టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ ఓ బాలీవుడ్ స్టార్తో కలిసి నటించబోతున్నారు. అవునా..నిజమేనా! అనిసందేహం అక్కర్లేదు. ఇది నిజమే.. అయితే మహేశ్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించబోయేది సినిమాలో కాదు, కమర్షియల్ యాడ్లో. రీసెంట్గా పాన్ బహార్ ఇలాచీ అనే కమర్షియల్ యాడ్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఇందులో మహేశ్, టైగర్ ష్రాఫ్ నటించారు. ఈ యాడ్కు సంబందించిన చిన్న వీడియోను మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేటితరం అగ్ర కథానాయకుల్లో సినిమాలతోనే కాదు, కమర్షియల్ ప్రకటనలతోనూ బిజీగా ఉంటున్నారు. మహేశ్ తన యాడ్స్లో బాలీవుడ్ స్టార్స్తో కలిసి నటించడం కొత్తేమీ కాదు. ఇది వరకు థమ్సప్ యాడ్లో రణ్వీర్ సింగ్తో కలిసి నటించిన మహేశ్, ఇప్పుడు టైగర్ ష్రాప్తో కలిసి నటించడం విశేషం. కచ్చితంగా సూపర్స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ కిక్కును కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు. దక్షిణాదిలో మహేశ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకనే ఆయన్ని పలు సంస్థలు తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక బాలీవుడ్లో టైగర్ష్రాఫ్కు యూత్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజ్ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో వాణిజ్య సంస్థలు ఆలోచనలు చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రీకరణతో బిజీగా ఉన్న మహేశ్ తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kVTABx
No comments:
Post a Comment