు.. నాకు కథ విన్నప్పుడు రైతు అనేది మన జీవితంలో.. వాళ్లు పండిస్తే కానీ.. మనం తిండిలేదు.. పండించే వాళ్లు తక్కువైపోయారు.. తినేవాళ్లు ఎక్కువైపోతున్నాం.. ఇంత మంచి కథ రాసుకున్నందుకు కిషోర్ గారికి థాంక్స్.. అలానే మా ప్రొడ్యూసర్ కమర్షియల్ సినిమాలు.. ఇలాంటివి చెయ్యడం చాలా సులభం. కానీ ఇలాంటి కథ చేద్దాం అని నాకు కథ వినిపించి.. వినగానే అరే వినకపోతే ఓ మంచి కథ నేను మిస్ అయ్యేవాడ్నే అనిపించింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే ఫస్ట్ కాల్ చరణ్ దగ్గర నుంచి వచ్చింది. ‘అరే ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ చూడగానే నేను సపోర్ట్ చేస్తా.. ఏం చెయ్యాలి? అంటే.. ఇంత మంచి పాయింట్ మీరు చెబుతున్నారు.. ఈ టైమ్‌లో ఈ ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు సపోర్ట్‌గా ఉండాలి.. అని ఎంత మంచి మాట చెప్పాడో.. థాంక్యూ చరణ్.. గ్రేట్ సపోర్ట్ ఇది. వెంటనే ఆయన చిరంజీవిగారికి ఫోన్ చేసి.. మీరు ఎలాగన్నా.. సపోర్ట్ చెయ్యాలి అని ఒక వీడియో కట్ చేసి చూపించాం ఆయనకి.. ఈ ఎనిమిదో తారీఖున.. ఖమ్మంలో ఫ్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి ఒప్పుకున్నారు చిరంజీవి గారు. అలానే కేటీఆర్ గారికి ఫోన్ చెయ్యగానే.. ఆయన తొమ్మిదో తారీఖు హైదరాబాద్‌లో ఈవెంట్‌కి ఒప్పించాం.. ఎందుకంటే మాకు అలాంటి పెద్దవాళ్లు మాట్లాడితే యూత్ ఇన్‌స్పైర్ చేస్తారు కాబట్టి.. థాంక్యూ చిరంజీవిగారు.. థాంక్యూ కేటీఆర్ గారు.. థాంక్యూ నితిన్, నానీ, వరుణ్ తేజ్ ఫర్ లాంచింగ్ ది ట్రైలర్. హీరోయిన్ ప్రియాంకా తను చాలా మంచి కోస్టార్. ఎప్పుడూ చెబుతా ఆమె పెద్ద స్టార్ కాబోతుందని. అలాగే సాయి మాధవ్ గారి గురించి చెప్పాలంటే.. మాది ‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’తో మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది.. ఆయన పక్కన కూర్చునేవాడ్ని అప్పుడు.. ఆయన రాస్తుంటే ఎలా రాస్తున్నారు ఏంటీ? అని తెలుసుకుంటూ ఉండేవాడ్ని. అది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. మొదటి ఈ కథ అనుకోగానే సాయిమాధవ్ గారు రాస్తే ఈ సినిమాకి మనకు వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాం.. మళ్లీ మళ్లీలో డైలాగ్స్ ట్రెండింగ్ అయ్యాయో మళ్లీ ఇప్పుడు కూడా బాగా అవుతుంది. మీడియా మిత్రులు మీరు కూడా చూసి సినిమా ఎలా ఉందో చెప్పాలి. మీకు వేసే షోకి నేను కూడా వస్తాను.. మీ అభిప్రాయం తెలుసుకుంటాను.. ఎందుకంటే లాస్ట్ రెండు సినిమాలకు తిట్టారు నన్ను.. సో ఒళ్లు దగ్గర పెట్టుకుని మంచి సినిమాలు తీద్దామని ట్రై చేస్తున్నా. మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను.. మంచి సినిమాలు తియ్యడానికే ప్రయత్నిస్తాను’ అంటూ శ్రీకారం సినిమా గురించి చెప్పుకొచ్చారు శర్వానంద్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qmDnG8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....