Saturday 3 October 2020

Bigg Boss Telugu 4: ఇంకోసారి ఇలా జరిగితే కథ వేరేలా ఉంటుంది.. నాగార్జున సీరియస్

వద్దు మాస్టర్ వద్దు.. ఎక్కువ మాట్లాడితే ‘కథ వేరేలా ఉంటుంది’.. బిగ్ బాస్ హౌస్‌లో సొహైల్ ప్రతిసారి వినిపించే మాట ‘కథ వేరేలా ఉంటుంది’. హౌస్‌లో అర్జున్ రెడ్డి మాదిరిగా మారిన సొహైల్ కోపం వచ్చిందంటే ఉగ్రనరసింహుడు మాదిరి ఊగిపోతుంటాడు.. అరియానా, అభి, రాజశేఖర్ మాస్టర్ ఎలా ఎవరైనా సరే మనోడితో గొడవ పడిన సందర్భాల్లో ‘కథ వేరేలా ఉంటుంది’ అంటూ వార్నింగ్‌లు ఇచ్చేశాడు. ఇక ఆ ఉక్కు హృదయం టాస్క్‌లో అయితే ‘కథ వేరేలా ఉంటుంది’ అంటూ రచ్చ రచ్చ చేశాడు సొహైల్. అయితే ఇప్పుడు మనోడి కథను వేరేలా చూపిస్తున్నారు కింగ్ నాగార్జున. ఎవరి ఆట వాళ్లు ఆడకుండా పిచ్చి ఆటలు ఆడితే కథ వేరేలా ఉంటుంది అంటూ సొహైల్‌కి వార్నింగ్ ఇస్తూ శనివారం నాటి ప్రోమోను వదిలారు. శని, ఆదివారాల్లో బిగ్ బాస్ షోలో నాగార్జున ఎంట్రీ ఉండటంతో ఎవరికి ఎలాంటి క్లాస్ పీకుతారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక గత వారం నాగార్జున అందరికీ గట్టిగానే క్లాస్ పీకుతారని భావించినప్పటికీ.. సింపుల్‌గా కానిచ్చేశారు. అయితే ఈవారం మాత్రం కాస్త ఫైర్‌లోనే ఉన్నారు ప్రోమో వరకూ. దొంగా దొంగా వచ్చాడే అనే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి.. ఇంట్లో అందరూ దొంగలే.. ఎవరు మంచి దొంగో.. ఎవరు భలే దొంగో చూసేద్దాం అంటూ ఇంటి సభ్యులతో ఆటాడిస్తున్నారు. ఎవరి ఆట వాళ్లు ఆడాలి.. ఇంకోసారి ఇలా జరిగింది అంటే కథ వేరేలా ఉంటుంది అంటూ సొహైల్‌కి ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తూ కనిపించారు నాగార్జున. ఆ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GuxMMX

No comments:

Post a Comment

'Kashmiri Youth Don't Want To Die'

'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD