టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వంత వచ్చింది. ఈడీ విచారణలో భాగంగా నేడు(సెప్టెంబర్ 9) రవితేజ హాజరు అయ్యారు. గురువారం ఉదయం రవితేజ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. నేడు రవితేజతో పాటు ఆయన డ్రైవర్ కూడా హాజరు కావాల్సి ఉంది. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో భాగంగా సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయమే రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ విక్రేత కెల్విన్తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? అనే విషయాలతోపాటు ఎఫ్క్లబ్ గురించి కూడా సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, నందులను అధికారులు ప్రశ్నించారు. ఇందులో మరీ ముఖ్యంగా రానా, రకుల్ పేర్లను ఎఫ్ క్లబ్తో ముడిపెట్టేశారు. ఎఫ్ క్లబ్ మేనేజర్గా నవదీప్ ఉన్న సమయంలోనే ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే నేడు రవితేజపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించేలా ఉన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YFpyup
No comments:
Post a Comment