Thursday, 8 October 2020

అనుకోని కష్టాలొస్తాయి జాగ్రత్త! అలాంటి పరిచయాలొద్దు.. మహిళా లోకానికి ఎన్టీఆర్ సూచన

ఓ వైపు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంటే మరోవైపు సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఎన్నోరకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ముఖ్యంగా అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారికి దగ్గరై వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట తారసపడుతూనే ఉన్నాయి. ఎంతోమంది యువతులు కేటుగాళ్ల వలలో పడి మోసపోవడమే గాక మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సామజిక మాధ్యమాల్లో సమాచారాన్ని షేర్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దానిపై తగు సూచనలిచ్చారు యంగ్ టైగర్ . వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం ద్వారా అమ్మాయిలు మోసపోతున్న విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఓ వీడియో రూపొందించారు హైదరాబాద్‌ నగర పోలీసులు. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఓ యువతి పడుతున్న మానసిక క్షోభను ఇందులో చూపించారు. ఈ వీడియో చివర్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అలాంటి మోసాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రతి యువతి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని సూచనలిచ్చారు. Also Read: ''వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావొచ్చు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి. జాగ్రత్త!'' అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో పొరపాటు చేస్తే జరిగే అనర్థాలు అందరికీ అర్థమయ్యేలా చూపిస్తూ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ సందేశం నెటిజన్ల చేత భేష్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కొమురం భీంగా ఎన్టీఆర్ అలరించనున్నారు. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను హుషారెత్తించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lq8tL2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....