యువ కథానాయకుడు శర్వానంద్ ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమా తర్వాత శర్వానంద్ ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా ఉండింది. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఓ తమిళ దర్శకుడితో శర్వానంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా? రాజు సుందరం. ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరున్న రాజు సుందరం తమిళంలో సినిమాలు డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. శర్వానంద్తో రాజుసుందరం దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గానే రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే నిర్మాత, ఇతర వివరాల గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ ఇప్పుడు తన ఆశలన్నీ మహా సముద్రం సినిమాపైనే పెట్టుకున్నాడు. దీంతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా లైన్లో ఉంది. ఒకటి. ఇది పూర్తయిన తర్వాతే, శర్వానంద్, రాజు సుందరం మూవీ సెట్స్ పైకి వెళుతుంది.ఇప్పటికే తమిళం, తెలుగులో శర్వానంద్ ఓ ద్వి భాషా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. పడిపడిలేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం చిత్రాలు శర్వానంద్ కెరీర్లో డిజాస్టర్గా నిలిచాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tU3JTq
No comments:
Post a Comment