Wednesday 17 June 2020

S. S. Rajamouli: స్వయంగా చిరంజీవి అడిగారు.. భయమేసి కాదన్నా: ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి

ప్రతీ హీరోకి తన మొదటి సినిమా ఓ అపురూప జ్ఞాపకం. అది హిట్టయినా, ఫట్టయినా ఆ సినిమా తాలూకు విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే మొదటి సినిమాను ఏ డైరెక్టర్‌తో చేయాలనే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు సినీ తారలు. ఈ క్రమంలోనే కొడుకు రామ్ చరణ్‌ని సినిమాల్లో పరిచయం చేసే ఆఫర్ ముందుగా రాజమౌళికే ఇచ్చారట మెగాస్టార్ . అయితే ఆ సమయంలో తన ఫీలింగ్స్ ఏంటి? ఎందుకు చేయలేకపోయాను అనే విషయాలను తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు జక్కన్న. రామ్ చరణ్‌ని పరిచయం చేయాల్సిందిగా చిరు కోరినప్పటికీ.. మెగా హీరో ఎంట్రీ అంటే భయమేసిందని, పైగా రామ్ చరణ్ లోని నటనా శైలి, బలాబలాలు తెలియకుండా హ్యాండిల్ చేయడం కష్టమని భావించి కాదన్నానని చెప్పారు . చిరంజీవి కుమారుడు కాబట్టి అభిమానుల్లో ఉండే భారీ అంచనాలను మనసులో పెట్టుకొని ఆ ఆఫర్‌ను వదిలేసుకున్నానని తెలిపారు జక్కన్న. Also Read: కాగా రామ్ చరణ్ ఫస్ట్ మూవీ 'చిరుత'కు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతనే చెర్రీతో 'మగధీర' మూవీ చేసి ఆయనను భారీ హిట్ ఇచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా (రౌద్రం రణం రుధిరం) మూవీ చేస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు సహా అశేష ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fGfy7v

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...