ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న తాజా సినిమా ‘లవ్స్టోరీ’. ఈ రియలిస్టిక్ ప్రేమకథలో , జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలమే అయింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం ఈ సినిమా విడుదలపై తీవ్రంగా పడింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికి రెండుసార్లు వాయిదాపడింది. తాజాగా అన్ని అడ్డంకులను దాటుకొని.. సెప్టెంబర్ 24వ తేదీన సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇక సినిమా నుంచి ఇప్పటివరకూ విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అందించిన సంగీతం హైలైట్గా నిలిచింది. ‘సారంగ దరియా’, ‘నీ చిత్రం చూసి’ వంటి పాటలు.. విడుదల అయి చాలాకాలమే అయినా.. ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సూపర్స్టార్ నుంచి విషెస్ లభించాయి. సినిమా ట్రైలర్ని షేర్ చేసిన మహేష్ చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. ‘‘తెలుగులో డ్యాన్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు చాలా అరుదు.. ఇది అలాంటి సినిమా. ఈ సినిమాను థియేటర్లో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీమ్కి ఆల్ ది బెస్ట్’’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఇందులో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EBtnB8
No comments:
Post a Comment