Sunday, 7 March 2021

వంద వంద వేసుకుని తిన్నాం, తాగాం: విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాత‌గా మారారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా పరిచయమవుతోన్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా ‘జాతిర‌త్నాలు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వ‌రంగ‌ల్‌లో ఆదివారం రాత్రి ఘ‌నంగా నిర్వహించారు. సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఈవెంట్‌కు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌రై ‘జాతిర‌త్నాలు’ బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజ‌రై ఈవెంట్‌ని గ్రాండ్ స‌క్సెస్ చేశారు. See Photos: ఈ కార్యక్రమంలో విజయ్ దేవ‌ర‌కొండ సుధీర్ఘంగా మాట్లాడారు. సినిమా పరిశ్రమలో నవీన్, ప్రియదర్శి, రాహుల్, నాగ్ అశ్విన్‌లతో కలిసి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. కాస్త ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘‘లాక్డౌన్ సమయంలో భయం వేసింది. ఈ ప్యాండమిక్‌లో మళ్లీ సినిమాలకు వస్తారా.. చూస్తారా అని మేమంతా మాట్లాడుకున్నాం. మీరు మాకెంత ముఖ్యమో ఈరోజు తెలుస్తోంది’’ అని ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు విజయ్ దేవరకొండ. ముంబైకి వెళ్తే అక్కడ డైరెక్టర్లు, టెక్నీషియన్లు తెలుగు ఆడియన్స్ గురించే మాట్లాడుతూ ఉంటారని, అడుగుతూ ఉంటారని విజయ్ అన్నారు. ‘‘తెలుగు ఆడియెన్స్ టూ మచ్ అబ్బా. ఏం సినిమాలు చూస్తారు.. ఎంత ప్రేమిస్తారు అని ముంబైలో అంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. ఈవెంట్ అని చెబితే వేల మంది వస్తారు. మా గురించి తిక్క తిక్కగా మాట్లాడితే కొట్లాడతారు అని వాళ్లకు నేను చెబుతాను’’ అని వెల్లడించారు విజయ్. ‘‘నేను మిడిల్ క్లాస్ ఫండ్ అంటే మీరంతా ఇచ్చారు. బర్త్ డే ట్రక్ ఐదు రాష్ట్రాల్లో చేద్దామంటే.. మీరు వచ్చి అన్ని రాష్ట్రాల్లో చేస్తామని అన్నారు. ఇన్ని సినిమాలు, ఇన్ని హిట్లు, ఇన్ని పాన్ ఇండియా అనౌన్స్‌మెంట్లు, ఇంత క్రౌడ్ ఎక్కడైనా ఉంటుందా? తెలుగు వాళ్లను బీట్ చేసే ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎక్కడా లేరు. కాలర్ ఎగరేసి చెబుతున్నా’’ అని గర్వంగా చెప్పారు విజయ్. ఈ ఈవెంట్‌లో వేదికపై ఉన్న వారంతా తన స్నేహితులేనని.. తన జీవితంతో ఏదో ఒకలా ప్రతి ఒక్కరూ ముడిపడి ఉన్నారని విజయ్ దేవరకొండ చెప్పారు. ‘‘కలిసి కలలు కన్నాం.. కష్టాలు చెప్పుకున్నాం.. నవ్వించారు.. ధైర్యమిచ్చారు.. వంద వంద వేసుకుని తిన్నాం, తాగాం. దర్శి లేకపోతే ‘పెళ్ళిచూపులు’లో ప్రశాంత్ లేడు. దర్శి ఇప్పుడు అన్ని ఫ్లాట్‌ఫాంలో చేస్తున్నాడు. ప్రతి రోజూ బిజీగా ఉంటున్నాడు. శివ లేకపోతే అర్జున్ లేడు. రాహుల్ రామకృష్ణను నటుడిగా ఎప్పుడూ గౌరవిస్తాను’’ అని విజయ్ అన్నారు. ఆరేళ్ల క్రితం నవీన్, తను నువ్వు హీరోగా నిలబడుతావ్.. మన ముందు ఓ 25 వేల మంది ఉంటారు అని మాట్లాడుకునేవాళ్లమని విజయ్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు. అలా అనుకుంటూ నవ్వుకునేవాళ్లమని.. కానీ ఇంటికెళ్లి ఇవే కలలు కనేవాళ్లమని, పడుకునే వాళ్లం కాదని అన్నారు. ఆరేళ్ల క్రితం కూడా ఇదే టాలెంట్ ఉందని.. టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇక్కడున్నామని అన్నారు. తాను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణం నాగ్ అశ్విన్ అని అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చేసేటప్పుడు చిన్న చిన్న రోల్స్ ఇచ్చేవాడు నాగి. యాడ్ ఫిల్మ్ చేస్తే నన్ను పెట్టుకున్నాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో కొట్లాడి మరీ రోల్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాగి’’ అని చెప్పారు. హీరోయిన్ ఫరియా ఎంతో ఎనర్జీతో నటించిందని.. ఆమె జర్నీ కూడా తమలాగే మొదలైందని విన్నానని అన్నారు. మొత్తం మీద మార్చి 11న ‘జాతిరత్నాలు’ విడుదలవుతోందని.. సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులకు సూచించారు విజయ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3v5MQ8C

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....