సోషల్మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి రూమర్స్ పెరగడం కూడా మొదలైంది. ముఖ్యంగా సినిమా నటుల విషయంలో ఇది చాలాకాలంగా జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా సినిమా నటుడు లేదా నటి కొంతకాలం వెండితెరపై కనిపించకపోతే చాలు.. వాళ్లు సినిమాలు మానేస్తున్నారు అని లేదా.. మరణించారు అని వార్తలు రాసిన ఘటనలు కూడా చాలా జరిగాయి. తాజాగా మంచు మోహన్బాబు కుమారుడు మంచు మనోజ్కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ‘దొంగ దొంగది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ హీరో ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. విలక్షణమైన నటనతో ఆయన ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచారు. అంతేకాక.. డూప్ లేకుండా స్టంట్స్ చేస్తూ.. టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు మనోజ్. తన నటనను చూసి.. ఆయనకు ‘రాక్స్టార్’ అంటూ బిరుదు ఇచ్చారు అభిమానులు. అయితే గత కొంతకాలంగా మనోజ్కు సరైన హిట్ లభించలేదు. చివరిగా ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమాలో ఆయన కనిపించారు. ప్రస్తుతం ఆయన ‘అహమ్ బ్రహ్మస్మి’ అనే సినిమాలో నటిస్తున్నారు. కానీ, మనోజ్ స్క్రీన్పై కనిపించి చాలాకాలం కావడంతో ఆయన సినిమాలు మానేస్తున్నారు అంటూ కొందరు వార్తలు రాశారు. దీనిపై మనోజ్ స్పందించారు. ఓ ప్రముఖ వార్త సంస్థ పోస్ట్ చేసిన న్యూస్ని షేర్ చేసిన ఆయన.. ‘అన్నో.. ఇలాంటి తప్పుడు వార్తలు పోస్ట్ చేయకండి. సమ్మర్ నుంచి మన సినిమా స్టార్టు.. యాక్షన్ అని చెప్పకముందే కట్ చెప్పాడు అన్న. ఏదైమైనా ఐ లవ్ యూ అన్న.. నీ నెక్ట్స్ ఆర్టికల్ని నా బెస్ట్ విషెస్’ అంటూ బ్రహ్మానందం దండం పెడుతున్న ఫోటోలతో ట్వీట్ చేశారు. అయితే దీనిపై సదరు మీడియా సంస్థ కూడా స్పందించింది. ఆయన ఇచ్చిన క్లారిటీపై కూడా ఓ వార్తను రాసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WcaTWf
No comments:
Post a Comment