Tuesday 14 September 2021

సైదాబాద్ హత్యాచార ఘటన.. ఆ బాధను ఊహించలేకపోతోన్నా.. మహేష్ బాబు ఆవేదన

గత కొన్ని రోజులుగా మీడియాతో మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ ప్రమాద ఘటన మీద కవర్ చేస్తోన్న మీడియా.. ఆరేళ్ల చిన్నారి మీద అత్యాచార ఘటన జరిగితే మాత్రం స్పందించడం లేదు అని నెటిజన్లు ఏకిపారేస్తూ వచ్చారు. ఇక సెలెబ్రిటీలు సైతం మెల్లిమెల్లిగా ఈ ఘటన మీద స్పందిస్తున్నారు. ఇక నేడు మనోజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాడు. అలాంటి రాక్షసుడిని వెంటనే ఉరి తీయాలి.. ఎక్కడున్నా వాడిని పట్టించాలని అందరినీ కోరాడు. ఇక తాజాగా సూపర్ స్టార్ స్పందించాడు. ఇలాంటి ఘటనల మీద మహేష్ బాబు వెంటనే స్సందిస్తుంటాడు. సామాజిక స్పృహ ఉన్న మహేష్ బాబు.. సమాజంలోని ఇలాంటి వికృత ఘటనలపై స్పందిస్తుంటాడు. తాజాగా సైదా బాద్ ఘటనపై మహేష్ బాబు స్పందిస్తూ.. భావోద్వేగానికి గురయ్యాడు. 'ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేకపోతోన్నా' అంటూ మహేశ్‌ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ln5JzI

No comments:

Post a Comment

National Award Winner: 'Struggle Toh Kiya Hi Hai'

'I have no family (in the industry), no network, no mentor.' from rediff Top Interviews https://ift.tt/5d3nCMz