Sunday 22 August 2021

'ఖిలాడీ' అప్‌డేట్.. ఫస్ట్ సింగల్‌తో మాస్ మహారాజ్ రెడీ!!

మాస్ మహారాజ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'ఖిలాడి'. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. కాగా ఈ రోజు (ఆగస్టు 22) రమేష్ వర్మ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ ఓ అప్‌డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 10వ తేదీన '' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ‘రాక్షసుడు’ వంటి విజయం తర్వాత రమేష్ వర్మ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆ అంచనాలకు రెక్కలు కట్టాయి. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ అని, జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా? భావోద్వేగాలకు ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అని ఆలోచింపజేసే పాత్రల సమ్మేళనమే ఈ 'ఖిలాడీ' మూవీ అంటున్నారు మేకర్స్. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతిత్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j4t21h

No comments:

Post a Comment

'Rakesh Jhunjhunwala Inspires Investors'

'More investors now view the stock market as a valuable opportunity, though many still seek quick gains, leading to a rise in futures an...