సినిమా.. సినిమాకి తన నటనతో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటారు యువ నటుడు . హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం అతను వెనకడుగు వేయరు. తాజాగా తెలుగు తెరపై తెరకెక్కిన తొలి హాకీ చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’తో సందీప్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త నిరాశ పరిచింది. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ చేస్తున్న మరో కామెడీ ఎంటర్టైనర్ ‘’. చాలారోజుల క్రితమే ఈ సినిమా టీజర్ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ను విడుదల చేశారు. ‘నీకు తెలిసిన రౌడీ ఎవరైనా ఉన్నారా?’ ‘తను నిజంగానే రౌడీయా’ అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్స్తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది. అయితే ఓ సమస్యలో చిక్కుకున్న కుటుంబానికి సహాయం చేసే క్రమంలో చిక్కుల్లో పడ్డ రౌడీ పాత్రలో సందీప్ కిషన్ ఈ సినిమాలో కనిపిస్తారని.. ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక ఎక్కువశాతం కామెడీ కంటెంట్తో సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకులతో నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్లోనే ఇంతకామెడీ ఉంటే సినిమాలో ఇంకెంత కామెడీ ఉంటుందో అంటూ వాళ్లు అంచనాలు వేస్తున్నారు. ఇక ట్రైలర్ చివర్లో ‘పులి ఎవర్రా?’ అని సందీప్ కిషన్ అడిగితే.. ‘కొన్నిసార్లు రౌడీలను పులి అంటారు’ అంటూ వైవాహర్ష చెప్పడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nqZHAA
No comments:
Post a Comment