మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇసుక, మట్టి వల్ల స్కిడ్ అవ్వడం బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దుర్గం చెరువు, ఐకియా ప్రాంతంలో వేగంగా వెళ్తోన్న అలా బైక్ ప్రమాదానికి గురవ్వడం, వెంటనే స్పృహ కోల్పోవడం వంటివి జరిగాయి. ఆ వెంటనే మెడికోర్ హాస్పిటల్కు తరలించారు. గోల్డెన్ అవర్లో అందించిన చికిత్స వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్కు అపోలో వైద్యులు చేసిన సర్జరీ కూడా సక్సెస్ అయింది. ఇక మీడియా అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం విషయంలో రాస్తోన్న వార్తలపై ట్రోల్స్ ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అసలు ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు, అంబులెన్స్కు కాల్ చేసిన వ్యక్తిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రోడ్డు మీద రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ వాటికి చలించి.. సంబంధిత అధికారులకు సమాచారాన్ని ఇచ్చేది మాత్రం కొంత మందే. అలా సాయి ధరమ్ తేజ్ విషయంలో సకాలంలో స్పందించి.. పోలీసులు, 108కు కాల్ చేశాడు అనే ఓ వ్యక్తి. అబ్దుల్ మీడియాతో మాట్లాడుతూ.. యాక్సిడెంట్ జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పృహు కోల్పోయాడట. మొహం పై వాటర్ చల్లినా చలనం లేదని అన్నాడు. యాక్సిడెంట్ జరిగిన వెంటనే డయల్ 100, 108కి కాల్ చేశాడట. సాయి ధరమ్ తేజ్ మొబైల్ నుంచి బంధువులకు కాల్ చేసే ప్రయత్నం చేద్దామని చూస్తే లాక్ వేసి ఉందట. జేబులోంచి వాలెట్ తీస్తే.. అందులో డబ్బులు మాత్రమే ఉన్నాయని, కాంటాక్ట్స్ లేకపోవడంతో డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చానని అన్నాడు. ఇక అబ్దుల్ గురించి మాట్లాాడుతూ సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ ఓ పోస్ట్ చేశారు. చాలా మంది లాగే తను కూడా సహాయం చేయకుండా.. సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38XdgiW
No comments:
Post a Comment