Friday, 4 October 2019

టెంపర్ సినిమా అప్పులు.. బండ్ల గణేష్ పై కేసు

ముందు కమెడియన్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడ చాలా సినిమాలు చేసాడు. అయితే అతను సడెన్‌గా నిర్మాతగా మారి సినిమాల నిర్మాణం స్టార్ట్ చెయ్యడంతో అంతా కూడా షాక్ అయ్యారు. ఒక ప్రముఖ పొలిటీషియన్‌కి గణేష్ బినామీ కావడం వల్ల అతనికి అంత డబ్బు వచ్చింది అని చాలామంది మాట్లాడుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుకున్న బండ్ల జూనియర్ ఎన్టీఆర్‌తో బాద్షా అనే సినిమా చేసాడు. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చినా కూడా ఓవర్ బడ్జెట్ వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. అయినా కూడా మళ్ళీ ఎన్టీఆర్‌తో టెంపర్ అనే సినిమా ప్రొడ్యూస్ చేసాడు బండ్ల. Also Read: టెంపర్ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న ఎన్టీఆర్‌ని టెంపర్ హిట్ ట్రాక్ ఎక్కించింది. అలాగే పూరి జగన్నాధ్‌కి కూడా చెప్పదగ్గ హిట్ గా నిలిచింది టెంపర్. ఆ సినిమాకి భారీ లాభాలు అయితే రాలేదు. అలా అని నష్టాలు కూడా రాలేదు. కానీ ఆ సినిమా తరువాత సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న గణేష్ పేరు ఎక్కువగా వివాదాల్లో వినిపించింది. ముందు తెలుగు సినిమా నటుడు, నిర్మాత అయిన సచిన్ జోషి, బండ్ల గణేష్ తనని మోసం చేసి డబ్బులు కాజేసాడు అని అలిగేషన్స్ చేసాడు. ఆ వివాదంలో కూడా టెంపర్ సినిమా టైమ్‌లో జరిగిన లావాదేవీల గురించే మాట్లాడారు. కానీ తరువాత ఆ విషయం మరుగునపడిపోయింది. బండ్ల గణేష్ కూడా కామ్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా పరాజయం పాలయ్యాడు. Also Read: అయితే ఇప్పుడు బండ్ల గణేష్ మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు ప్రముఖ నిర్మాత, అధినేత అయిన పొట్లూరి వర ప్రసాద్. 2013లో టెంపర్ సినిమా నిర్మాణ సమయంలో 30 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కింద అయన నుండి తీసుకున్నాడు బండ్ల గణేష్. కానీ రూల్ ప్రకారం ఆ అమౌంట్ తిరిగి చెలిస్తే కానీ సినిమా రిలీజ్ కాదు. కాకపోతే ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ కొద్దిగా ఇచ్చి ఆ సినిమా రిలీజ్‌కి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. 2013 నుంచి తిరిగి డబ్బులు చెల్లించని బండ్ల గణేష్. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినిపించుకోలేదట. డబ్బుల కోసం ఎన్ని సార్లు అడిగినా ఉపయోగం లేకుండా పోయిందని పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. డబ్బులు ఇవ్వకపోగా పీవీపీని బండ్ల గణేష్ బెదిరించడం ప్రారంభించాడట. Also Read: నిన్న రాత్రి పీవీపీ ఇంటికి కొంతమంది మనుషులు వచ్చి బండ్ల గణేష్‌ను డబ్బులు అడిగిన పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారట. ఇదే విషయాన్ని తెలుపుతూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పీవీపీ. తన డబ్బులు ఇవ్వమని అడిగితే బండ్ల గణేష్ తనని బెదిరిస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 420, 448, 506 R/W 43 ipc సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరో గా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మంచి పాత్ర దక్కించుకుని మళ్ళీ నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నారు . ఈ టైమ్‌లో ఆ ఆరోపణలు రావడం అనేది ఆయన కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31P8sa1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....