Wednesday 8 September 2021

దర్శకుడికి సారీ చెప్పిన రష్మకి మందన్నా.. అందుకే అలా జరిగిందట!

ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ అయ్యారు. దానికి కారణం టాలీవుడ్‌లో ఆమె లక్కీ హీరోయిన్‌గా మారడమే. అలా టాలీవుడ్‌కు రష్మికను పరిచయం చేసింది మాత్రం దర్శకుడు వెంకీ కుడుముల. ఛలో సినిమాతో రష్మిక మందన్నా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే రష్మిక ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలా తనకు టాలీవుడ్ అవకాశాన్ని ఇచ్చిన అంటే రష్మికకు ప్రత్యేక అభిమానం. అందుకే భీష్మ సినిమాలో చేయమని అడిగిన వెంటనే రష్మిక ఒప్పేసుకున్నారట. అయితే తాజాగా వెంకీ కుడుముల బర్త్ డే జరిగింది. నిన్న (సెప్టెంబర్ 8) వెంకీ కుడుముల పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు దర్శకుడికి విషెస్ అందించారు. కానీ రష్మిక మాత్రం ఎప్పుడో రాత్రి ఆలస్యంగా విష్ చేశారు. అందుకే ఆ దర్శకుడికి రష్మిక సారీ చెప్పేశారు. ఆలస్యంగా విష్ చేయడానికి గల కారణాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్య యూనిట్ మొత్తం మళ్లీ మారెడుమిల్లీకి చేరుకుంది. అటవీ ప్రాంతంలో షూటింగ్, సిగ్నల్స్ లేని కారణంగానే ముందుగా విష్ చేయలేకపోయాను అని దర్శకుడిని క్షమించమని రష్మిక అడిగేశారు. మొత్తానికి రష్మిక మాత్రం వెంకీపై ఇలా ప్రత్యేక అభిమానాన్ని చాటడంతో అందరూ ఫిదా అవుతున్నారు. ఇక రష్మిక మాత్రం ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లంటూ ఫుల్ బిజిగా తిరుగుతున్నారు. మొన్నీ మధ్యే బాలీవుడ్ డెబ్యూ మజ్ను సినిమా షూటింగ్ పూర్తయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BV5Zg4

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...