Tuesday 14 September 2021

శ్రీవారి సేవలో శ్రీయ దంపతులు.. తిరుమలలో రొమాంటిక్ కపుల్ సందడి

సినీ నటి, హీరోయిన్ .. శ్రీవారి సేవలో భాగమయ్యారు. తన భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌తో కలిసి తిరుమల కొండెక్కిన ఆమె, ఈ రోజు (మంగళవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆయన అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మీడియాలో మాట్లాడిన శ్రీయ.. కోవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామి వారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. తన భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌ తొలిసారి స్వామివారిని దర్శించుకొని ఆనందంగా ఫీల్ అయ్యారని ఆమె తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఈ రొమాంటిక్ కపుల్ సందడి కనిపించింది. ఈ సందర్భంగా శ్రీయకి ఆప్యాయంగా ముద్దు పెట్టాడు ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన శ్రీయ.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీలో నటిస్తోంది. భారీ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా ఆమె నటిస్తోంది. దీంతో పాటు మరో మల్టీ లాంగ్వేజ్‌ మూవీ 'గమనం' మూవీలో నటిస్తోంది శ్రీయ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k8mn6y

No comments:

Post a Comment

Rekha: 'I Welcome Pain. It Helps Me Grow'

'I don't know of any happy moment in my life which has helped me to grow, whereas pain has always been a means to evolve.' fro...